
Daily Current Affairs in Telugu 14-07-2020
2020సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్న టాటా చైర్మన్ చంద్రశేకరన్ :

టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, లాక్హీడ్ మార్టిన్ సీఈవో జిమ్ టైక్లెట్ ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక యుఎస్ఐబిసి అవార్డు అందుకోనున్నారు. “అద్భు తమైన నాయకత్వం, భారత్-అమెరికా సంబంధాల పురోగతికి కృషి చేసిన వారికి గుర్తిం పుగా ఏటా యూఎస్ బీసీ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందించడం కొనసాగుతోంది” అని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ బీసీ) ప్రకటించింది. ఎన్.చంద్రశేఖర్ జిమ్ టైక్లెట్ ఇద్దరూ యూఎస్ ఇండియా సీఈవో ఫోరమ్ కు సహ అధ్యక్షుడు ఉండడం గమనార్హం. గతంలో సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి, గూగుల్ సుందర్ పిచాయ్, అమె జాన్ జెఫ్ బెజోస్ తదితరులు కూడా ఈ అవార్డు లను అందుకున్న వారిలో ఉన్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి : 2020సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్న టాటా చైర్మన్ చంద్రశేకరన్
ఎవరు: టాటా చైర్మన్ చంద్రశేకరన్
ఎప్పుడు: జులై 14
బిసిసిఐ తాత్కాలిక సియివో గా హేమంగ్ అమీన్ నియామకం :

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రోజూవారీ కార్యకలాపాల పర్యవేక్షణకు తాత్కాలిక ప్రాతిపదికన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీత)ను నియమించింది. హేమంగ్ అమీన్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు రాహుల్ జోధా ఇటీవలే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సీఈఓ ఎంపిక అనివార్యమైంది అమీన్ ఐపీఎల్కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పని చేశారు. 2019 ఐపీఎల్ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దుచేసి ఆ మొత్తాన్ని పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంక్షేమం కోసం ఇవ్వాలని నిర్ల పించింది ఆయన. ‘గత రెండేళ్లుగా బీసీసీఐలో హేమంగ్ ఎంతో బాధ్యతతో పని చేస్తున్నారు బీసీసీఐకి వ్యాపార ఒప్పందాలు కుదర్చడంలో కూడా కీలక పాత్ర పోషించారు. నిజాయితీపరుడు, సమర్థుడైన హేమంగ్ ఈ పదవికి సరైన వ్యక్తి’ అని బీసీసీఐ సీనియర్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు
క్విక్ రివ్యు :
ఏమిటి : బిసిసిఐ తాత్కాలిక సియివో గా హేమంగ్ అమీన్ నియామకం
ఎవరు: హేమంగ్ అమీన్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జులై 14
తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ లో2వ స్థానం లో నిలిచిన విరాట్ కోహ్లి :

తాజా గా ప్రకటించిన ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పుజారా (7వ) రహానె (9వ) ర్యాంకుల్లోనూ మార్పు లేదు. స్టీవ్ స్మిత్ అగ్రస్థానం లోనే ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో కమిన్స్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ తో జరగిన తొలి టెస్టులో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ హోల్డర్ (862 పాయింట్లు) తన కెరీర్ లోనే అత్యుత్తమంగా రెండో ర్యాంకు సాధించాడు. కోట్నీ వాల్ట్ (866, 2000 ఆగస్టు) తర్వాత అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన విండీస్ బౌలర్గా అతడు నిలి చాడు. బుమ్రా ఏడో స్థానంలో ఉన్నాడు. ఆల్రౌం డర్ల జాబితాలో హోల్డర్, స్టోక్స్, జడేజా మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు..
క్విక్ రివ్యు :
ఏమిటి : తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ లో2వ స్థానం లో నిలిచిన విరాట్ కోహ్లి
ఎవరు: విరాట్ కోహ్లి
ఎప్పుడు: జులై 14
భారత ప్రదాని నరేంద్ర మోడి తో గూగుల్ సియివో సుందర్ పిచాయ్ వర్చువల్ సమావేశం :

ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జూలై 13న వర్చువల్ సమావేశమయ్యారు.డేటా భద్రత, గోప్యత పై సందేహాలు, రైతాంగానికి సాంకేతికతను మరింతగా చేరువ చేయడం, ఆన్లైన్ విద్య విధానాన్ని విస్తరించడం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. భారత మార్కెట్లో ప్రణాళికల్లో భాగంగా ప్రసార భారతితో కూడా జట్టు కడుతున్నట్లు గూగుల్ తెలిపింది. డిజిటల్ సాధనాలతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలను మల్చుకునేలా చిన్న సంస్థల్లో అవగాహన పెంచేందుకు దూరదర్శన్ లో ఎడ్యుటెయిన్మెంట్ సిరీస్ను ప్రారంభించింది. అలాగే, 2020 ఆఖరు నాటికి భారత్ లో పైచిలుకు పాఠశాలలో 10 లక్షల మంది పైగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు సీబీఎస్ఈ జట్టుకట్టామని గూగుల్ వెల్లడించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత ప్రదాని నరేంద్ర మోడి తో గూగుల్ సియివో సుందర్ పిచాయ్ వర్చువల్ సమావేశం
ఎవరు: భారత ప్రదాని నరేంద్ర మోడి, గూగుల్ సియివో సుందర్ పిచాయ్
ఎప్పుడు: జులై 14
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |