Daily Current Affairs in Telugu 09-07-2020
STIP 2020 పై నియమించిన కమిటికి సిజో కురువిల్ల జార్జ్ నియామకం :

సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ 2020 (STIP 2020) పై కేంద్ర ప్రభుత్వ నియమించిన కమిటీకి అద్యక్షుడిగా సిజో కురువిల్లా జార్జ్ నియమితులయ్యారు. అతను స్టార్టప్ విలేజ్ వ్యవస్థాపక CEO మరియు రీ-థింక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. దీనితోపాటు అతను ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్లో భాగమయ్యాడు, ఇది హర్కేష్ మిట్టల్ నేతృత్వంలో ఉంది, అతను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి కూడా నాయకత్వం వహిస్తాడు. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ 2020 (STIP 2020) ను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంను మరియు కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ రూపొందించారు. శాస్త్రీయ ఆవిష్కరణలకు ఇవ్వవలసిన ఉత్సాహంతో ప్రస్తుత 2013 విధానాన్ని నవీకరించాల్సిన బాధ్యత ఈ కమిటీపై ఉంది. ఇది దేశంలో ఐదవ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం.
క్విక్ రివ్యు :
ఏమిటి: STIP 2020 పై నియమించిన కమిటికి సిజో కురువిల్ల జార్జ్ నియామకం :
ఎవరు: సిజో కురువిల్ల జార్జ్
ఎప్పుడు: జులై 09
హాకి ఇండియా అద్యక్షుడు ముస్తాక్ అహ్మద్ రాజీనామా :

హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేశాడు. జాతీయ క్రీడా నియమావళి పదవీకాల మార్గద ర్శకాలను ఉల్లంఘిస్తూ అధ్యక్షుడిగా ఎన్నికైనం దున వెంటనే వైదొలగాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించిన నేపథ్యంలో అహ్మద్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతని నిర్ణయాన్ని ఆమోదించిన హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డు మణిపూర్ కు చెందిన జ్ఞానేంద్రో నిగోంబం ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది
క్విక్ రివ్యు :
ఏమిటి: హాకి ఇండియా అద్యక్షుడు ముస్తాక్ అహ్మద్ రాజీనామా
ఎవరు: ముస్తాక్ అహ్మద్
ఎప్పుడు: జులై 09
టాప్ 10 కుబేరుల జాబితాలో 7వ స్థానానికి చేరుకున్న ముఖేష్ అంబానీ :

రిలయన్స్ అధినేత అయిన ముకేష్ అంబానీ యొక్క ఖాతాలో మరొక ఘనత నమోదయింది. టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురు అయిన వారెన్ బఫెట్ను అధిగమించి 7వ స్థానానికి చేరారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియన్ సూచీ ప్రకారం జూలై 10న ముకేశ్ అంబాని యొక్క సంపద మరో 2 బిలియన్ డాలర్లు పెరిగి 70.1 బిలియన్ డాలర్లకుచేరింది. దీంతో టాప్ 10 కుబేరుల్లో ముకేశ్ 7వ స్థానానికి చే ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న బఫెట్ సంపద విలువ 67.8 బిలియన్ డాలర్లుగా ఉంది. సంపన్నులకు చెందిన రోజువారీ షేర్ల యొక్క ధరల ఆధారంగా ఈ ఫోర్బ్స్ వారి వారి సంపద ను విలువను లెక్కగట్టి ఈ జాబితాను తయారు చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: టాప్ 10 కుబేరుల జాబితాలో 7వ స్థానానికి చేరుకున్న ముఖేష్ అంబానీ
ఎవరు: ముఖేష్ అంబానీ
ఎప్పుడు: జులై 09
గిన్నిస్ రికార్డుల్లోకి చేరిన 2018-19 సంవత్సరం యొక్క సర్వే:

భారత్ దేశంలో లో పులుల సంఖ్యను లెక్కించేందుకు 2018-19లో భారత ప్రభుత్వం నిర్వహించిన సర్వే.. గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది.ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్ లైఫ్ సర్వేగా కూడా ఇది రికార్డుకెక్కింది. దేశంలో 2,967 పులులు ఉన్నట్లు సర్వే తేల్చింది. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం పులులు భారత్ లోనే ఉన్నాయి. పులుల గణన సర్వే 2018 9 లో భాగంగా 1,21,337 చదరపు కిలోమీటర్ల (46,848 చదరపు మైళ్లు) విస్తీర్ణంలో 26,838 ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి 34,85,8623 ఫొటోలను చిత్రీకరించాయి. ఇందులో 76,651 ఫొటోలు పులులకుసంబంధించినవి గా ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: గిన్నిస్ రికార్డుల్లోకి చేరిన 2018-19 సంవత్సరం యొక్క సర్వే
ఎప్పుడు: జులై 09
కరిబియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు లబించిన అనుమతి :

టి20 ఫార్మాట్ లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) నిర్వహణకు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం CPL T20(Caribbean Premier League) నిర్వహణకు అనుమతి ఇచ్చింది.అయితే ప్రేక్షకులు లేకుండా ఈ లీగ్ ను నిర్వహించుకోవాలని తెలిపింది. దీంతో సీపీఎల్ ఏడో సీజన్ 2020, ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని రెండు వేదికల్లో ప్రేక్షకుల ప్రవేశనం లేకుండా జరిగనుంది. మొత్తం ఆరు జట్లు (బార్బడోస్ ట్రైడెంట్స్, గయానా అమెజాన్ వారియర్స్, జమైకా తలవాస్, సెయింట్ కిట్స్ ఇందులో పాల్గోనబోతున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: కరిబియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు లబించిన అనుమతి
ఎవరు: ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం
ఎప్పుడు: జులై 09
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |