Daily Current Affairs in Telugu 20-01-2020
బాజాపా జాతీయ అద్యక్షుడిగా మాజీ మంత్రి జేపి నడ్డా:
భారత జనత పార్టీ జాతీయ అద్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.హిమాచల్ ప్రదేశ్ కు చెందిన 59ఏల్ల నడ్డా అటు ప్రదాని నరేంద్ర మోడి కి ,ఇటు ఆర్ఎస్సేస్ కు విశ్వసనీయుడు కావడంతో ఈ ఎన్నిక లాంచన ప్రాయమెనని ముందు నుంచి ప్రచారం జరిగింది.ఆయనొక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయిందని పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ బాధ్యుడు రాధామోహన్ సింగ్ ప్రకటించారు. కేంద్ర మంత్రులు అమిత్ శ ,రాజ్నాథ్ సింగ్ ,నితిన్ గడ్కారి వివిధ రాష్ట్రాల నేతలను తోడుగా రాగా నడ్డా నామినేషన్ దాఖలు చేశారు
క్విక్ రివ్యూ:
ఏమిటి: బాజాపా జాతీయ అద్యక్షుడిగా మాజీ మంత్రి జేపి నడ్డా
ఎక్కడ:డిల్లి
ఎవరు: జగత్ ప్రకాష్ నడ్డా
ఎపుడు: జనవరి 20
ఖేల్ ఇండియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు స్వర్ణం :
ఖేల్ ఇండియా క్రీడల్లో మూడో సీజన్లో ఆంధ్రప్రదేశ్ వేయిట్లిఫ్టర్ షేక్ లాల్ బషీర్ స్వర్నంతో మెరిశారు.జనవరి 20 అండర్ -17 బాలుర వెయిట్ లిఫ్టింగ్ 81కేజీల విభాగంలో అతను 254 కిలోల బరువులెత్తి అగ్రస్థానంలో నిలిచాడు..మరో ఆంద్ర వెయిట్ లిఫ్టర్ రవిశంకర్ 249కిలోల )రజతం సొంతం చేసుకున్నాడు.అండర్ -21 బాలుర 89 కేజీల విభాగంలో ఎపి క్రీడాకారుడు శివ రామకృష్ణ (275 కిలోల ) ,తెలంగాణా క్రీడా పాతశాలకు చెందిన కార్తిక్ (269కిలోల)వరుసగావెండి ,కంచు పతకాలు గెలుచుకున్నారు.ఇప్పటి వరకు జరిగిన పోటీ లలో ఆరు స్వర్ణాలతో సహా మొత్తం 14 పథకాలతో తెలంగాణా 15వ స్థానం లో ఉంది.రెండు బంగారు పతకాలు ,4రజతాలు ,6స్వర్ణాలతో ఆంద్ర ప్రదేశ్ 23 స్థానంలో కొనసాగుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఖేల్ ఇండియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు స్వర్ణం
ఎక్కడ: గుహవతి
ఎవరు: షేక్ లాల్ బషీర్
ఎపుడు: జనవరి 20
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
దీపా వెంకట్ కు చాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు:
దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవాలు అందించిన పలువురికి చాంపియన్స్ ఆఫ్ చేంజ్ -2019 అవార్డులను ప్రకటించారు.డిల్లిలో జనవరి 20 న నిర్వహించిన కార్యక్రమంలో మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముకర్జి ఈ అవార్డును అందజేశారు.స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను అందజేశారు.స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను చేపడుతున్నందుకు స్వర్ణ స్వర్ణ భారత్ ట్రస్టీ ,ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ ,చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు సినీ నిర్మాత అల్లు అరవింద్ ,స్వచ్చ అభియాన్ కింద శ్మశాన వాటికలను నిర్వహిస్తున్న ఫీనిక్స్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి అవార్డులను అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దీపా వెంకట్ కు చాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు
ఎక్కడ:డిల్లి
ఎవరు: దీపా వెంకట్
ఎపుడు: జనవరి 20
ఎస్.బి.ఐ ఎండి గా చల్ల శ్రీనివాసులు శెట్టి:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)మేనేజింగ్ డైరెక్టర్ గా (ఎండి) చల్ల శ్రీనివాసులు శెట్టి ని ప్రబుత్వం ఆయన ఎస్బిఐ లో డిప్యుటీ ఎండిగా శ్రీనివాసులు శెట్టి ని నియమించే ప్రతిపాదనకు నియామకాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గ కమిటీ ఆమోదం తెలిపిందని అదికారిక ఆదేశాల ప్రకారం తెలుస్తోందని ఎండి గా అధికారిక ఆదేశాల ప్రకారం తెలుస్తుంది.ఎండి గా బాద్యతలు చేపట్టిన నుంచి ఆయన మూడేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.పనితీరు ఆదారంగా పదవి కాలాన్ని మరో రెండేళ్ళు పాటు పొడగించే వీలు కూడాఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎస్.బి.ఐ ఎండి గా చల్ల శ్రీనివాసులు శెట్టి:
ఎక్కడ:డిల్లి
ఎవరు: చల్ల శ్రీనివాసులు శెట్టి
ఎపుడు: జనవరి 20
ప్రొఫెసర్ సాయి బాబా కు ముకుందన్ సి.మీనన్ అవార్డు:
మానవ హక్కుల పౌర హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా వచ్చే ఏటా ఇచ్చే “ముకుందన్ సి.మీనన్ అవార్డును 2019” సంవత్సరానికి గాను డిల్లి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.సాయి బాబా కు నేషనల్ కన్సడరేషణ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్సి హెచ్ఆర్వో)ప్రకటించింది.90శాతం అంగ వైకల్యంతో బాదపుతున్న ఇతరుల సాయం లేకుండా కదలల్లేని పరిస్థితుల్లో ఉన్న సాయి బాబా తాను ఎంచుకున్న మార్గం నుంచి పక్కకు తపుకోలేదని సంస్థ పేర్కొంది.ఆదివాసులపై అణచివేత ,ఖనిజ దోపిడీ పై ప్రొఫెసర్ సాయి బాబా తన రచనలు కొనసాగిస్తున్నారని అవార్డు జ్యూరీ సబ్యులు అబిప్రాయపడ్డారు.అవార్డు కింద రూ.25వేల నగదు ,ప్రశంశా పత్రం ను అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రొఫెసర్ సాయి బాబా కు ముకుందన్ సి.మీనన్ అవార్డు
ఎక్కడ:డిల్లి
ఎవరు: ప్రొఫెసర్ సాయి బాబా
ఎపుడు: జనవరి 20