
Daily Current Affairs in Telugu -29-12-2019
జనాబా లెక్కల విభాగం తాజా నివేదికలో లింగ నిష్పతిలో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానం:

దేశంలో అమ్మాయిల జననాలు నానాటికి తగ్గుతున్నాయి. ఒక్క అరుణాచల్ ప్రదేశ్ లో మినహా అన్ని రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలు ఇదే పరిస్థితి. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు ఎంత మంది అమ్మాయిలు పుట్టారు అనే సంఖ్యను ఒకటి నుంచి డిసెంబర్ 31వరకు నమోదైన జననాల ప్రకారం మొదటి స్థానంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో లింగ నిష్పత్తి 1047 ఉండగా రెండో స్థానంలో ఉన్న చత్తిస్గడ్ లో 78 తగ్గి 968 గా నమోడైంది.జనాబా లెక్కల విభాగ తాజా నివేదిక ప్రకారం అబివృద్ధి చెందిన రాష్ట్రాలలోనే లింగ నిష్పత్తి దారుణంగా తగ్గుతుంది. రాష్ట్రాల వారిగా లింగనిష్పత్తి లో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా ,గుజరాత్ పంజాబ్ లు చివరి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణా 20వ స్థానంలో మరియు ఆంద్ర ప్రదేశ్ 11వ స్థానం లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి: జనాబా లెక్కల విభాగం తాజా నివేదికలో లింగ నిష్పతిలో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానం:
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 29
గగన యాన్ ప్రాజెక్ట్ లో రూర్కెల ఉక్కు వినియోగం:

గగనతలంలో సొంతంగా వ్యోమగాములను పంపదమే లక్ష్యంగా బారత అతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగనయాన్ ప్రాజెక్ట్ లో రూర్కెల ఉక్కు కర్మాగారం (ఆర్ఎస్ పి) ఉక్కును వినియోగించనున్నారు. ఇందుకోసం తొలి దశలో బాగంగా 30.5 టన్నుల మరాజింగ్ ఉక్కు పలకలను ఆర్ఎస్పి పంపించింది. మరాజింగ్ ఉక్కు చాలా ప్రత్యేకమైనది. అందులో నికెల్ ,అల్యూమినియం ,కోబాల్ట్ మాలిబ్దినం ,టైటానియం ,అల్యూమినియం కలిసి ఉంటాయి. సాదారణంగా ఉక్కుకు ద్రుడత్వం పెరిగే కొద్ది దానిలో సాగే గుణం తగ్గుతుంది. మరాజింగ్ ఉక్కు అందుకు బిన్నమైంది. ఇటీవల చంద్రయాన్ -2 ప్రాజెక్టుకు కూడా ఇలాంటి పలకలను ఆర్ఎస్పీ సరపరా చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి:గగనయాన్ ప్రాజెక్ట్ లో రూర్కెల ఉక్కు వినియోగం
ఎవరు: ఇస్రో
ఎప్పుడు: డిసెంబర్ 29
ఆర్బిఐ 25వ ఆర్ధిక స్తిరత్వ నివేదిక విడుదల :

దేశ ఆర్ధిక అంశాలపై రూపొందించిన 25వ ఆర్ధిక స్తిరత్వ నివేదికను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) డిసెంబర్ 27న విడుదల చేసింది. ద్రవ్యలోటు గణాంకాలు గత కొన్నేళ్లలో మెరుగుపడ్డాయి. కాని పైవేటు వినియోగం పెట్టుబడుల బలహీన పడడం కారణంగా తగ్గిపోతున్న ఆదాయంతో ద్రవ్యా లోటు సవాలు కాగలదు. అని ఈ నివేదికను పెర్కోది. చాలా ప్రతికూలతలు ఉన్నపటికీ దేశ ఆర్ధిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అబిప్రాయపడింది. పడిపోతున్న ప్రబుత్వ ఆదాయం ద్రవ్య గణన్కాలఫై ప్రబావం చూపిస్తుందని ఆందోళన వ్యక్త చేసింది..
క్విక్ రివ్యూ
ఏమిటి: ఆర్బిఐ 25వ ఆర్ధిక స్తిరత్వ నివేదిక విడుదల
ఎవరు: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా
ఎప్పుడు: డిసెంబర్ 29
జార్కండ్ సి ఎం గా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం:

జార్కండ్ రాష్ట్ర 11వ ముక్యమంత్రిగా జార్కండ్ మకతి మోర్చా (జేఎంఎమ) కార్య నిర్వాహక అద్యక్షుడు హేమంత్ సోరెన్ డిసెంబర్29 న ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమానం చేయించారు. రాన్చిలోని మొర్హాబది మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో పశిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీ ,రాజస్థాన్ ,చత్తిస్గడ్ రాష్ట్రాలు ముఖ్యమంత్రులులు అశోక్ గెహ్లాట్ ,బుపేష్ బాగెల్ ,సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ,డిఎంకే నేత ఎంకే స్టాలిన్ ,తదితరులు పాల్గొన్నారు.44 ఎల్ల హేమంత్ సోరెన్ ముక్యమంత్రిగా బాద్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతంలో ఆయన 2009-2013 మద్య ఉప ముఖ్యమంత్రి గా ,ముక్యమంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: జార్కండ్ సి ఎం గా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఎక్కడ: జార్కండ్
ఎవరు: హేమంత్ సోరెన్
ఎప్పుడు: డిసెంబర్ 29
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
2018 సంవత్సర దాదాసాహెబ్ పురస్కార గ్రహీత అమితాబ్ బచ్చన్:

ప్రముక బాలివుడ్ నటుడు అమితాబచ్చన్ కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే పురస్కారం స్వీకరించారు.డిసెంబర్ 29 డిల్లిలో ని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పతి రాం నాథ్ కోవింద్ అమితాబ్ కు పురస్కారం ను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అమితాబ్ బచన్ సతిమని జయాబచ్చన్ ,కుమారుడు అబిషేక్ బచ్చన్ తో కలిసి హాజరయ్యారు.ఇటీవల జరిగిన జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలోనే అమితాబ్ బచ్చన్ ఈ పురాస్కారాన్ని అందుకోవాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో ఆయన హాజరు కాలేకపోయారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: 2018 సంవత్సర దాదాసాహెబ్ పురస్కార గ్రహీత అమితాబ్ బచ్చన్
ఎక్కడ: డిల్లి
ఎవరు: అమితాబ్ బచ్చన్
ఎప్పుడు: డిసెంబర్ 29