Daily Current Affairs in Telugu 29-08-2020
ఇజ్రాయెల్ పై బహిష్కరణ ను ఎత్తివేసిన యుఎఈ దేశం :

పశ్చిమ ఆసియా రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇజ్రాయెల్ తో దౌత్య సంబందాలు ఎర్పరుచుకుంటున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఈ) ప్రకటించింది.ఆ దేశాన్ని బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ యుఏఈ పాలకుడు షేక్ ఖలీఫా ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో రెండు దేశాల మద్య వర్తక వాణిజ్యాలు ప్రారంబం కానున్నాయి.దాదాపు సంవత్సరం నుంచి అమెరికా చొరవతో ఇజ్రాయెల్ యుఎఈ మద్య చర్చలు జరుగుతున్నాయి.వెస్ట్ బ్యాంకులో పాలస్తీనా భూబాగాలను కలుపుకునే ప్రణాళికను ఆపేస్తామని ఇజ్రయెల్ ప్రకటించడంతో ఆగస్ట్ 13 ఈ ఈరెండు దేశాల మద్య దౌత్య సంబందాల పునరుద్దరణకు చారిత్రక ఒప్పందం అందుకు అనుగుణంగానే ఇజ్రాయెల్ బహిష్కరణ ను ముగిస్తూ ఆగస్ట్ 29న షేక్ ఖలీఫా దిక్రి జారీ చేసారు. ఇక నుంచి ఇజ్రాయెల్ సంస్థలు యుఏఈ సంస్థలతో వ్యక్తులతో లావా దేవీలు జరపవచ్చు. రెండు దేశాల మద్య విమానాల రాక పోకలు కూడా ప్రారంబం కానున్నాయి.జోర్డాన్ తరువాత ఇజ్రాయెల్ తో దౌత్య సంబందాలు పునరిద్దరి౦చుకున్న మూడో అరబ్ దేశంగా యుఏఈ కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇజ్రాయెల్ పై బహిష్కరణ ను ఎత్తివేసిన యుఎఈ దేశం
ఎవరు: యుఎఈ దేశం
ఎక్కడ: ఇజ్రాయెల్ పై
ఎప్పుడు:ఆగస్ట్ 29
టీ20 క్రికెట్లో 500 వికెట్లు పడగొట్టిన 1 వ బౌలర్గా నిలిచిన డ్వేన్ బ్రావో:

వెస్టిండీస్ ఆల్ రౌండర్, డ్వేన్ జాన్ బ్రావో ట్వంటీ 20 మ్యాచ్ల్లో 500 వికెట్లు పడగొట్టిన క్రికెట్లో తొలి బౌలర్గా నిలిచాడు. అతను తన జట్టు ట్రిన్బాగో నైట్ రైడర్స్ మరియు సెయింట్ లూసియా జూక్స్ మధ్య జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సిపిఎల్) 2020 మ్యాచ్లో డ్వేన్ బ్రావో ఈ ఘనతను సాధించాడు. బ్రావో తన 500 వ వికెట్ నమోదు చేయడానికి రాహకీమ్ కార్న్వాల్ (18) వికెట్ తీసుకున్నాడు. డ్వేన్ బ్రావో తన 459 వ మ్యాచ్లో అతి తక్కువ సమయంలో ఈ పొట్టి ఫార్మాట్లో ఈ ఘనతను సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టీ20 క్రికెట్లో 500 వికెట్లు పడగొట్టిన 1 వ బౌలర్గా నిలిచిన డ్వేన్ బ్రావో
ఎవరు: డ్వేన్ బ్రావో
ఎక్కడ: వెస్టిండీస్ క్రికెటర్
ఎప్పుడు:ఆగస్ట్ 29
సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎ.ఆర్.లక్ష్మణన్ కన్నుమూత :

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్, ఎ.ఆర్. లక్ష్మణన్ ఇటీవల కన్నుమూశారు. అతను మార్చి 22, 1942 న తమిళనాడులోని శివగంగ జిల్లాలోని దేవకోట్టైలో జన్మించాడు. అతను డిసెంబర్ 20, 2002 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు మరియు మార్చి 22, 2007 న పదవీ విరమణ చేసాడు. ప్రస్తుతం అతను జస్టిస్ ఎ.ఎస్.అనంద్ నేతృత్వంలోని ముల్లై పెరియార్ ప్యానెల్లో తమిళనాడు సిట్టింగ్ ప్రతినిధిగా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎ.ఆర్.లక్ష్మణన్ కన్నుమూత
ఎవరు: ఎ.ఆర్.లక్ష్మణన్
ఎప్పుడు: ఆగస్ట్ 29
శ్రీలంక క్రికెటర్ తరంగ పరానవితన ఆటకు రిటైర్మెంట్ :

శ్రీలంక ఓపెనింగ్ బ్యాట్స్మన్ నిషాద్ తరంగ పరణవితన అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. 32 టెస్టు మ్యాచ్ల్లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన అతను రెండు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలతో సహా 1792 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 2009 లో పాకిస్థాన్పై అరంగేట్రం చేసిన పరణవితన, నవంబర్ 2012 లో జాతీయ జట్టు తరఫున తన చివరి ఆట ఆడాడు. అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 12,522 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన శ్రీలంక క్రికెటర్ గా నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: శ్రీలంక క్రికెటర్ తరంగ పరానవితన ఆటకు రిటైర్మెంట్
ఎవరు: తరంగ పరానవితన
ఎక్కడ: శ్రీలంక
ఎప్పుడు:ఆగస్ట్ 29
హాలివుడ్ హీరో చద్విక్ బోస్ మ్యాన్ కన్నుమూత :

మర్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్ గా పాపులారిటీ సంపాదించిన చద్విక్ బోస్ మ్యాన్ ఆగస్ట్ 27న మృతి చెందారు.కొంత కాలంగా ఆయన పేగు సంబంధిత క్యాన్సర్ తో బాధపడుతున్నారు.చద్విక్ వయసు కేవలం 43సంవత్సరాలు. 2016 లో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది.క్యాన్సర్ చికిత్స ,కీమో తెరఫి తీసుకుంటూనే బ్లాక్ పాంథర్ మార్షల్ ,దా 5బ్లడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో అయన నటించారు. 2003 లో నటుడుగా చద్విక్ తన కెరీర్ ను ప్రారంబిచారు. 2013 లో వచ్చిన 42 లో అయన చేసిన జాకీ రాబిన్ సన్ పాత్ర పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత ది కిల్ హోల్ ,డ్రాఫ్ట్ డే ,గెట్ ఆన్ ఆఫ్ గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ వంటి సినిమాలు చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హాలివుడ్ హీరో చద్విక్ బోస్ మ్యాన్ కన్నుమూత
ఎవరు: చద్విక్ బోస్ మ్యాన్
ఎప్పుడు: ఆగస్ట్ 29
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |