
Daily Current Affairs in Telugu -25-12-2019
సుపరిపాలన సూచిలో తెలుగు రాష్ట్రాలు ఎంపిక:

సుపరిపాలన దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రబుత్వంఓ సూచిని విడుదల చేసింది.వ్యవసాయం ,అనుబంధ రంగాలు ,వాణిజ్యం,పరిశ్రమలు ,మానవ వనరుల అబివృద్ది ,ప్రజారోగ్యం ,ప్రబుత్వ మౌలిక వసతులు ,సదుపాయాలు,ఆర్థిక పాలన,సామజిక సంక్షేమం ,అబివృద్ది తదితర అంశాలను పరిగణిస్తూ శాస్త్రీయంగా దీనిని రూపొందింది.ముసాయిదా నివేదికను కేంద్ర ప్రబుత్వం 2018 నవంబర్6న రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపింది.వాటి నుంచి లబించిన స్పందన ఆధారంగా సుపరిపాలన సూచికి రూపమిచ్చింది. ఎంపిక చేసుకున్న పది పాలనంశాలకుఒక్కో దానికి ఒక్కో మార్కు కింద మొత్తం పది మార్కులకు ర్యాంకింగ్ రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణాలు ఉన్నాయి.ఆంద్ర ప్రదేశ్ 5.05 మార్కులతో 5వ స్థానం ,తెలంగాణ 4.83 మార్కులతో 11వ స్థానం లో నిలిచాయి.పెద్ద రాష్ట్రాల్లో 5.62 మార్కులతో తమిళనాడు మొదటి ,4.23 మార్కులతో జార్కండ్ చివరి స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి: సుపరిపాలన సూచిలో తెలుగు రాష్ట్రాలు ర్యాంకులు:
ఎవరు: తెలంగాణా ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 25
నాబార్డు డిప్యూటి ఎండి గా చింతల గోవింద రాజులు:

దేశంలోని అగ్రగామి వ్యవసాయ రుణ వితరణ సంస్థ అయిన నాబార్డు(నేషనల్ బ్యాంక్ పర ఆగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్)డిప్యుటీ ఎండిగా తెలుగు వాడిన చింతల గోవింద రాజులూ ఎంపికయ్యారు.నాబర్డులో చైర్మన్ తర్వాత ఇదే అతి పెద్ద పదవి ప్రస్తుతం నాబార్డు లోనే చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఆయన గట్టి పోటీ తట్టుకొని డిప్యుటీ ఎండి హోదాకు ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: నాబార్డు డిప్యూటి ఏమదిగా చింతల గోవింద రాజులు:
ఎవరు: చింతల గోవింద రాజులు
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు: డిసెంబర్ 25
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ప్రపంచ సంపన్నుల్లో ముకేష్ కు 12స్థానం ;

ఈజాబితా ప్రకారం 2019 ఏడాదిలో ముకేష్ అంబానీ సంబద విలువ 16.5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ.1.2 లక్షల కోట్లు ) పెరిగి 60.8 బిలియన్ డాలర్ల (దాదాపు 4.3లక్షల కోట్లకు చేరింది ఇదే బ్లుమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టెక్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నిలిచాడు.బిల్ గేట్స్ సంపద 2019ఏడాదిలో 22.4 బిలియన్స్ పెరిగి పెరిగి 113 బిలియన్ డాలర్లకు చేరింది.రెండో స్తానంలో ఉన్న అమెజాన్ సిఈఓ జెఫ్ బెజోస్ సంపదమాత్రం 13.2 బ్లియన్ డాలర్లు తగ్గింది.మరో వైపు చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా నికర విలువ 11.3 బిలియన్ డాలర్ల పెరిగింది. అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన 19వ స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ప్రపంచ సంపన్నుల్లో ముకేష్ కు 12స్థానం
ఎవరు: ముకేష్ అంబాని
ఎప్పుడు: డిసెంబర్ 25
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి దర్యాప్తుకు ఆమోదం :

రక్షణ వ్యవహారాల్లో కేంద్ర ప్రబుత్వానికి సలహాలివ్వనున్న చీఫ్ ఆఫ్ డిఫెన్సు స్టాఫ్ (సిడిఎస్)పదవి ఏర్పాటు కు బద్రత వ్యవహారాల కేబినేట్ కమిటీ డిసెంబర్ 24న ఆమోదం తెలిపింది.కార్గిల్ రివ్యూ కమిటీ 1999లో ఇచ్చిన సూచన మేరకు సిడిఎస్ నియామకాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.సిడిఎస్ గా నియమితులయ్యేవారు నాలుగు నక్షత్రాల తో కూడిన జనరల్ స్థాయి అధికారి అయి ఉంటారని త్రివిధ దళాదిపతి తో సమానమైన వేతనాన్ని పొందుతారని మంత్రి తెలిపారు.మరో వైపు సిసిఎస్ వ్యవస్థ మౌలిక సూత్రాలు బాద్యతలపై జాతీయ బద్రత సలదారు అజిత్ దవల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక బద్రత వ్యవహారాల కేబినేట్ కమిటీ ఆమోదించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి దర్యాప్తుకు ఆమోదం :
ఎవరు: కేంద్ర కేబినేట్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 25
ఎన్.పి.ఆర్ సవరణకు కేంద్ర కేబిఎట్ ఆమోదం ;

జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషణ్ రిజిస్టర్ –ఎన్పిఆర్ ) ను సవరించేందుకు (అప్డేట్)ప్రదాని మోది నేతృత్వంలోని కేంద్ర కేబినేట్ డిసెంబర్ 24న ఆమోదం తెలిపింది .ఎన్పిఆర్ అప్డేట్ కోసం రూ.39,4,135 ఓట్ల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.2020 ఏప్రిల్ –సెప్టెంబర్ మద్య జరిగే జనగణన -2021 తొలి దశతో పాటు ఎన్పిఆర్ ను అప్డేట్ చేసే ప్రక్రియ ప్ర్రారంబమవుతుంది.ఎన్పిఆర్ డేటాను సంక్షేమ పతకాల లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ఉపయోగిస్తారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఎన్.పి.ఆర్ సవరణకు కేంద్ర కేబిఎట్ ఆమోదం
ఎవరు: కేంద్రం
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 25
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |