
Daily Current Affairs in Telugu 03-02-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులే టరీ బోర్డ్ నూతన చైర్మన్ గా తరుణ్ కపూర్ ఎంపిక :

పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులే టరీ బోర్డ్ (పీఎన్ఆర్బీ) కొత్త చైర్మన్ చమురు శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ ఎంపికైనట్లు ‘ సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021 నవంబరు 30న పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యద ర్శిగా కపూర్ పదవీ విరమణ చేశారు. డజనుకు పైగా అభ్యర్ధులను ఇంటర్వ్యూలు చేసిన తర్వాత కపూర్న ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ నియామకాల సంఘం, కపూర్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపితే, ఆయన పగ్గాలు చేపట్టనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులే టరీ బోర్డ్ నూతన చైర్మన్ గా తరుణ్ కపూర్ ఎంపిక
ఎవరు: తరుణ్ కపూర్
ఎప్పుడు : ఫిబ్రవరి 03
ఐబీబీఐ చైర్ పర్సన్ గా రవి మిత్తల్ ను నియమించిన ప్రభుత్వం :

ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) చైర్ పర్సన్ గా రవి మిత్తల్ ను ప్రభుత్వం నియమించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానంలో పనిచేసిన ఎమ్.ఎస్. సాహూ తన అయిదేళ్ల పదవీ కాలాన్ని 2021 సెప్టెంబరు 30న పూర్తి చేసుకున్నప్పటి నుంచి ఈ సీటు భర్తీ కాలేదు. 2021 అక్టోబరులో ఐబీబీఐ పూర్తి కాల సభ్యుడు నవరంగ్ సైనీకి చైర్ పర్సన్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. గతంలో ఇన్నర్మేషన్ అండ్ బ్రాడ్క్యాస్టింగ్ (ఐ అండ్ బీ) కార్యద ర్శిగా పనిచేసిన మిత్తల్ ను ఐబీబీఐ చైర్ప ర్సన్ గా నియమించినది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐబీబీఐ చైర్ పర్సన్ గా రవి మిత్తల్ ను నియమించిన ప్రభుత్వం
ఎవరు: రవి మిత్తల్
ఎప్పుడు : ఫిబ్రవరి 03
ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ తో నడిచే బొట్ ను నిర్మించనున్న యుఎఈ దేశం :

ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ తో నడిచే ఫ్లయింగ్ బోట్ ను వచ్చే ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో నిర్మించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘ది జెట్’ అని పిలవబడే ఈ వాహనం రెండు హైడ్రోజన్ ఇంధన ఘటాల ద్వారా శక్తిని పొందేలా సెట్ చేయబడింది, ఇది ‘నిశ్శబ్దంగా’ అలల మీదుగా సాఫీగా ప్రయాణిస్తున్నందున ఎటువంటి ఉద్గారాలను ఉత్పత్తి చేయదు.
- యుఎఈ దేశ రాజధాని :అబుదాబి
- యు.ఏఈ దేశ కరిన్సీ : యు.ఏ.ఈ దిర్హం
- యు.ఏ ఈ దేశ అద్యక్షుడు : ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ తో నడిచే బొట్ ను నిర్మించనున్న యుఎఈ దేశం
ఎవరు: యుఎఈ దేశం
ఎక్కడ: యుఎఈ
ఎప్పుడు : ఫిబ్రవరి 03
అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్ లో సెంచరి సాధించిన మూడో కెప్టెన్ గా నిలిచిన యష్ దుల్ :

భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ ఐన విరాట్ కోహ్లి, ఉన్ముక్ చంద్ తర్వాత ఐసిసి అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ లొ సెంచరీ చేసినమూడో భారతీయుడిగా భారత అండర్ 19 జట్టు కెప్టెన్ యష్ ధుల్ నిలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరుగుతున్న టోర్నమెంట్ సెమీ ఫైనల్లో ధుల్ సెంచరీ సాధించాడు. మరియు ఇది అతని జట్టు U19 ప్రపంచ కప్ లో ఫైనల్ లోకి ప్రవేశించడానికి సహాయపడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్ లో సెంచరి సాధించిన మూడో కెప్టెన్ గా నిలిచిన యష్ దుల్
ఎవరు: యష్ దుల్
ఎప్పుడు : ఫిబ్రవరి 03
డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజన్సీ కి నూతన హెడ్ గా లెఫ్టినెంట్ జనరల్ జిఎవి రెడ్డి నియామకం :

డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజన్సీ కి నూతన హెడ్ గా లెఫ్టినెంట్ జనరల్ జిఎవి రెడ్డి గారు నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ KJS ధిల్లాన్ గారి తర్వాత జనరల్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ కే.జే.ఎస్ ధిల్లాన్ గారు భారత సైన్యంలో తన 39 ఏళ్ల కెరీర్లో వివిధ వ్యూహాత్మక స్థానాల్లో వివిధ పదవులలో పనిచేసి పదవీ విరమణ చేశారు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది డైరెక్టర్ జనరల్ సంస్థకు అధిపతిగాను మరియు రక్షణ శాఖా మంత్రి మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కు ఇంటెలిజెన్స్ లో ప్రధాన సలహాదారులలో ఒకరు గా ఉంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజన్సీ కి నూతన హె డ్ గా లెఫ్టినెంట్ జనరల్ జిఎవి రెడ్డి నియామకం
ఎవరు: జిఎవి రెడ్డి
ఎప్పుడు : ఫిబ్రవరి 03
ఎయిరిం డియా సీఈఓ బాధ్యతలు చేపట్టనున్న అలెక్స్ క్రూజ్ :

బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చైర్మన్, సీఈఓగా, అంతకు ముందు. స్పెయిన్ కు చెందిన చౌకధరల విమానయాన సంస్థ వ్యూలింగ్ కు సీఈఓగా చేసిన అలెక్స్ క్రూజ్ (55), ఎయిరిండియా సీఈఓ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 2020 కొవిడ్ సమయంలో ఆయన బ్రిటిష్ ఎయిర్వేస్ నుంచి తప్పుకున్నారు. ఎయిరిండియా కొత్త బోర్డుకు టాటా గ్రూపు చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ నేతృత్వం వహించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి చౌకధరల విమానయాన సంస్థలకు నేతృత్వం వహించిన అలెక్స్ క్రూజ్, ఎయిరిండియాను ‘సమర్థంగా నిర్వహించగలరని భావిస్తున్నారు..
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎయిరిం డియా సీఈఓ బాధ్యతలు చేపట్టనున్న అలెక్స్ క్రూజ్
ఎవరు: అలెక్స్ క్రూజ్
ఎప్పుడు : ఫిబ్రవరి 03
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |