Daily Current Affairs in Telugu 21-01-2020
22మంది బాలలకుసాహస పురస్కారాలు :
క్లిష్ట పరిస్థితుల్లో సాహసాన్ని ప్రదర్శించిi 12రాష్ట్రాలకు చెందిన 10మంది బాలికలు ,12మంది బాలురకు జాతీయ సాహస బాలల పురస్కారాలు లబించాయి.భారతీయ బాలల సంక్షేమ మండలి జనవరి 21ఈ జబితాను ప్రకటించిది.కేరళలో ని కోజికోడ్ లో ముగ్గురు స్నేహితులు సముద్రంలో మునిగిపోకుండా రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన మహమ్మద్ మోసిన్ కు అభిమన్యు పురస్కారం ప్రకటించారు.ఇంటి పైకి శతగ్ని గుండును ముష్కరులు ప్రయోగించినపుడు కుటుంబ సబ్యుల్ని రక్షించిన సర్తాజ్ మొహదీన్ (జమ్మూ కాశ్మీర్),నలబై మంది బస్సు ప్రయాణికుల్ని మంటల నుంచి కాపాడిన ఆదిత్య (కేరళ)తదితరులు గణతంత్ర దినోత్సవం లో ఈ పురస్కారాలను అందుకోనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 22మంది బాలలకు సాహస పురస్కారాలు
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు:జనవరి 21
ఇస్రో నావిక్ కు అమెరికా సాయం :
భారతీయ అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో)రూపొందించిన శాటిలైట్ నావిగేషన్ సిస్టం నావిక్ అనువైన చిప్ సెట్లను తాయారు చేసిననదుకు అమెరికా కు చెందిన సెమి కండక్టర్ టేలి కమ్యునికేషణ్ సంస్థ (కవల్ కమ్)ముందుకొచ్చింది.స్వదేశి పరిజ్ఞానంతో ఇస్రో రూపొందించ తల పెట్టిన నావిక్ జీపీఎస్ ఆన్ద్రయిడ్ స్మార్ట్ పోన్లకు తగిన చిప్ సెట్లను ఈ సంస్థ తయారు చేయనుంది.ఈ విషయాన్నీ ఇస్రో అద్యక్షుడు డా .కే శివన్ బెంగళూరులో ప్రకటించారు .భారత్ తో పాటు దేశ సరిహద్దు నుంచి 1500 కిలోమీటర్ల పరిధిలోని దేశాలకు ఈ పోన్ల ద్వారా సమాచార వ్యవస్థ (నావిఎషణ్ సిస్టం )ను కొనసాగించే వీలుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇస్రో నావిక్ కు అమెరికా సాయం
ఎవరు:అమెరికా
ఎక్కడ:బెంగళూర్
ఎప్పుడు:జనవరి 21
జయశంకర్ వర్శిటీ కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ఎక్సలెన్స్ పురస్కారం :
వ్యవసాయ విస్తరణ, పరిశోదన ,ఉత్తమ బోదన ,యువత వాణిజ్య వేత్తలుగా మారేలా నైపుణ్యాలను పెంపొందించడం ,పరిక్ష నిర్వహణలో డిజిటల్ విధానం అమలు సహా పలు రంగాల్లో చేసిన కృషికి గాను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్శిటీ కి జాతీయ ఉత్తమ పురస్కారం లబించింది.డిల్లీలో అఖిల భారత వ్యవసాయ విద్యార్థులసంఘం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ -2019 పురస్కారానికి ఈ వర్శిటీ ఎంపిక చేసింది.చతీస్గడ్ రాజదాని రాయపూర్ లో భారత వ్యవసాయ పరిశోదన మండలి (ఐసీఎఆర్)డిప్యుటీ డైరెక్టర్ జనరల్ ఆర్సి అగర్వాల్ గారి చేతుల మీదుగా వర్శిటీ ఉపకులపతి ప్రవీణ్ రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జయశంకర్ వర్శిటీ కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారం
ఎవరు: ఉపకులపతి ప్రవీణ్ రావు
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు:జనవరి 21
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
టి –చిట్స్ కు జాతీయ ఈ గవర్నన్స్ అవార్డు :
స్టాంపులు,రిజిస్ట్రేషన్ శాఖా నిర్వహించిన టి-చిట్స్ జాతీయ ఈ గవర్నన్స్ అవార్డు లబించింది.ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సహకారంతో బ్లాక్ చైన్ సాంకేతిక తో తీసుకోచ్చిన టి –చిట్స్ గోల్డ్ అవార్డుకు ఎంపికైన అయిందని రిజిస్ట్రేషన్ శాఖ ఐటి ఐ.జి చిరంజీవులు తెలిపారు.ముంబై లో ఫిబ్రవరి 7,8 తేదిల్లో నిర్వహించే కార్యక్రమలో కేంద్ర ఎలక్రానిక్ ,సమాచార శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు రూ.2లక్షల నగదు బహుమతి ని తెలంగాణా అధికారులు అందుకోనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: టి –చిట్స్ కు జాతీయ ఈ గవర్నన్స్ అవార్డు
ఎక్కడ:ముంబై
ఎప్పుడు:జనవరి 21
గ్రీన్ బిల్డింగ్ రేటింగ్లో తెలంగాణా కు ఆరో స్థానం :
ఇందన ,పర్యావన అనుకూల డిజైన్ (లీడ్)విభాగంలో దేశంలో మొదటి రాష్ట్రాల జాబితాలో తెలంగాణా రాష్ట్రానికి స్థానం లబించింది.భవనాలు,స్థలాలను పర్యవరనాకి అనుకూలంగా తీర్చిదిద్దిన పక్షంలో వాటికి లీడ్ సర్టిఫికేషన్ లబిస్తుంది.జీబిసిఐ ఇండియా (గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషన్ ఇంకు )దీన్ని జనవరి 21నాడు విదుదల చేసింది.ఇందులో తెలంగాణా రాష్ట్రం 6వ స్థానంలో నిలిచింది.మొదటి అయిదు స్థానాల్లో మహారాష్ట్ర ,కర్ణాటక ,హర్యానా ,తమిళనాడు ,ఉత్తరప్రదేశ్ ,లు ఉన్నాయి.లీడ్ సర్టిఫికేషన్లు కల భవనాలు మనదేశంలో 1400 పైగా ఉండగా ,ఇందులో తెలంగాణా రాష్ట్రంలో 106 ప్రాజెక్టులు ఉన్నాయి.పర్యావరనానికి అనుకూలమైన విధంగా భవనాలు నిర్మించే విషయంలో భారత్ ముందంజ వేస్తున్నట్లు జీబీసిఐ సిఈఓ మహేష్ రామానుజన్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గ్రీన్ బిల్డింగ్ రేటింగ్లో తెలంగాణా కు ఆరో స్థానం :
ఎవరు: తెలంగాణా రాష్ట్రం
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు:జనవరి 21