Daily Current Affairs in Telugu 01-02-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
‘విశ్వప్రభ అవార్డు – 2022ను గెలుచుకున్న సినీ దర్శకుడు గిరీష్ కాసరపల్లి :

ఉడిపికి చెందిన సంస్కృతి విశ్వప్రతిష్టాన సంస్థ ‘విశ్వప్రభ అవార్డు – 2022ను ప్రముఖ సినీ దర్శకుడు గిరీష్ కాసరవల్లికి ప్రదానం చేసింది. ఉడిపి విశ్వనాథ్ షెనాయ్ మరియు ప్రభావతి షెనాయ్ కన్నడ మరియు సంస్కృతిని ప్రోత్సహించడంలో కళాకారులు చేసిన సేవలకు గుర్తింపుగా ఉడిపి విశ్వనాథ్ షెనాయ్ మరియు ప్రభావతి షెనాయ్లు ఏర్పాటు చేసిన ఈ అవార్డు ఇది. దీని ద్వారా రూ. 1 లక్ష నగదు మరియు ప్రశంసాపత్రాన్ని ఇస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘విశ్వప్రభ అవార్డు – 2022ను గెలుచుకున్న సినీ దర్శకుడు గిరీష్ కాసరపల్లి
ఎవరు: గిరీష్ కాసరపల్లి
ఎప్పుడు: ఫిబ్రవరి 01
పోర్చుగల్ దేశ ప్రధాన మంత్రి గా అంటోనియో కొస్టో ఎన్నిక :

పోర్చుగల్ దేశానికి ప్రధాన మంత్రి, గా ఆంటోనియో కోస్టో, 2022 పోర్చుగీస్ శాసనసభ ఎన్నికలలో అతని మధ్య-వామపక్ష సోషలిస్ట్ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత తిరిగి మళ్ళి ఎన్నికయ్యారు.
- పోర్చుగల్ దేశ రాజధాని :లిస్బన్
- పోర్చుగల్ దేశ కరెన్సీ : యూరో
- పోర్చుగల్ దేశ ప్రదాని : అంటోనియో కోస్టా
క్విక్ రివ్యు :
ఏమిటి: పోర్చుగల్ దేశ ప్రధాన మంత్రి గా అంటోనియో కొస్టో ఎన్నిక
ఎవరు: అంటోనియో కొస్టో
ఎక్కడ: పోర్చుగల్ దేశ౦
ఎప్పుడు: ఫిబ్రవరి 01
భారత ఆర్మీ నూతన వైస్ చీఫ్ గా భాద్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే :

భారత ఆర్మీ నూతన వైస్ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతీ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటివరకు మనోజ్ తూర్పు ఆర్మీ కమాండర్ గా పనిచేస్తు న్నారు. ఈ పదవికి తాజాగా లెఫ్టినెంట్ జన కల్ ఆర్పీ కలితాను నియమించారు. 1982 లో పాండే ఆర్మీలో చేరారు. పలు కీలక పదవులు నిర్వహించడంతో పాటు అనేక కీలక యుద్ధాల్లో ఈయన పాల్గొన్నారు. పరమ్ విశిష్ట సేవా మెడల్ తో పాటు పలు అవార్డులు ఆయనకు దక్కాయి. ఏప్రిల్లో ఆర్మీ చీఫ్ నరవణి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో సీనియర్ అధికారి మనోజ్ పాండే ఏప్రిల్ అనంతరం ఈ పదవి చేపట్టే అవకాశాలున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత ఆర్మీ నూతన వైస్ చీఫ్ గా భాద్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
ఎవరు: లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
ఎప్పుడు: ఫిబ్రవరి 01
డీఆర్డీ ఎల్ నూతన డైరెక్టర్ జి. ఎ. శ్రీనివాసమూర్తి నియామకం :

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)కు చెందిన హైదరాబాద్ లోని ప్రముఖ పరిశోధనశాల డీఆర్డీ ఎల్(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ) నూతన డైరెక్టర్ జి. ఎ. శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. కంచన్ బాగ్లోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ దశరథ్ రామ్ జనవరి 30న పదవీ విరమణ పొందగా ఆయన స్థానంలో మూర్తిని నియమించారు. ఈయన ఇప్పటివరకు అడ్వాన్స్డ్ నావల్ సిస్టమ్ కు ప్రోగ్రామ్ డైరెక్టర్ గా ఉన్నారు. శ్రీనివాసమూర్తి స్వస్థలం విశాఖపట్నం. 1986లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఈ ఎలక్ట్రానిక్స్ “చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిజిటల్ సిస్టమ్స్ లో ఎంఈ చేశారు. 1987లో డీఆర్డీఎల్ లో చేరారు.
- డిఆర్డిఎల్ స్థాపన : 1961
- డిఆర్డిఎల్ ప్రదాన కార్యాల యం : హైదరబాద్
క్విక్ రివ్యు :
ఏమిటి: డీఆర్డీ ఎల్ నూతన డైరెక్టర్ జి. ఎ. శ్రీనివాసమూర్తి నియామకం
ఎవరు: జి. ఎ. శ్రీనివాసమూర్తి
ఎప్పుడు: ఫిబ్రవరి 01
మహాకాళి నది పైన మోటరబుల్వంతెన నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్న భారత్ నేపాల్ దేశాలు :

ఉత్తరాఖండ్ లో ని ధార్చులాను నేపాల్లోని దార్చులతో కలిపే మహాకాళి మోటరబుల్ వంతెన నిర్మాణం కోసం భారతదేశం మరియు నేపాల్ ఫిబ్రవరి 01 న అవగాహన ఒప్పందం (ఎంఓయు) పై సంతకం చేశాయి. నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని భారత్ భరిస్తుందని, బ్రిడ్జికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ ఇప్పటికే పూర్తయిందని రవాణా మంత్రిత్వ శాఖలోని సమాచార వర్గాలు తెలిపాయి. ఈ వంతెన నేపాల్ లోని సుదుర్వాస్చిమ్ ప్రావిన్స్ మరియు ఉత్తరాఖండ్ ల మధ్య సరిహద్దు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఇక్కడ సరిహద్దుకు ఇరువైపులా ఉన్న కమ్యూనిటీల మధ్య ప్రజలకు ప్రజలకు దగ్గరి సంబంధాలు ఉండే మహాకాళి నది మీదుగా ఉంటుంది.
- నేపాల్ దేశ రాజధాని : ఖాట్మండు
- నేపాల్ దేశ కరెన్సీ : నేపాలీస్ రూపీ
- నేపాల్ దేశ ప్రదాని : భిద్యా దేవి బండారి
- నేపాల్ దేశ అద్యక్షుడు : షేర్ బహదూర్ దేభ్రా
క్విక్ రివ్యు :
ఏమిటి: మహాకాళి నది పైన మోటరబుల్వంతెన నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్న భారత్ నేపాల్ దేశాలు
ఎవరు: భారత్ నేపాల్ దేశాలు
ఎప్పుడు: ఫిబ్రవరి 01
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |