Daily Current Affairs in Telugu 28-01-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ లో భాగంగా ఎయిర్టెల్ లో పెట్టుబడి పెట్టనున్న గూగుల్ :

గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ లో భాగంగా భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్టెల్ Google $1 బిలియన్ వరకు పెట్టుబడి పెట్టనుంది.పెట్టుబడిలో ఈక్విటీ పెట్టుబడి మరియు రాబోయే ఐదేళ్లలో సంభావ్య వాణిజ్య ఒప్పందాల కోసం కార్పస్ రెండూ ఉంటాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ లో భాగంగా ఎయిర్టెల్ లో పెట్టుబడి పెట్టనున్న గూగుల్
ఎవరు: గూగుల్
ఎప్పుడు: జనవరి 28
బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ను ప్రారంబించిన కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి :

కర్నాటక వైద్య విద్య మరియు ఆరోగ్య మంత్రి కె. సుధాకర్, బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ను వాస్తవంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) నేషనల్ ఇన్స్టిట్యూషన్ తో కలిసి దీనిని చేపట్టారు. భారతదేశ పరివర్తన కోసం (NITI ఆయోగ్). మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో వ్యక్తులకు సహాయం చేయడం ఈ ఈ చొరవ యొక్క లక్ష్యం.
- కర్ణాటక రాష్ట్ర రాజధాని : బెంగళూర్
- కర్ణాటక రాష్ట్ర సిఎం : బసవరాజ్ బొమ్మై
- కర్నాటక రాష్ట్ర గవర్నర్ : థావర్ చాంద్ గెహ్లాట్
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రెయిన్ హెల్త్ ఇ నిషియేటివ్ ను ప్రారంబించిన కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి
ఎవరు: ఆరోగ్య మంత్రి కె. సుధాకర్
ఎక్కడ: కర్ణాటక రాష్ట్ర౦
ఎప్పుడు: జనవరి 28
జింబాబ్వే మాజీ కెప్టెన్ ట్రెండన్ టేలర్ పైన మూడున్నరేళ్ల పాటు నిషేధం విధించిన ఐసిసి :

స్పాట్ ఫిక్సింగ్ కోసం ఓ భారత వ్యాపారి తనను సంప్రదించడం గురించి ఐసీసీకి సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ పై వేటుపడింది. టేలర్ పైన మూడున్నరేళ్ల పాటు ఐసీసీ నిషేధం విధించింది. డోప్ పరీక్షలో విఫలమైనందుకు ఒక నెల రోజులు సస్పెండ్ చేసింది. ‘ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడానికి బ్రెండన్ టేలర్ అంగీకరించాడు. ఎలాంటి క్రికెట్ ఆడకుండా. అతడిపై మూడున్నరేళ్ల పాటు నిషేదం పడింది. 2025 జులై 28న లో జింబాబ్వేలో టీ20 లీగ్ ప్రారంభించే అవకాశాలపై చర్చించడానికి 2019 అక్టోబరులో భారత్ కు వచ్చానవి. టేలర్ చెప్పిన సంగతి తెలిసిందే భారత వ్యాపారితో సమావేశం సమయంలో తెలివి తక్కువ తనంతో కొకైన్ తీసుకున్నానని దాన్ని అడ్డంపెట్టుకుని తనను బ్లాక్మెయిల్ చేశారని అతడు వివరించాడు స్పాట్ ఫిక్సింగ్ చేయడం కోసం తనకు 15000 డాలర్లు ఇచ్చినట్లు చెప్పాడు.
- జింబా౦బ్వే దేశ రాజధాని :హరారే
- జింబా౦బవే దేశ కరెన్సీ : యునైటెడ్ స్టేట్ డాలర్
- జింబా౦బ్వే అద్యక్షుడు :ఇమ్మర్సేన్ నాగాగ్వ
క్విక్ రివ్యు :
ఏమిటి: జింబాబ్వే మాజీ కెప్టెన్ ట్రెండన్ టేలర్ పైన మూడేళ్ళు నిషేధం విధించిన ఐసిసి
ఎవరు: ఐసిసి
ఎప్పుడు: జనవరి 28
ఫిఫా ప్రపంచకప్ కు ఆసియా నుంచి బెర్తు సాధించిన తొలి దేశం ఇరాన్ :

ఈ ఏడాది నవంబర్ లో ఖతార్ వేదికగా జరిగే ఫిఫా ప్రపంచకప్ కు ఇరాన్ దేశం అర్హత సాధించింది. ఆసియా క్వాలిఫికేషన్స్ మూడో, రౌండ్ గ్రూప్-ఏ మ్యాచ్ లో 1-0తో ఇరాక్ ను ఓడించిన ఇరాన్ 19 పాయింట్లతో (7 మ్యాచ్ లు, 6 విజయాలు, 1 డ్రా) గ్రూపులో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్ లు దక్కించుకుంది. 48వ నిమిషంలో టారెమి చేసిన గోల్ ఆ జట్టు విజయాన్ని అందుకుంది. ఆసియా నుంచి ఈసారి ప్రపంచ కప్ కు అర్హత సాధించిన తొలి జట్టు ఇరానే.
- ఇరాన్ దేశ రాజధాని :టెహ్రాన్
- ఇరాన్ దేశ కరెన్సీ : ఇరానియన్ రియల్
- ఇరాన్ దేశ అద్యక్షుడు : ఇబ్రహీం రైసి
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫిఫా ప్రపంచకప్ కు ఆసియా నుంచి బెర్తు సాధించిన తొలి దేశం ఇరాన్
ఎవరు: ఇరాన్
ఎప్పుడు: జనవరి 28
ఆసియాకప్ మహిళల హాకీ టోర్న మెంట్లో కాంస్యం సాధించిన భారత జట్టు :

ఆసియాకప్ మహిళల హాకీ టోర్న మెంట్ లో ఫేవరెట్ గా బరిలో దిగి టైటిల్ సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జట్టు కాంస్యంతో సంతృప్తి చెందింది. మరోవైపు టైటిల్ ను జపాన్ కైవసం చేసుకుంది. ఫైనల్ లో ఆ జట్టు 4-2తో కొరియాను ఓడించింది. జనవరి 28న మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్ 2-0 గోల్స్ తో చైనాను ఓడించింది. ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. వరుస అవకాశాలను సృష్టించుకుంది. 13వ నిమిషంలో షర్మిలాదేవి చేసిన గోల్ తో ఆధిక్యంలోకి వెళ్లిన మన జట్టు ఆ తర్వాత గుర్జీత్ కొట్టిన పెనాల్టీ కార్నర్ గోల్ ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. వెంటనే చైనా కూడా ఓ పెనాల్టీ కార్నర్ను దక్కించుకున్నా గోల్ కీపర్ సవిత ప్రత్యర్థి గోల్ ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఒక వైపు దాడుల నుంచి కాపాడుకుంటూనే చైనా పై ఒత్తిడిని పెంచిన భారత్ ఆఖరి. దాకా ఆదే కోరు ప్రదర్శించి విజయాన్ని సొంతం. చేసుకుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియాకప్ మహిళల హాకీ టోర్న మెంట్లో కాంస్యం సాధించిన భారత జట్టు
ఎవరు: భారత జట్టు
ఎప్పుడు: జనవరి 28
కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా వి.అనంత నాగేశ్వరన్ నియామకం :

కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) గా వీ అనంత నాగేశ్వరన్ గారు నియమితులయ్యారు. ఈయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (సీఎంఈఏసీ) మాజీ సభ్యుడు గా ఉన్నారు.కాగా ఈ నెల 31 నుంచి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ లో ఆర్థిక సర్వే, వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించడానికి కొద్ది రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆర్థిక సలహాదారును నియమించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. గతేడాది డిసెంబర్ 17న కేవీ సుబ్రమణ్యం వైదొలిగినప్పటి నుంచి సీఈఏ పదవి ఖాళీగా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా వి.అనంత నాగేశ్వరన్ నియామకం
ఎవరు: వి.అనంత నాగేశ్వరన్
ఎక్కడ: డిల్లీ
ఎప్పుడు: జనవరి 28
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |