Daily Current Affairs in Telugu 28-02-2020
దక్షిణ డిస్కం కు స్మార్ట్ గ్రిడ్ ఉత్తమ పురస్కారం :
కేంద్ర పట్టనాబివృద్ది సంస్థ నిర్వహిస్తున్న స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో భాగంగా నగరాలు ,పట్టణాల అబివృద్ది కోసం చక్కని కృషి చేసిన ప్రబుత్వ ప్రయివేటు సంస్తలకిచ్చే స్మార్ట్ గ్రిడ్ ఉత్తమ పురస్కారం దక్షిణ తెలంగాణా విద్యుత్ పంపిణి సంస్థ (డిస్కం ) కు లబించింది. గరిష్ట విద్యుత్ డిమాండు నిర్వహణ ,సౌర విద్యుత్ ఉత్పత్తి అడ్వాన్స్ మీటరింగ్ వంటి అధునాతన పద్దతులను అవలంబిస్తూ ఉన్నందుకు ఈ పురస్కారం నకు ఎంపిక చేశారు. డిల్లీలో ఫిబ్రవరి 28న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పట్టనబివ్రుద్ది శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి నుంచి సంస్థ సంచాలకుడు తోట శ్రీనివాస్ అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణ దిస్కం కు స్మార్ట్ గ్రిడ్ ఉత్తమ పురస్కారం
ఎవరు: తోట శ్రీనివాస్
ఎక్కడ:హైదరాబద్
ఎప్పుడు:ఫిబ్రవరి 28
వెనిజుల తదుపరి భారత రాయబారి గా అబిషేక్ సింగ్ నియామకం :
బోరివిలియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా లో భారత తదుపరి రాయబారి గా అబిషేక్ సింగ్ నియమితులయ్యారు.ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లోని కాబుల్ కార్యాలయం డిప్యుటీ చీఫ్ గా పనిచేస్తున్నారు.ఇటీవలే కన్ను మూసిన రాజీవ్ కుమార్ నాపాల్ తరువాత ఆయన రానున్నారు..అతను 2003 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీసి అధికారిగా (ఐఎఫ్ఎస్)అధికారిగా పనిచేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వెనిజుల తదుపరి భారత రాయబారి గా అబిషేక్ సింగ్ నియామకం
ఎవరు: అబిషేక్ సింగ్
ఎక్కడ: వెనిజుల
ఎప్పుడు:ఫిబ్రవరి 28
ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పయోంగ్ కు వివేక నందా కర్మ యోగి అవార్డు:
ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పయోంగ్ కు స్వామి వివేకా నంద కర్మ యోగి అవార్డు 2020 ను న్యు డిల్లీలో ఇవ్వనున్నారు , బారీ అటవీ నిర్మూలన ద్వారా నిజమైనమానవ నిర్మిత అడవ్ని సృష్టించడంలో ఆయన చేసిన కృషికి గాను 6 వ కర్మ యోగి అవార్డు లబించిది.ఈ అవార్డు ట్రోఫి తో పాటు గుర్తింపు పత్రం మరియు ఒక లక్ష రూపాయలు రివార్డుతో కూడి ఉన్న అవార్డును ప్రదానం చేస్తారు..
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పయోంగ్ కు వివేక నందా కర్మ యోగి అవార్డు
ఎవరు: జాదవ్ పయోంగ్
ఎప్పుడు:ఫిబ్రవరి 28
ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ శెట్టర్ కన్నుమూత :
ప్రముఖ చరిత్రకారుడు ,పరిశోధకుడు డాక్టర్ ఎస్ శెట్టర్ (65)కన్నుమూసారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న ఆయన ఫిబ్రవరి 28 న బెంగళూర్ లో తుది శ్వాస విడిచారు.కర్నాటక లో ని బళ్ళారి జిల్లా హంస సాగరంలో జన్మించిన షడక్షరి శేత్తర్ మైసూర్ ధార్వాద్ ,కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో విద్యబ్యాసాన్ని పూర్తి చేసారు.చరిత్ర ,కళలు పురాతన వస్తు తవ్వకాలు ,పర్యాటకం ,గ్రాంధికం ,భాదాంశాలపై 27 కు పైగా పరిశోదన గ్రందాలను రాసారు.వివిధ వర్సిటీలో ఆచార్యులుగా సేవలందిస్తూనే 1978-95 మద్య కాలంలో భారతీయ కళా చరిత్ర సంస్థకు సంచాలకులుగా కీలక బాద్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ శెట్టర్ కన్నుమూత
ఎవరు: డాక్టర్ శెట్టర్
ఎప్పుడు:ఫిబ్రవరి 28
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
డిల్లీలో జరగనున్న్న రైజ్ -2020 శికరగ్ర సమావేశం :
న్యుదిల్లిలో ఏప్రిల్ 11-12 నుండి జరగనున్న మెగా ఈవెంట్ రైజ్-2020 సామాజిక సాధికారత 2020 కోసం బద్యతాయుతమైన ఆర్తిఫిసియాల్ ఇంటలిజెన్స్ అని భారత ప్రబుత్వం ప్రకటించిది.ఇండస్ట్రీ అండ్ ఆకదమియా బాగాస్వామ్యంతో ప్రబుత్వం నిర్వహించిన భారత దేశపు మొదటి ఆర్టిఫిసియాల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ .ఈశికరాగ్ర సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ నిపుణులు హాజరు కానున్నారు.ఇధీ సామాజిక సాధికారత ,ట్రాన్స్ వైపు AI ని ఉపయోగించడం పై ద్రుష్టి పెడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిల్లీలో జరగనున్న్న రైజ్ -2020 శికరగ్ర సమావేశం
ఎక్కడ:డిల్లిలో
ఎప్పుడు:ఫిబ్రవరి 28
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |