Daily Current Affairs in Telugu 22&23 June -2022
హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్ 2022 పురస్కారాన్ని గెలుచుకున్న తెలంగాణ పోలీసులు :
సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ముందున్న తెలంగాణ పోలీసులు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్ 2022 పురస్కారాన్ని పొందారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్ర పోలీసులు వినియోగిస్తున్న సైబర్ క్రైమ్ అనాలసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టమ్ (సైక్యాప్స్) ఐటీ అప్లికేషన్ దేశంలోనే తొలి స్థానం సాధించింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్సీ దేవేందర్ సింగ్ ఈ పురస్కారానికి ఎంపికయారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్ 2022 పురస్కారాన్ని గెలుచుకున్న తెలంగాణ పోలీసులు
ఎవరు: తెలంగాణ పోలీసులు
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు : జూన్ 22
ఆసియా ఛాంపియన్షిప్ అండర్-17 టైటిల్ ను గెలుచుకున్న భారత యువ రెజ్లర్లు :
భారత యువ రెజ్లర్లు కిర్గిజైన్ లో జరుగుతున్న ఆసియా ఛాంపియన్షిప్ అండర్-17 టైటిల్ ను సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో నాలుగు స్వర్ణాలు, రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలు ఉన్నాయి. ఒక్క రోజే మన రెజ్లర్లు ఫ్రీస్టైల్ లో మూడు బంగారు పతకాలు, ఒక రజతం, కాంస్యం గెలిచారు. నింగప్ప (45 కేజీలు), శుభమ్ (48. కేజీలు), వైభవ్ పాటిల్ (55 కేజీలు)ల్లో ఒక్కొక్కరు ఒక్కో పసిడి పథకం సాధించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా ఛాంపియన్షిప్ అండర్-17 టైటిల్ ను గెలుచుకున్న భారత యువ రెజ్లర్లు
ఎవరు: నింగప్ప (45 కేజీలు), శుభమ్ (48. కేజీలు)
ఎప్పుడు : జూన్ 22
జాతీయ సంస్థ ఎన్.ఐ.ఏ డైరెక్టర్ గా దినకర్ గుప్త నియామకం :
జాతీయ సంస్థ(ఎన్ఎస్ఐఏ) డైరెక్టర్ గా పంజాబ్ మాజీ డీజీపీ, ఆ రాష్ట్రంలోని 1987 కేడర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్త గారు నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ జూన్ 23న ఉత్తర్వులు జారీచేసింది. కేంద్రహోంశాఖ ప్రతిపాదనకు నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయడంతో ఈయన ను నియమించినట్లు పేర్కొంది. గత ఏడాది మే నెలలో సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ కు ఎన్.ఐ ఎ అదనపు బాధ్యతలు అప్పగించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ సంస్థ ఎన్.ఐ.ఏ డైరెక్టర్ గా దినకర్ గుప్త నియామకం
ఎవరు: దినకర్ గుప్త
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : జూన్ 23
ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో రజత పథకం గెలుచుకున్న రోనాల్డో సింగ్ :
దేశ అగ్రశ్రేణి సైక్లిస్ట్ రొనాల్డో సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల చివరి రోజైన జూన్ 23న రజతం గెలిచిన అతను ఆ ఘనత సాధించిన తొలి భారత సైక్లిస్ట్ గా రికార్డు నమోదు చేశాడు. సీనియర్ విభాగంలో అతను రెండో స్థానంలో నిలిచాడు. కెంటో యమసాకి (జపాన్), ఆండ్రీ (కజకిస్థాన్) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. రొనాల్డో ఇప్పటికే 1 కిలోమీటర్ టైమ్ ట్రయల్, టీమ్ స్ప్రింట్ లో కాంస్యాలు నెగ్గాడు. “రొనాల్డో సాధించిన రజతమే ఆసియా చాంపియన్షిప్స్ ఓ భారత సైక్లిస్ట్ అందుకున్న తొలి వెండి పతకం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో రజత పథకం గెలుచుకున్న రోనాల్డో సింగ్
ఎవరు: రోనాల్డో సింగ్
ఎప్పుడు : జూన్ 22
భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రుమేలి ధార్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు :
భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రుమేలి ధార్ (బెంగాల్) ఆటకు వీడ్కోలు పలికింది. మూడు ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు 38 ఏళ్ల రుమేలి జూన్ 23న ప్రకటించింది. 23 ఏళ్ల కెరీర్ లో కుడిచేతి వాటం బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్ తో మంచి ఆల్రౌండర్ రుమేలి పేరు తెచ్చుకుంది. తన కెరీర్లో 4 టెస్టులు ఆడిన ఆమె 236 పరుగులు, 8 వికెట్లు రాబట్టింది. 2006లో చివరి టెస్టు ఆడింది. 78 వన్డేల్లో 961 పరుగులు చేసి 63 వికెట్లు పడగొట్టింది. 2005 వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. 2012లో ఆఖరి వన్డేలో బరిలో దిగింది. 18 టీ20 మ్యాచ్లో 131 పరుగులు, 13 వికెట్లు రాబట్టింది. 2018లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు ఊహించని విధంగా 34 ఏళ్ల వయసులో భారత జట్టులో రుమేలి పునరాగమనం చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రుమేలి ధార్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: రుమేలి ధార్
ఎప్పుడు : జూన్ 23
తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎఫ్ డీసీ) చైర్మన్ గా అనిల్ కుర్మాచలం నియామకం :
తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్ డీసీ) చైర్మన్ గా తెరాస ప్రవాస విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం గారు రాష్ట్ర పునరుత్సాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) ఛైర్మన్ గా తెరాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ ఏరువ సతీష్ రెడ్డి గారు నియమితులయ్యారు. వీరిద్దరూ తమ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగానున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎఫ్ డీసీ) చైర్మన్ గా అనిల్ కుర్మాచలం నియామకం
ఎవరు: అనిల్ కుర్మాచలం
ఎక్కడ: తెలంగాణ రాష్ట్ర౦
ఎప్పుడు : జూన్ 23
‘ఒకే దేశం.. ఒకే రేషన్ ‘ పథకంలో చివరి రాష్ట్రంగా నిలిచిన అస్సాం :
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఒకే దేశం. ఒకే రేషన్ కార్డు’ పథకంలో చివరి రాష్ట్రంగా అస్సాం రాష్ట్రము చేరినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో ఈ కార్యక్రమం దేశంలో వంద శాతం అమలు కానుంది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘ఒకే దేశం.. ఒకే రేషన్ ‘ పథకంలో చివరి రాష్ట్రంగా నిలిచిన అస్సాం
ఎవరు: అస్సాం
ఎప్పుడు : జూన్ 23
అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ సైన్స్ సలహాదారుగా ఆర్తీ ప్రభాకర్ నామినేట్ :
ప్రముఖ ఇండో అమెరికన్ శాస్త్ర వేత్త డాక్టర్ ఆర్తీ ప్రభాకర్ (63) ను తనకు సైన్స్ సలహాదారుగా కీలకస్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు నామినేట్ చేశారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకం అంటూ ఇండో అమెరికన్ వర్గం ప్రశంసించింది. దీనికి సెనేట్ ఆమోదం కూడా లభిస్తే శ్వేతభవనంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయ (ఓఎస్ఓటీపీ) తొలి మహిళా (వలసదారు) డైరెక్టరుగా ఆర్తీ ప్రభాకర్ చరిత్ర సృష్టిస్తారు. ఆర్తీకి మూడేళ్ల వయసులో వీరి కుటుంబం ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడింది. టెక్సాస్ టెక్ యూనివర్సిటీ నుంచి ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ ఫిజిక్స్ లో పీహెచ్ డీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. అక్కడే ఎలక్ట్రికల్ ఇంజినీరింగులో ఎం.ఎస్. కూడా చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ సైన్స్ –సలహాదారుగా ఆర్తీ ప్రభాకర్ నామినేట్
ఎవరు: ఆర్తీ ప్రభాకర్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు : జూన్ 23
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |