Daily Current Affairs in Telugu 09&10-09-2021
ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి హేమంత్ ధన్జి :
ఆస్ట్రేలియా లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన హేమంత్ ధనీ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన భారత మూలాలు ఉన్న తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం. 1990లో ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టారు. క్రిమినల్ చట్టాల్లో ఆయనకు విశేష ప్రావీణ్యం ఉంది. 1990 లో న్యాయవాద ప్రాక్టీస్ ప్రారంభించిన ధన్జీకి 30 సంవత్సరాల కంటే ఎక్కువ న్యాయపరమైన అనుభవం ఉంది. ఆయనను అభినందిస్తూ ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి హేమంత్ ధని
ఎవరు: హేమంత్ ధని
ఎక్కడ: ఆస్ట్రేలియా
ఎప్పుడు: సెప్టెంబర్ 10
దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ మద్రాస్ :
దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటీ మద్రాస్ మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. విశ్వవిద్యాలయాల కేటగిరిలో ఐఐఎస్ బెంగ ళూరు, కళాశాలల విభాగంలో ఢిల్లీలోని మిరండా హౌస్ ప్రథమ స్థానంలో నిలిచాయి. టాప్-100లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 48.65 స్కోరుతో 48వ స్థానంలో, కేఎల్ యూనివర్సిటీ 45.64 స్కోరుతో 69వ స్థానంలో, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం 42.78 స్కోరుతో 92వ స్థానంలో ఏయూకు 40వ స్థానంలో నిలిచాయి. కాగా ఈ ర్యాంకులను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల గురువారం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్-2021 ర్యాంకులను చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ మద్రాస్
ఎవరు: . కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఎప్పుడు: సెప్టెంబర్ 10
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి గా సమీర్ శర్మ నియామకం :
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ సమీర్ శర్మ. ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగాకూడా పనిచేశారు. అక్టోబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి గా సమీర్ శర్మ నియామకం
ఎవరు: సమీర్ శర్మ
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦
ఎప్పుడు: సెప్టెంబర్ 10
జాతీయ మైనారిటీల కమిషన్ ఛైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన ఇక్బాల్ సింగ్ లాల్పుర :
చండీగఢ్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఐపిఎస్, పంజాబ్ కేడర్ అధికారి మరియు బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ఇక్బాల్ సింగ్ లాల్పురాను జాతీయ మైనార్టీ కమిషన్ చైర్పర్సన్గా నియమించింది.ఈయన కమిషన్ చైర్ పర్సన్ గయోరుల్ హసన్ స్థానంలో ఉంటారు. పోలీస్ ఆఫీసర్ గా తన విశిష్ట కెరీర్ లో లాల్పురా కు ఆయన చేసిన సేవకు గాను రాష్ట్రపతి పోలీసు మెడల్ లభించింది. పండితుడిగా, అతనికి శిరోమణి సిక్కు సాహిత్కార్ అవార్డు మరియు సిక్కు స్కాలర్ అవార్డు లభించింది. జాతీయ మైనార్టీల కమిషన్ చట్టం, 1992 కింద కేంద్ర ప్రభుత్వం మైనారిటీల జాతీయ కమిషన్ (NCM) ను ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ మైనారిటీల కమిషన్ ఛైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన ఇక్బాల్ సింగ్ లాల్పుర
ఎవరు: ఇక్బాల్ సింగ్ లాల్పుర
ఎప్పుడు: సెప్టెంబర్ 10
ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ గా నియమితులయిన గుర్మీత్ సింగ్ :
ఆర్మీ డిప్యూటీ చీఫ్ పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ సెప్టెంబర్ 09న ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు, ఇటీవల బేబీ రాణి మౌర్య రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిలో ఈయన నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ ప్రకటన ప్రకారం, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బేబీ రాణి మౌర్య రాజీనామాను ఆమోదించారు మరియు గుర్మీత్ సింగ్ ను రాష్ట్ర గవర్నర్ గా నియమించారు. లెఫ్టినెంట్ జనరల్ గా గుర్మీత్ సింగ్ సింగ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అందించిన సేవల తర్వాత ఫిబ్రవరి 2016లో సైన్యం నుండి ఉపసంహరించుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ గా నియమితులయిన గుర్మీత్ సింగ్
ఎవరు: గుర్మీత్ సింగ్
ఎక్కడ: ఉత్తరాఖండ్ రాష్ట్రము
ఎప్పుడు: సెప్టెంబర్ 10
13 వ బ్రిక్స్ దేశాల సదస్సుకు అధ్యక్షత వహించిన భారత ప్రదాని నరేంద్ర మోడి :
ఇతరదేశాలపై ఉగ్రదాడులు చేసేందుకు అఫ్గాన్ భూభాగం ఉపయోగపడకుండా నిరోధించాలని బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాలపై పోరాడాలని పిలుపునిచ్చాయి. ఆన్ లైన్లో భారత ప్రధాని మోదీ గారి ఆధ్వ ర్యంలో 13వ బ్రిక్స్ సమావేశం జరిగింది. అఫ్గాన్ లో పరిస్థితులతో పాటు ఇతర కీలక పరిణామాలపై సభ్యదేశాలు విస్తృత చర్చలు జరిపాయి. సమావే శంలో రష్యా అధిపతి పుతిన్, చైనా ప్రెసిడెంట్ జింగ్ పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమఫోసా, బ్రెజిల్ అధినేత బోల్సనారో ఆన్లైన్లో పాల్గొన్నారు. సదస్సు చివరలో అన్ని దేశాలు కలిసి ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశాయి. అఫ్గాన్ లో పరిస్థితులు శాంతియుతంగా ముగియాలని డిక్లరేష షన్లో కోరాయి. అఫ్గాన్లోని అన్ని వర్గాల మధ్య సామరస్య చర్చలు సాగాలని, తద్వారా దేశంలో శాంతి, స్థిరత్వం రావాలని ఆకాక్షించాయి. ఇటీవల కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన దాడులను బ్రిక్స్ దేశాలు ఖండించాయి. ఏవిధమైన ఉగ్రకార్య కలాపాలకు అఫ్గాన్ స్థావరంగా మారకూడదని కోరాయి. టెర్రరిజం ఏరూపంలో ఉన్నా గట్టిగా కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్ ను ఆమోదించాయి. టెర్రరిజానికి మతం, జాతీయత, వర్గం రంగు పులమకూడదని బ్రిక్స్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణిని వ్యతిరేకిస్తామని ఐరాస నిబంధనల ఎదుర్కోవాలన్నదే తమ అభిమతమని చెప్పాయి. బ్రిక్స్ దేశాల భద్రతా సంస్థలు రూపొందించిన కౌంటర్ టెర్రరిజం ప్లాన్ ను ఆమోదించాయి.
- ఈ సంవత్సరం బ్రిక్స్ థీమ్ “ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యుటీ, కన్సాలిడేషన్, కన్సెస్
- 2006లో తొలిసారి బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్ గా మారింది.
- బ్రిక్స్ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంగైలో ఉంది.
- 14వ బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షత వహించనుంది.
- ఏటా ఒక దేశం బ్రిక్స్ కు చైర్మన్ గా వ్యవహరిస్తుంది. 2016లో మోదీ బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 13 వ బ్రిక్స్ దేశాల సదస్సుకు అధ్యక్షత వహించిన భారత ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు: భారత ప్రదాని నరేంద్ర మోడి
ఎప్పుడు: సెప్టెంబర్ 10
ప్రపంచ ఆత్మ హత్యల నివారణ దినోత్సవంగా సెప్టెంబర్ 10 :
ఆత్మహత్యను నివారించే మార్గాల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం (WSPD) జరుపుకుంటారు. 2003 నుండి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలతో ప్రపంచవ్యాప్తంగా నిబద్ధత మరియు ఆత్మహత్యలను నివారించడానికి చర్యలను అందించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం గానిర్వహించబడుతుంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (ఐఏఎస్పి) చొరవతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తో కలిసి ఒక ముఖ్యమైన సందేశానికి అంకితమివ్వాలనే ఈ రోజును రూపొందించడానికి సెప్టెంబర్ 10, 2003 న మొదటిసారిగా గుర్తించబడింది ప్రతి సంవత్సరం, IASP రోజును జరుపుకోవడానికి 60 కి పైగా దేశాలలో వందలాది కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ ఆత్మ హత్యల నివారణ దినోత్సవంగా సెప్టెంబర్ 10
ఎక్కడ: ప్రపంచ వ్యప్తంగా
ఎప్పుడు: సెప్టెంబర్ 10
తమిళనాడు గవర్నర్ గా ఆర్.ఎన్. రవి నియామకం :
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సెప్టెంబర్ 09న పంజాబ్, తమిళనాడు మరియు ఉత్తరాఖండ్ కొత్త గవర్నర్లను నియమించారు. రాష్ట్రపతి భవన్ ప్రకటన ప్రకారం, పంజాబ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ఇప్పుడు పూర్తి స్థాయి గవర్నర్గా ఉంటారు. నాగాలాండ్ గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళనాడుకు కొత్త గవర్నర్గా ఉంటారు మరియు అస్సాం ప్రొఫెసర్ జగదీష్ ముఖి నాగాలాండ్కు “సాధారణ ఏర్పాట్లు జరిగే వరకు” అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి తమిళనాడు గవర్నర్ గా ఆర్.ఎన్. రవి నియామకం
ఎక్కడ: తమిళనాడు
ఎప్పుడు: సెప్టెంబర్ 10
Daily current affairs in telugu September- 2021 |
---|
Daily current affairs in telugu 01-09 -2021 |
Daily current affairs in telugu 02-09 -2021 |
Daily current affairs in telugu 03--09 -2021 |
Daily current affairs in telugu 04-09 -2021 |
Daily current affairs in telugu 05-09 -2021 |
Daily current affairs in telugu 06-09 -2021 |
Daily current affairs in telugu 07-09 -2021 |
Daily current affairs in telugu 08-09-2021 |
Daily current affairs in telugu 09-09 -2021 |
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |