Daily Current Affairs in Telugu -30-11-2019
మంచిర్యాల అడవుల్లో అరుదైన ముద్రలు:
మంచిర్యాల జిల్లాలోని అటవీ ప్రాంతాలు, గోదావరి తీరంలో వేల సంవత్సరాల కు పూర్వం జీవ పరిమానం ఉందా? అంటే అవుననే అంటోంది తెలంగాణ జాగృతి చరిత్ర బృందం . పాత్ర శిలజలాల్ని ఈ ప్రాంతంలో గుర్తించినట్లు వెల్లడించింది. డైనోసార్లు, ఇతర జీవుల శిలాజ స్థావరంపై కొంతకాలంగా చేస్తున్న అధ్యయనంలో ఆసక్తికరంగా అంశాలు వెలుగు చూసినట్లు తెలంగాణ జాగృతి చరిత్ర బృందం సబ్యుడు సముద్రాల సునీల్ నవంబర్ 29 న వెల్లడించారు.కోటపల్లి అటవీ ప్రాంతంలో పాత్ర శిలాజ ముద్రలు , జైపూర్ ప్రాంతంలో ఓ భారి జంతువు పాదముద్రల అచ్చ్చు శిలజలాలు వందల ఎకరాల్లో విస్తరించిన వృక్ష శిలాజాలను జాగృతి చరిత్ర బృందం గుర్తించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మంచిర్యాల అడవుల్లో అరుదైన ముద్రలు
ఎక్కడ: మంచిర్యాల జిల్లా
ఎప్పుడు: నవంబర్ 29
కంప్యూటర్ ప్రాసెసర్ ఇక యమ స్పీడ్ –సరికొత్త ఎలేక్ట్రో ఆప్టికల్ సాదనం సిద్దం-బ్రిటన్ శాస్త్రవేత్తల ఘనత:
ఆప్టికల్, ఎలక్టానిక్ కంప్యుటర్ వ్యవస్థ సంధానంలో ఉన్న ఇబ్బందిని అధిగమించే సాధనాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీని వల్ల వేగంగా పనిచేసే ,ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించుకునే డేటా నిల్వ సాధనాలు ,ప్రాసెసర్ల రూపకల్పనకు మార్గం సుగమమైంది అని ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం శాస్త్ర వేత్తలు చెపుతున్నారు. ప్రస్తుతం కాంతి ద్వారా సమాచార బట్వాడా ,ఎంకోడ్ చేయడానికి ఉద్దేశించిన సాదనం సంప్రదాయ ఎలక్ట్రానిక్ కంపూటర్ లోని వ్యవస్థ లతో సులువు గా సందానం కావడం లేదు ఎందుకంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం కోసం ఉపయోగించే ఎలెక్ట్రిక్ చిప్ లు పనిచేయడం కోసం చాల చిన్నదిగా ఉండాలి .పోటాన్ల ప్రవాహానికి ఉపయోగించే ఆప్టికల్ చిప్ లు మాత్రం పెద్దదిగా ఉండాలి .ఈ వైరుధ్యాన్ని అధిగమించడానికి పరిశోదకులు కాంతిని నానో స్థాయికి పరిమితం చేసేలా విద్యుత్ ఆప్టికల్ ను ద్వంద విధులు నిర్వర్తించే సాధనాన్ని అబివృద్ది చేసారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కంప్యూటర్ ప్రాసెసర్ ఇక యమ స్పీడ్ –సరికొత్త ఎలేక్రో ఆప్టికల్ సాదనం సిద్దం-బ్రిటన్ శాస్త్రఫ్వేత్తల ఘనత
ఎక్కడ: లండన్
ఎప్పుడు: నవంబర్ 29
సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ వినేష్ ,సాక్షి:
సీనియర్ రెజ్లింగ్ జాతీయ చాంపియన్ షిప్ లో బారత అగ్రశ్రేణి రెజ్లర్లు వినేష్ పోగాట్ (55కేజీలు),సాక్షి మాలిక్ (62కేజిలు) స్వర్ణాలతో సత్తాచాటారు. నవంబర్ 30 న ఫైనల్లో వినేష్ పోగాట్ 7-3 తో 20 ఎల్ల అంజు (హరియానా ) పై నెగ్గి వరుసగా రెండో ఏడాది టైటిల్ ను దక్కించుకుంది. మరో తుది పోరులో సాక్షి 4-2 తో రాధిక (హర్యానా ) పై గెలిచింది.68 కేజీల విబాగంలో అనిత షేరోన్ (హరియాన ) పసిడి నెగ్గింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ వినేష్ ,సాక్షి
ఎక్కడ: జలంధర్
ఎవరు: వినేష్ ,సాక్షి
ఎప్పుడు: నవంబర్ 29
డేవిస్ కప్ లో తిరుగులేని విజయం –సత్తా చాటిన లియాండర్ పేస్ ,జీవన్
డేవిస్ కప్ లో భారత్ కు విజయం సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ మెరిసిన వేల బారత బృందం 4-0 తో పాకిస్తాన్ ను చిత్తు చేసింది. నవంబర్ 30న జరిగిన డబుల్స్ పోరులో లియాండర్ పేస్, జీవన్ 6-1 ,6-3 తో మహమ్మద్ షోయబ్ ,అబ్దుల్ రెహ్మాన్ ను చిత్తు చేయగా రివర్స్ సింగిల్స్ మ్యాచ్ లో సుమిత్ నగాల్ 6-1 ,6-0 తో యాషెస్ ఖలిల్ ను ఓడించి బారత్ కు 4-0 తో విజయాన్ని అందించారు. డబుల్స్ పోరులో 46 ఎల్ల పేస్ ఆటే రెండో రోజు హైలెట్ గా నిలిచింది. 53 నిమిషాలలో ముగిసిన ఈ మ్యాచ్లో పేస్ ,జీవన్ దాటికి పాక్ జోడి నిలువలేకపోయింది. తొలి సెట్లో ఆరంబంలోనే ప్రత్యర్తి సర్విస్ బ్రేక్ చేసి 5-1 తో ఆధిక్యంలో నిలిచినా పేస్ ద్వయం ఆ తర్వాత 6-1 తో సెట్ గెలుచుకుంది. రెండో సెట్లో ప్రత్యర్థి కాస్త మెరుగ్గా ఆడి 3-3 తో నిలిచినా ఎనిమిదో గేములో పాక్ జడి సర్వీస్ బ్రేక్ చేసిన లియాండర్ జంట 5-3 తో ఆధిక్యం లోకి వెళ్ళడమే కాక ఆపై సర్వీస్ నిలబెట్టుకొని 6-3 తో సెట్ తో పాటు మ్యాచ్ నెగ్గింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డేవిస్ కప్ లో తిరుగులేని విజయం సాదించి సత్తా చాటిన లియాండర్ పేస్ ,జీవన్
ఎక్కడ: నూర్ సుల్తాన్
ఎవరు: లియాండర్ పేస్ ,జీవన్
ఎప్పుడు: నవంబర్ 29
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
రామజోగయ్య శాస్త్రికి గురుజాడ పురస్కారం:
మహాకవి గురజాడ అప్పారావు వర్దంతిని పురస్కరించుకొని నవంబర్ 29న విజయనగరంలో సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం చేశారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రచయిత, సినీ నటులు తనికెళ్ళ భరణి విశిష్ట అతిధిగా హాజరయ్యారు. గురజాడ వాడిన వస్తువులతో పట్టణంలో ఊరేగింపు నిర్వహంచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రామజోగయ్య శాస్త్రికి గురుజాడ పురస్కారం:
ఎక్కడ: విజయనగరం
ఎవరు: రామజోగయ్యశాస్త్రి
ఎప్పుడు: నవంబర్ 29
భత్యం పథకం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా గా మార్పు:
ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స విశ్రాంతి సమయంలో భత్యం ఇచ్చే పథకానికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని పేరు నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ వైద్యరోగ్య శాఖ నవంబర్29న ఉత్తర్వులు జారి చేసింది. ఈ పథకం కింద ఒకే వ్యక్తికి సంవత్సర కాలంలో పలు రకాల వ్యాధులకు శస్త్ర చికిత్స లు జరిగిన ఆసరా వర్తిస్తుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భత్యం పథకం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా గా మార్పు:
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 29
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |