
Daily Current Affairs in Telugu 28-01-2020
అమెరికా లో భారత రాయబారిగా తరన్ జీత్ నియామకం :

అమెరికాలో భారత రాయబారిగా సీనియర్ అధికారి తరన్ జీత్ సింగ్ సందు నియమితులయ్యారు.ఇప్పుడు అమెరికాలో భారత రాయబారి గా ఉన్న హరశావర్దన్ శ్రింగ్లా విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా నియమితులయైన నేపద్యంలో ఆ స్థానంలో సందు బాద్యతలు చేపడతారు.సందు ప్రస్తుతం శ్రీలంక లో భారత హై కమిషనర్ గా ఉన్నారు
క్విక్ రివ్యూ :
ఏమిటి: అమెరికా లో భారత రాయబారిగా తరన్ జీత్ నియామకం
ఎక్కడ:డిల్లి
ఎవరు: తరన్ జీత్ సింగ్ సందు
ఎప్పుడు:జనవరి 28
పవన్ సుక్ దేవ్ కు టేలర్ పురస్కారం :

ప్రఖ్యాత భారత పర్యావరణ ఆర్ధిక వేత్త,ఐరాస పర్యావరణ కార్య క్రమం సౌహార్త రాయబారి పవన్ సుఖ్ దేవ్ (59)కు ప్రతిష్టాత్మక టేలర్ పురస్కారం లబించింది.పర్యావరణ రంగంలో నోబెల్ గా పరిగణించే ఈ పురస్కారానికి 2020 సంవత్సరానికి గాను ఆయనను ఎంపిక చేశారు.హరిత ఆర్ధిక వ్యవస్థ దిశగా ఆయన చేసిన అసమాన కృషి కి ఈ పురస్కారం లబించింది.ఆయన ఈ పురస్కారానికి ప్రఖ్యాత బయాలజీ గ్రేషణ్ డైలీతో కలిసి పంచుకుంటారు.
.
క్విక్ రివ్యూ :
ఏమిటి: పవన్ సుక్ దేవ్ కు టేలర్ పురస్కారం
ఎవరు: పవన్ సుక్ దేవ్
ఎప్పుడు:జనవరి 28
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
సూర్యుడి ద్రువాల పై పరిశీలనంకు తొలి వ్యోమనౌక ప్రయోగం :

సూర్యుడి ఉత్తర ,దక్షిణ ద్రువలను తొలిసారిగా చిత్రీకరించేందుకు అమెరికా ,ఐరోపా అంతరిక్ష సంస్థలు సంయుక్తమగా “సోలార్ ఆర్బిటర్ అనర్ వ్యోమ నౌక” ను ప్రయోగించనున్నాయి.ఫెబ్రవరి 07న దీన్ని ప్రయోగించ నున్నట్లు అమెరికా రోదసి సంస్థ నాసా ఒక ప్రకటనలో పేర్కొంది.సూర్యుడిని మద్యరేఖా ప్రాంతానికి సమాంతరంగా విస్తరించి ఉన్న ప్రదేశాన్ని ఎక్లిప్తిక్ ప్లేన్ గా పేర్కొంటారు.గ్రహాలన్నీ ఇందులోనే పరిబ్రమిస్తున్నాయి.సూర్యుడి వద్దకు ఇపటి వరకు ప్రయోగించిన వ్యోమ నౌకలను ఈ ఎక్లిప్తిక్ ప్లేన్ లో నో దానికి మాత్రం దాన్ని దాటి వెళుతుంది.ఇందుకోసం శుక్రుదు,భూమి గురుత్వకార్షణ శక్తిని ఉపయోగించుకుంటుంది.పలితంగా ఎగువ నుంచి సూర్యుడిని పరిశీలించవచ్చని రసెల్ హోవర్ద్ద్ అనే శాస్త్ర వేత్త పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: సూర్యుడి ద్రువాల పై పరిశీలనంకు తొలి వ్యోమనౌక ప్రయోగం
ఎక్కడ:వాషింగ్టన్
ఎప్పుడు:జనవరి 28
ఎపి హెచ్ డి సి బోర్డు చైర్మన్గా మురళి నియామకం :

ఆంద్రప్రదేశ్ హస్తకళల అబివృద్ది సంస్థ (ఏపి హెచ్ డిసి)బోర్డు చైర్మన్ గా పరిశ్రమలు ,వాణిజ్య శాఖ కార్యదర్శి మురళిని ప్రబుత్వం నియమించింది.డైరెక్టర్ గా ఎండి హిమాంశుశుక్లా ఆర్ధిక శాఖ డిప్యుటీ కార్యదర్శి రమాదేవి,హస్తకళ ల దక్షిణ ప్రాంత డిప్యుటీ డైరెక్టర్ ప్రభాకరన్ ,పరిశ్రమలు శాఖ సంయక్త సంచాలకులు ఇందిరా దేవి లని నియమిస్తూ జనవరి 28న ఉతార్వులు జరీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఎపి హెచ్ డి సి బోర్డు చైర్మన్గా మురళి నియామకం
ఎక్కడ:ఆంద్ర ప్రదేశ్
ఎవరు: మురళి
ఎప్పుడు:జనవరి 28
కందూ తీరంలో ఆదిమ మానవుల ఆనవాళ్ళు గుర్తింపు :

కందూ నది తీరంలో ఆదిమ మానవుడి ఆనవాళ్ళను గుర్తించారు.మూడు యుగాల మద్య సంఘమంగా వారు గీసిన రేఖా చిత్రం శిలా యుగం నాటివిగా గుర్తించారు.యోగి వేమన విశ్వ విద్యాలయం పురా వస్తు శాఖ ఆచార్యులు వి.రామ బ్రహ్మం ,పరిశోదకులుగా విద్యార్థులు సి.శివకుమారు,జే.నారాయణ,పి.నగేష్,అకడమిక్ కన్సల్టెంట్ యాదవ రఘుల బృందం తాము పరిశోధించిన వివరాలను వెల్లడించారు.కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో బోగేశ్వర ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ అనవాల్ల్లను గుర్తించారు.ఇక్కడి రేఖ చిత్రాలు ఎరుపు ,తెలుపు ,పసుపు రంగుల్లో ఉన్నాయి.వీటిలో ఎరుపు చిత్రాలు మద్య శీలా యుగం ,తెలుపు బృహత్ శిలా యుగం ,పసుపు చారిత్రిక యుగాల నాటివని గతంలో ఈ యుగాలకు సంబంధించిన రాతి పని ముట్లు గుర్తించారు అని రేఖా చిత్రాలు బయట పడడం ఇదే తొలి సారని రామ బ్రహ్మం వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: కందూ తీరంలో ఆదిమ మానవుల ఆనవాళ్ళు గుర్తింపు
ఎక్కడ:ఆంద్రప్రదేశ్
ఎప్పుడు:జనవరి 28