
Daily Current Affairs in Telugu -15-12-2019
హైదరాబాద్ లో జాతీయ ఆకృతి కేంద్రం :

దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఆకృతి కేంద్రాన్ని (నేషనల్ డిజైన్ సెంటర్) హైదరాబాద్లో ఏర్పాటు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.గచ్చిబౌలిలోని 30ఎకరాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా దీన్ని స్తాపించేదుకు వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని కేంద్రానికి సమర్పించింది. ప్రస్తుతం దేశంలో జాతీయ ఆకృతి సంస్థ (ఎన్ఐడి)లు 6 ఉన్నాయి.గతంలో కేంద్రం హైదరాబాద్ కు ఎన్ఐడిని మంజూరు చేసింది.2013లో అప్పటి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ దీనికి శంకుస్థాపన చేసారు. ముఖద్వారం నిర్మాణం కూడా జరిగింది.2014 లో ఉమ్మడి రాష్ట్ర విబజన తరువాత ఎన్ఐడి ని విజయవాడకు తరలించారు. దాని స్థానంలో మరో సంస్థ తెలంగాణకు మంజూరు కాలేదు. ఈ నేపద్యంలో రాష్ట్ర పరిశ్రమలు ,ఐటి శాఖల మంత్రి కేటిఆర్ సాంకేతిక నిపుణులు ,సంస్థల ప్రతినిధుల తో పలు సార్లు సమావేశమై జాతీయ ఆకృతి కేంద్రానికి (ఎండిసి) రూపకల్పన చేసారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హైదరాబాద్లో జాతీయ ఆకృతి కేంద్రం
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: డిసెంబర్ 15
థాయ్ మసాజ్ కు యునెస్కో గుర్తింపు:

ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంప్రదాయక సువాద్ థాయ్ మసాజ్ కు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్,సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) డిసెంబర్ 13న థాయ్ మసాజ్ ను వారసత్వ జాబితాలో చేర్చింది.నిజానికి ఈ మసాజ్ మూలాలు భారత్ లోనే ఉన్న్నాయి.2500 ఎల్ల క్రితమే ఈ విధానం భారత్ నుంచి థాయ్ వచ్చిందని అక్కడి వారు అంటున్నారు
క్విక్ రివ్యూ:
ఏమిటి: థాయ్ మసాజ్ కు యునెస్కో గుర్తింపు:
ఎవరు: యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్,సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో
ఎప్పుడు: డిసెంబర్ 13
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
27నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు :

విజయవాడలోని సిద్దార్థ కళాశాల ప్రాంగనాలని ఈ నెల 27,28,29 తేదిల్లో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరగనున్నాయి.సభలకు హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి 1500 మంది వరకు సాహితి వేత్తలకు ,భాష సాంకేతక నిపుణులు పేర్లు నమొదు చేసుకున్నారు.ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆద్వర్యంలో నాలుగేల్లకోకసారి ఈ మహాసబలను నిర్వహిస్తున్నారు.భాషోద్యమాన్ని బలోపేతం చేయడానికి సమావేశాల్లో కార్యాచరణ ను రూపొందించనున్నట్లు సంఘం అద్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు ,కార్యదర్శి డాక్టర్ జి.వి.పూర్ణ చందు తెలిపారు. మాతృ భాషను కాపాడుకుందాం నినాదంతో ఈ ఏడాది సభలను నిర్వహిస్తున్నారు.2019ని అంతర్జాతీయ మాతృ బాషల పరిరక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించినందున తెలుగు నేలపై ఉన్న మాతృ భాషల పరిరక్షణ అబివృద్ది,ఆధునీకరణ లక్ష్యంగా మహాసబల కార్యాచరణను రూపొందిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 27నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుదు: డిసెంబర్ 15
మొనాకో మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నిలో కోనేరు హంపికి రజతం:

తెలుగు గ్రాంద్ మాస్టర్ కోనేరు హంపికి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది.ఫిడే మొనాకో మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నిలో ఆమె రజతం గెలిచింది.చివరి రౌండ్లో ఆమె రష్యా క్రీడాకారిణి అలేగ్జంద్ర గోర్యచ్కిన్ పై విజయం సాధించింది.తెల్ల పావులతో ఆడిన హంపి 68 ఎత్తులలో ప్రత్యర్థిని చిత్తు చేసింది.మొత్తం పదకొండు రౌండ్లు ముగిసే సరికి హంపి 7పాయింట్లతో గ్యోర్కశ్కిన్ ,అలేక్సాంద్ర కోస్తనీస్ తో పాటు సమంగా అగ్ర స్థానంలో నిలిచింది.అయితే ట్రై బ్రేక్ స్కోర్ మెరుగ్గా ఉన్న కోస్తానీస్ స్వర్ణం గెలుచుకుంది.హంపి రెండో స్థానంలో నిలిచింది.గ్యోర్కశ్కినా మూడో స్థానాన్ని దక్కించుకుంది
క్విక్ రివ్యూ:
ఏమిటి: మొనాకో మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నిలో కోనేరు హంపికి రజతం
ఎక్కడ:మంటే కార్లో
ఎవరు: కోనేరు హంపి
ఎప్పుడు: డిసెంబర్ 15
బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బాడ్మింటన్ విజేత లక్ష్మణ్ సేన్:

భారత యువ సంచలనం లక్ష్మణ్ సేన్ ఈ సీజన్లో అయిదో టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ ఛాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నీ లోవిజేతగా నిలిచాడు.డిసెంబర్ 15న జరిగిన పురుషుల సింగిల్స్ పైనల్లో లక్ష్మణ్ సేన్ 22-20,21-18 తో లియంగ్ జూన్ (మలేసియ)ఫై విజయం సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ చాలెంజ్
బాడ్మింటన్ విజేత లక్ష్మణ్ సేన్:
ఎక్కడ: డాకా
ఎవరు: లక్ష్మన్ సేన్
ఎప్పుడు: డిసెంబర్ 15
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |