Daily Current Affairs in Telugu 28-09-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
ఏడు అవార్డులను సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో ఏడు అవార్డులను సొంతం చేసుకుందని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ తెలిపారు. టూరిజం ట్రావెల్ అసోసియేషన్ ఈ అవార్డులను ప్రకటించడమే కాక ఆంద్రప్రదేశ్ కు బెస్ట్ టూరిజం పాలసీగా ఏపీ పాలసీకి అవార్డు దక్కిందని తెలిపారు. అదేవిధంగా బెస్ట టూరిజం ప్లేస్ గా విశాఖపట్నం కు అవార్డు పొంతం చేసుకుందని పేర్కొన్నారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ; వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిశ్వా భూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏడు అవార్డులను సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ ‘ఆకాశ్ ప్రైమ్’ టెస్ట్ విజయవంతంగా ప్రయోగించిన భారత్ :

ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ ను సెప్టెంబర్ 27న సాయంత్రం విజయవంతంగా ప్రయోగించి పరీక్షించినట్లు డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) అధికారులు తెలిపారు. ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రయోగించిన నుంచి మొదటిసారిగా ప్రైమ్ క్షిపణి ఆకాశంలోని లక్ష్యాన్ని ఛేదించిందని తెలిపారు. ఆకాశ్ వ్యవస్థతో పోలిస్తే ఆకాశ్ ప్రైమ్ దేశీయంగా రూపొందించిన యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ లక్ష్యాన్ని మరింత కచ్చితత్వంతో తుత్తునియలు చేయవచ్చని వివరించారు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మరింత ఎత్తయిన ప్రదేశాల్లోని లక్ష్యాలను కూడా ఆకాశ్ ప్రైమ్ ఛేదిస్తుందన్నారు.
.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ ‘ఆకాశ్ ప్రైమ్’ టెస్ట్ విజయవంతంగా ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: ఓడిశా రాష్ట్రం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
నేషనల్ క్యాడెట్ కార్ప్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ బాధ్యతలు ;

నేషనల్ క్యాడెట్ కార్ప్ (ఎస్సిసి) కొత్త డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 16న మంత్రిత్వ శాఖ 15 మంది సభ్యుల కమిటీని నియమించింది, ఇందులో క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ మరియు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. ఎన్సిసిని సమగ్రంగా సమీక్షించి దాని మొత్తం పనితీరును మెరుగుపరిచే మార్గాలను సూచించారు. లెఫ్టినెంట్ జనరల్ సింగ్ 1987 లో ది పారాచూట్ రెజిమెంట్లో చేరారు. నాగాలాండ్ మరియు సియాచిన్ హి కమాండర్ గా కూడా పనిచేశారు.
- ఎం.సి.సి స్థాపన :1948 జులై 15
- ఎం.సి.సి ప్రధాన కార్యాలయం :న్యుడిల్లీ
క్విక్ రివ్యు :
ఏమిటి: నేషనల్ క్యాడెట్ కార్ప్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ బాధ్యతలు
ఎవరు: గుర్బీర్పాల్ సింగ్
ఎప్పుడు : సెప్టెంబర్ 28
గ్లోబాయిల్ ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2021′ అవార్డును అందుకున్న సంజయ్ ఘోడావత్ :

సంజయ్ ఘోడావత్ ‘గ్లోబాయిల్ ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2021 అనే’ అవార్డును అందుకున్నారు. సంజయ్ ఘోడావత్ ఫౌండేషన్ (SGF) అనే ద్వారా మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి సమయం లో ఉన్న లాక్ డౌన్ వల్ల నిర్వాసితులు అయిన వలవదారులకు గత రెండు సంవత్సరాలలో ఆదర్శప్రాయమైన సేవ చేసారు. దానికిగాను ఈ అవార్డు ఆయనకు ప్రకటించారు. ఆయన ఈ ఎస్.జి.ఎఫ్ అనే సంస్థ ద్వారా నిర్వాసితులకు 5 లక్షల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది. రోజుల తరబడి ఒంటరిగా ఉన్న చాలా మంది వలసదారులు ఆహార ప్యాకెట్లు, తాగునీరు మరియు ఇతర రోజువారీ నిత్యావసరాల రూపంలో అందించారు. నిపుణులైన వైద్యులు, ప్రాణాలను రక్షించే పరికరాలు మరియు వృత్తిపరమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో SGF పూర్తి స్థాయి కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని అతిగ్రే (కొల్హాపూర్) లో నడిపింది. ఈ కేంద్రంలో 27,500 మందికి పైగా రోగులు చికిత్స పొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: గ్లోబాయిల్ ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2021′ అవార్డును అందుకున్న సంజయ్ ఘోడావత్
ఎవరు: సంజయ్ ఘోడావత్
ఎప్పుడు :సెప్టెంబర్ 28
ప్రపంచ రేబిస్ డే గా సెప్టెంబర్ 28 :

ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28 న ప్రపంచ రేబిస్ డే గా జరుపుకుంటున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బే మందు అనే రోజులకు చెక్ పెట్టారు ప్రముఖ శాస్త్రవేత్త యిస్ పాశ్చర్. రెబీస్ కు వ్యతిరేకంగా మొదటిసారి టీకా ను కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్. ఈయనకు గుర్తుగానే ఈ రాబిస్ డేను నిర్వహిస్తారు. రెబీస్ కుక్కలు మనుషులకు కరిస్తే అది కుక్కల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ ను లిసా వైరస్ అని అంటారు. 2007 నుంచి ఏటా రేబిస్ దినం జరుపుతున్నారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాన గ్లోబల్ అలియాన్స్ ఫర్ రేబిస్ కంట్రోల్ అనే స్వచ్ఛంద సంస్థ .ఏటా ప్రపంచ రేబిస్ డే ను జరుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 59వేల మంది రేబిస్ వ్యాధి వల్ల చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నారు. ఈ మరణాల్లో 95 శాతం ఆసియా, ఆఫ్రికాలోనే జరుగుతున్నాయి. రేబిస్ కు టీకా వ్యాక్సిన్ కనిపెట్టని లూయిస్ పాశ్చర్ ప్రముఖ ఫ్రెంచ్ ఈ జీవశాస్త్రవేత్త. 1822 డిసెంబర్ 27న ఫ్రాన్స్ లోని డోల్ గ్రామంలో పుట్టి ఈయన పలు వ్యాధులకు కారణమవుతున్న సూక్ష్మజీవులను కనుగొని వారి ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు టీకాలు కనిపెట్టారు.ముఖ్యంగా కుక్కల నుంచి వ్యాపించే రేబిస్ వ్యాధికి టీకా వ్యాక్సిన్ కనుగొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ రేబిస్ డే గా సెప్టెంబర్ 28
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు : సెప్టెంబర్ 28
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |