Daily Current Affairs in Telugu 19-06-2020
ఎన్.ఐపిఎఫ్ పి చైర్మన్ గా నియమితులయిన ఉర్జీత్ పటేల్ :
ఎన్.ఐపి (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసి) చైర్మన్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఉర్జేత్ పటేల్ గారు నియమితులయినారు. ప్రస్తుత చైర్మన్ విజయ్ కేల్కర్ నుంచి ఆయన జూన్ 22 బాధ్యతలు స్వీకరిస్తారు నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019 సెప్టెంబర్ వరకు పదవిలో ఉండే అవకాశం ఉన్న 2018 డిసెంబర్ 10 న ఆర్.బిఐ గవర్నర్ పదవికి ఉర్జేత్ పటేల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే .
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎన్.ఐపిఎఫ్ పి చైర్మన్ గా నియమితులయిన ఉర్జీత్ పటేల్
ఎవరు : ఉర్జీత్ పటేల్
ఎప్పుడు: జూన్ 19
75 వ యు.ఎన్ జనరల్ అసెంబ్లీ కి కొత్త అద్యక్షుడిగా ఎన్నికైన వోల్కాన్ బోజ్కిర్ :
టర్కీ దౌత్యవేత్త అయిన వోల్కాన్ బోజ్కిర్ 2020 సెప్టెంబర్ లో 75వ ఐక్యరాజ్యసమితి సర్వ సబ్య సమావేశనికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.బోజ్కిర్ అబ్యార్తిత్వ్వాన్ని పాశ్చాత్య యురోపియన్ మరియు ఇతర దేశాల నుండి ఆమోదం తెలిపారు. వోల్కన్ బోజ్కిర్ తనకు అనుకూలంగా 178 ఓట్లు పొందారు. మిగతా11 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగింది. బోజ్కిర్ ప్రస్తుతం ఇస్తాంబుల్ నుండి జస్టిస్ అండ్ డెవలప్ మెంట్ (ఎకే)పార్టీ శాసన సభ్యుడిగా మరియు టర్కిష్ పార్లమెంట్ విదేశీ వ్యవహారాల కమిటీ అధిపతిగా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 75 వ యు.ఎన్ జనరల్ అసెంబ్లీ కి కొత్త అద్యక్షుడిగా ఎన్నికైన వోల్కాన్ బోజ్కిర్
ఎవరు: వోల్కాన్ బోజ్కిర్
ఎక్కడ: న్యూయార్క్
ఎప్పుడు: జూన్ 19
4ఆసియా యూత్ పారా గేమ్స్ 2021 సంవత్సరానికి గాను ఆతిథ్యం ఇవ్వనున్న బహ్రెయిన్ దేశం :
2021 డిసెంబర్ లో బహ్రెయిన్ లో జరగనున్న 4వ ఎడిషన్ ఆసియా పారా ఒలింపిక్ కమిటీ (ఐపసి) ప్రకటించింది.20 ఏళ్ల లోపు గల 800 మంది అథ్లెట్లు తొమ్మిది క్రీడలలో పోటీ పడతారు. అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ ,బోకియ,గోల్ బాల్,పారా తైక్వండో,పవర్ లిఫ్టింగ్ ,స్విమ్మింగ్ ,టేబుల్ టెన్నిస్ మరియు వీల్ చైర్ బాస్కెట్ బాల్ ప్రభుత్వ సహకారం తో బహ్రెయిన్ జాతీయ పారా ఒలింపిక్ కమిటీ (ఎన్ఫిసి) తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 4ఆసియా యూత్ పారా గేమ్స్ 2021 సంవత్సరానికి గాను ఆతిథ్యం ఇవ్వనున్న బహ్రెయిన్ దేశం
ఎవరు: బహ్రెయిన్ దేశం
ఎక్కడ: బహ్రెయిన్
ఎప్పుడు: జూన్ 19
భారతదేశంలోనే మొట్టమొదటి కోవిద్-19 పరిక్షల కోసంమొబైల్ ల్యాబ్ ప్రారంబించిన కేంద్ర మంత్రి హర్షవర్దన్ :
భారత దేశంలోని గ్రామిన మరియు వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలలో కోవిద్-19 పరీక్ష లు చేయటానికి భారత దేశంలోనే మొట్టమొదటి మొబైల్ ప్రయోగ శాలను కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి అయిన హర్షవర్దన్ గారు జూన్ 18న ప్రారంబించారు.ఇన్ఫెక్ట్ యాస్ డిసీజ్ డయగ్ ల్యాబ్ (ఐల్యాబ్ ) –ర్యాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబరేట రీ యొక్క ప్రదాన లక్ష్యం ఏమనగా భారతదేశంలో క్లిష్టమైన హెల్త్ కేర్ టెక్నాలజీ కొరతను తీర్చడం మరియు స్వయం సమృద్ది దశకు క్రమంగా వెళ్ళడం ముఖ్య ఉద్దేశం. ఐ ల్యాబ్ కోవిద్-19 మరియు నాన్ కోవిద్ పరీక్షలను నిర్వహించగలదు అదే రోజు వెంటనే పలితాలను ఇస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశంలోనే మొట్టమొదటి కోవిద్ -19 పరిక్షల కోసం మొబైల్ ల్యాబ్ ప్రారంబించిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
ఎవరు: కేంద్ర మంత్రి హర్షవర్దన్
ఎప్పుడు: జూన్ 19
ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు కే.ఆర్ సచిదానందన్ కన్నుమూత:
మలయాళ చిత్ర దర్శకుడు ,స్క్రిప్ట్ రైటర్ ,నిర్మాత కే.ఆర్ సచిదానందన్ కన్ను మూసారు. అయన గుండెపోటు కారణంగా మూడు రోజుల నుంచి త్రిసూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన్ను జాయిన్ చేశారు.ఆరోగ్య పరిస్థతి విషమించడంతో అయన తుదిశ్వాస విడిచాడు.2007 లో వచ్చిన మలయాళం చిత్రం అయిన చాక్లెట్ కు సేతుతో కలిసి సచిదనంధన్ ఇండస్ట్రి కి పరిచయం అయ్యాడు.ఆయన 2015 లోఅనార్కలి చిత్రంతో సచిదనంద్ దర్శకుడిగా చిత్ర సీమకు పరిచయం అయ్యారు. దర్శకుడిగా ఆయనకు అయ్యపనుం కోశియుమ్ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు కే.ఆర్ సచిదానందన్ కన్నుమూత
ఎవరు: కే.ఆర్ సచిదానందన్
ఎక్కడ: కేరళ
ఎప్పుడు: జూన్ 19
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |