
Daily Current Affairs in Telugu -05-12-2019
ఐఐటి ఆచార్యుడికి ఎంపిక అవకాశం:

ఐఐటి హైదరాబాద్ లోని లిబరల్ ఆర్ట్స్ విభాగంలో పని చేస్తున్న సహాయక ఆచార్యుడి కి అరుదైన అవకాశం దక్కింది. నేచర్ జర్నల్ సంబంధించిన పాల్ గ్రేవ్ కమ్యూనికేషన్ ఎదిటోరియంలో బోర్డుకు డాక్టర్ ప్రకాష్ మండల్ సబ్యుడిగా ఏమ్పికయ్యారు.పరిశోదన పత్రాలను విశ్లేషించి అవి ప్రచురణకు అర్హమేనా అనే నిర్ణయం తీసుకోవడం ఈ బోర్డు సబ్యుల బాద్యత.ప్రస్తుతం ఇందులో ఇద్దరు బారతియులు మాత్రమె సబ్యులుగా ఉందనగా వారిలో ఒకరు ప్రకాష్ కావడం విశేషం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఐఐటి ఆచార్యుడికి ఎంపిక అవకాశం
ఎక్కడ: హైదరాబాద్
ఎవరు: డాక్టర్ ప్రకాష్ మండల్
ఎప్పుడు: డిసెంబర్ 05
తెలుగు వైద్యుడికి జాతీయ పురస్కారం :

నిజామాబాద్ ప్రబుత్వ వైద్య కళాశాలలో మత్తు విభాగం అధిపతి గా సేవలందిస్తున్న డా.కిరణ్ కు జాతీయ వైద్య పురస్కారం లభించింది. డిల్లీలో అంతర్జాతీయ వ్యాపార మండలి అంతర్జాతియ విద్య నిర్వహణ సంస్థ ,జాతీయ సంఘీబావ మండలి ,భారతీయ ఆర్ధిక ప్రగతి సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమలో జాతీయ పరిక్షల బోర్డు అధిపతి బిపిన్ బాత్ర చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలుగు వైద్యుడికి జాతీయ పురస్కారం
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: డిసెంబర్ 05
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఘట్టాలను ప్పుస్తక రూపం :

మూడేల్ల కాలంలోనే నిర్మాణం పూర్తయి, రైతాంగానికి నీటిని సరపరా చేసే దశకు చేరుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఘట్టాలను అన్నింటిని ఒక దగ్గర చేర్చి చరిత్రకు అందించిడం ప్రశంసించనీయమని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ నిటి పారుదల శాఖ ప్రత్యేకదికారి శ్రీదర్ రావు దేశ్ పాండే రాసిన “కాలేశ్వర్ ప్రాజెక్ట్ –తెలంగాణ ప్రగతి రథం “ పుస్తకాన్ని డిసెంబర్ 05న ఆయన ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమగ్ర సమాచారం ,చరిత్రను తెలియచేస్తూ సమగ్ర గ్రందాన్ని రాశారంటూ దేశ్ పాండే ను అభినధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఘట్టాలను ప్పుస్తక రూపం
ఎక్కడ: తెలంగాణ
ఎవరు: శ్రీదర్ రావు దేశ్ పాండే
ఎప్పుడు:డిసెంబర్ 05
పురుషుల వన్డే మ్యాచ్ కు రిఫరిగా లక్ష్మి ఎంపిక :

తెలుగు మహిళా మాజీ క్రికెటర్ జిఎస్.లక్ష్మి అరుదైన ఘనత సాధించనుంది. పురుషుల వన్డే కు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన తొలి భారత మహిళగా ఆమె నిలవబోతుంది. ప్రపంచకప్ లీగ్-2 టోర్నీ మూడో సిరీస్ లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ,అమెరికా మద్య డిసెంబర్ 08 న జరిగే తొలి వన్డే లో లక్ష్మి మ్యాచ్ అధికారిగా పని చేయనునది. ఈ మేలో ఐసిసి మ్యాచ్ రిఫరీల ప్యానల్లో చోటు దక్కించుకుని వార్తలలో నిలిచిన 51 ఎల్ల లక్ష్మికి ఒక వన్డే మ్యాచ్ కు రిఫరీగా వ్యవహిరించబోతుండడం ఇదే తొలిసారి.2006 -09 సీజన్లో మహిళల క్రికెట్ దేశవాళి మ్యాచ్ లకు రిఫరీగా పనిచేసిన ఆమె అంతర్జాతీయ క్రికెట్ 16 మహిళల వన్డే లు ,7టి20 లకు ,16 పురుషుల టి20 లకు మ్యాచ్ అధికారిగా భాద్యతలు నిర్వర్తించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పురుషుల వన్డే మ్యాచ్ రిఫరిగా లక్ష్మి
ఎక్కడ: దుబాయి
ఎవరు: జిఎస్ లక్ష్మి
ఎప్పుడు:డిసెంబర్05
దక్షిణాసియ క్రీడల్లో భారత్ పతకాల పంట:

దక్షిణాసియ క్రీడల్లో బారత ఆత్లెట్లు పథకాల పంట పండిస్తున్నారు.డిసెంబర్ 05 ఒక్కరోజే 50 పతకాలు ఖాతాలో చేర్చి పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేశారు.స్విమ్మింగ్,ఉషు,వైట్ లిఫ్టింగ్ ,తైక్వాందో, అట్లేతిక్స్ లో బారత అత్లెట్ల జోరు కొనసాగిచింది.మరోవైపు బ్యాడ్మింటన్ లోను యువ షట్లర్ల పుల్లెల గాయత్రి ,సిరిల్ వర్మ సత్తా చాటారు. వీళ్ళిద్దరూ సింగిల్స్ పైనల్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్ సేమిపైనల్ గాయత్రి 21-17,21-14 తో డిల్లి దియాస్ (శ్రీలంక ) ను ఓడించింది. మొత్తం పురుషుల 61 కేజీల విబాగంలో సిద్దాంత్ గగోయ్ పసిడి గెలిచారు. స్విమ్మింగ్ లో 4స్వర్ణాలు ,6 రజతాలు,1 కాంస్యం దక్కగా తైక్వాందో లో 3 పసిడి పతకాలతో పాటు రజత ,కాంస్య పథకాల ఖాతా లో చేరాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దక్షిణాసియ క్రీడల్లో భారత్ పతకాల పంట
ఎక్కడ: ఖాట్మండు
ఎప్పుడు: డిసెంబర్ 05
విశాఖ పట్నంలో నేవీ డే వేడుకలు :

విశాక పట్నంలో ఆర్ కే బీచ్ వేదికగా తూర్పు నౌకాదళంలో అద్వర్యంలో నేవీ వేడుకలు డిసెంబర్ 04 న జరిగాయి. వేడుకల్లో తూర్పు నౌకాదలాదిపతి,వైస్ అడ్మిరల్ ఆతుల్ కుమార్ జైన్ ,ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్కై దైవర్ల బృందం సారధి లెఫ్టినెంట్ రాథోడ్ ముఖ్య అతిధి సిఎం జగన్ కు స్మృతి చిహ్నాన్ని అందించారు. వేడుకల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ యుద్ద విమానాల నిర్వహించింది.తొలిసారిగా త్రివిడ దలాలకు చెందిన సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఈ నేవీ డే ప్రదానంగా బారత్ –బంగ్లాదేశ్ మద్య జరిగిన యుద్ధం 1971 డిసెంబర్ 03 న మొదలై డిసెంబర్ 16 తో పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్దంలో డిసెంబర్ 04 పాకిస్తాన్ దక్షిణ తీర ప్రాంతంలో ముఖ్యమైన కరాచి నౌకా స్తావరాన్ని భారత పశ్చిమ నౌకా దళం ఆపరేషన్ త్రేదంట్ పేరు తో నాశనమ్ చేసింది. ఈ అద్బుత విజయానికి చిహ్నంగా ఏటా దేసెంబెర్ 04 న భారత నౌకా దళ దినోత్సవం గా జరుపుకుంటున్నాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: విశాఖ పట్నంలో నేవీ డే వేడుకలు
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 04
భారత్ బాండ్ ఈటిఎఫ్ కు కేబినేట్ ఆమోదం :

దేశంలోనే తొలి కార్పోరేట్ బాండ్ ఈటిఎఫ్ (భారత్ బాండ్ఎక్స్చేజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంబానికి డిసెంబర్ 04న ప్రదాని నరేంద్ర మోది సారద్యంలో కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.ఈ ఈటిఎఫ్ ద్వారా కేంద్ర ప్రబుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది ఈ టిఎఫ్ విషయమైన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సితరామన్ మాట్లాడుతూ …భద్రత ,లిక్విడిటీ ,పన్నులేని స్తిరమైన రాబడులను బాండ్ ఈటిఎఫ్ అందిస్తుంది అని వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్ సైతం 1000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.భారత్ -22 ఈ.టి.ఎఫ్ మాదిరిగా భారత్ బాండ్ ఈ.టి.ఎఫ్ నూస్టాక్ ఎక్స్చేజ్ లో లిఫ్ట్ చేస్తారు. అవసరమైతే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్ బాండ్ ఈటిఎఫ్ కు కేబినేట్ ఆమోదం
ఎప్పుడు: డిసెంబర్ 05
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |