
Daily Current Affairs in Telugu 29&30-01-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ – 2022 ను గెలుచుకున్న జపాన్ జట్టు :

ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ – 2022లో జపాన్ జట్టు విజేతగా అవతరించింది. ఒమన్ రాజధాని నగరం మస్కట్ వేదికగా జనవరి 28న జరిగిన ఫైనల్లో జపాన్ 4–2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై నెగ్గి మూడోసారి చాంపియన్ గా నిలిచి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇదే టోర్నీలో భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చైనా జట్టుతో జరిగిన కాంస్య పతక పోరులో పోరులో భారత్ 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి కాంస్యాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు 10 సార్లు జరిగిన ఆసియా కప్ లో భారత జట్టు రెండుసార్లు విజేతగా (2004, 2017), రెండుసార్లు రన్నరప్ గా (1999, 2009), మూడుసార్లు మూడో స్థానంలో (1993, 2013, 2022) నిలిచింది.
- జపాన్ దేశ రాజధాని : టోక్యో
- జపాన్ దేశ కరెన్సీ : జపనీస్ యెన్
- జపాన్ దేశ ప్రదాని : ఫుమియో కిషిడ
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ – 2022 ను గెలుచుకున్న జపాన్ జట్టు
ఎవరు: జపాన్ జట్టు
ఎప్పుడు: జనవరి 29
NIPER పరిశోధన పోర్టల్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ;

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడినల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -NIPER పరిశోధన పోర్టల్ ను న్యూఢిల్లీలో రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గారు ప్రారంభించారు. మొత్తం ఏడు NIPER పరిశోధన కార్యకలాపాలు, పేటెంట్లు మరియు ప్రచురణలపై ఒక-స్టాప్ సమాచారాన్ని అందించడం దీని యొక్క లక్ష్యం.ఈ కార్యక్రమంలో రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ భూబా, ఆరోగ్య శాఖ సభ్యుడు, నీతి ఆయోగ్ డాక్టర్ వీకే పాల్ కూడా పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: NIPER పరిశోధన పోర్టల్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా
ఎవరు: కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: జనవరి 29
ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ గా ఊర్జిత్ పటేల్ నియామకం :

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పని చేసి ఉర్జిత్ పటేల్ గారికి కీలక పదవి దక్కింది. ఊర్జిత్ పటేల్ ను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించింది. ఏఐఐలీ వ్యవస్థాపక దేశాల్లో సభ్య దేశంగా భారత్ కూడా ఉంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్ లో ఉంది. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఊర్జిత్ పటేల్ ఈ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
- ఎఐఐబి యొక్క స్థాపన : 16 జనవరి 2016
- ఎఐఐబి యొక్క ప్రదాన కార్యాలయం : చైనా లోని బీజింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ గా ఊర్జిత్ పటేల్ నియామకం
ఎవరు: ఊర్జిత్ పటేల్
ఎప్పుడు: జనవరి 29
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కు కొత్త ఛైర్మన్ గా అరుణ్ కుమార్ పుర్వార్ నియామకం :

ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఫెయిర్ఫెక్స్ మరియు క్యాపిటల్ గ్రూప్ మద్దతు ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎస్బిఎఫ్సీ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎఐ) మాజీ ఛైర్మన్ అరుణ్ కుమార్ పుర్వార్ ను ఏప్రిల్ 1, 2022 నుండి దాని కొత్త ఛైర్మన్ గా నియమించారు. అరుణ్ కుమార్ పూర్వార్ (AK పుర్వార్), గతంలో 2002-2006 వరకు SBI చైర్మన్ గా పనిచేశారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యంలో మాస్టర్స్ డిగ్రీతో, అతను గతంలో వారి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెన్లో లెక్చరర్గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కు కొత్త ఛైర్మన్ గా అరుణ్ కుమార్ పుర్వార్ నియామకం
ఎవరు: అరుణ్ కుమార్ పుర్వార్
ఎప్పుడు: జనవరి 29
ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ నెదర్లాండ్స్ లో ప్రారంబం :

నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్ పోర్ట్ లో ని చిన్న ఓడరేవు నగరమైన ఇముడెన్ లో-ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ లాక్ ప్రారంభించబడింది. 500-మీటర్ల పొడవు మరియు 70-మీటర్ల వెడల్పు గల తూము నార్త్ సీ కెనాలు ఆమర్యామ్ నౌకాశ్రయానికి కలిపే చిన్నఓడరేవు నగరమైన ఇజ్మయిడెన్ లో దాదాపు 100 సంవత్సరాల పురాతనమైన తూము స్థానంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి $338 మిలియన్ల వరకు ఖర్చు చేశారు.
- నెదర్లాండ్ దేశ రాజధాని : అమ్ స్టర్ డాం
- నెదర్లాండ్ దేశ కరెన్సీ : యూరో
- నెదర్లాండ్ దేశ అద్యక్షుడు : మార్క్ రూట్
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ నెదర్లాండ్స్ లో ప్రారంబం
ఎవరు: నెదర్లాండ్స్ లో
ఎప్పుడు: జనవరి 30
భారత్ లోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ హర్యానాలో ప్రారంబం :

నేషనల్ హైవే ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ (NHEV) భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ను హర్యానాలోని గుర్గావ్ లోని సెక్టార్ 52లో ప్రారంభించింది. ఇందులో నాలుగు చక్రాల వాహనాల కోసం 100ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. స్టేషన్ Alektrify ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వ్యవస్థాపించబడింది మరియు వాటిద్వారా నిర్వహించబడుతుంది. 100 పాయింట్లలో, 72 యూనిట్లు ACస్లో ఛార్జర్లు కాగా, 24 యూనిట్లు DC ఫాస్ట్ ఛార్జర్లను కలిగి ఉంటాయి.
- హర్యానా రాష్ట్ర రాజధాని :చండీఘర్
- హర్యానా రాష్ట్ర సిఎం : మనోహర్ లాల్ ఖట్టార్
- హర్యానా రాష్ట్ర గవర్నర్ : బండారు దత్తాత్రేయ
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ లోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ హర్యానాలో ప్రారంబం
ఎక్కడ: హర్యానాలో
ఎప్పుడు: జనవరి 30
అతి శక్తి వంతమైన క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా దేశం :

అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీ లకు తూట్లు పొడుస్తూ ఉత్తర కొరియా మరోసారి అస్త్ర పరీక్షకు దిగింది. 2017 తర్వాత అత్యంత శక్తిమంత మైన క్షిపణిని ఈ దఫా ప్రయోగించింది. దీంతో ఆమె రికా, పొరుగు దేశాల నుంచి ప్రయోజనాలు రాబట్టేందుకు ఆస్త్ర ప్రయోగాలకు దిగే పాత వ్యూహానికి మళ్లీ తెరతీసినట్లయింది. అమెరికాతో సాగిస్తున్న దౌత్యంలో “దీర్ఘకాలంగా ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఈ చర్యకు ఉత్తర కొరియా పూనుకుంది. పొరుగు దేశం గగనతలం నుంచి ప్రయాణించే పరీ స్థితిని నివారించడానికి తాజా క్షిపణిని బాగా ఎత్తులోకి కేలా ఉత్తర కొరియా ప్రయోగించిందని జపాన్, దక్షిణ దక్షిణ కొరియా సైనికాధికారులు తెలిపారు. ఆ అస్త్రం గరిష్టంగా 2వేల కిలోమీటర్ల ఎత్తుకు చేరి, ఆ తర్వాత సముద్రంలో పడిందన్నారు. ప్రయోగించిన ప్రదేశం నుంచి అది 800 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ఇది మధ్యంతర శ్రేణి క్షిపణి అని వివరించారు. 2017లో చివరిసారిగా ఇలాంటి శక్తిమంతమైన ఆస్త్రాన్ని ఉత్తర కొరియా పరీక్షించింది.
- ఉత్తర కొరియా దేశ రాజధాని :ప్యాంగ్ యంగ్
- ఉత్తరకొరియా దేశ కరెన్సీ : నార్త్ కొరియన్ వాన్
- ఉత్తరకొరియా దేశ అద్యక్షుడు : కిం జోన్ ఉన్
క్విక్ రివ్యు :
ఏమిటి: అతి శక్తి వంతమైన క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా దేశం
ఎవరు: ఉత్తరకొరియా దేశం
ఎప్పుడు: జనవరి 30
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |