
Daily Current Affairs in Telugu 23-09-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సుస్తిర అబివృద్ది లక్ష్యాల (SDG) యొక్క న్యాయ వాదిగా కైలాష్ సత్యర్ది నియామకం :

నోబెల్ శాంతి అవార్డును గెలుచుకున్న భారతియుడు కైలాష్ సత్యార్ది ని యు.ఎన్ సెక్రటరి జనరల్ ఆంటోనియో గుటేరాస్ 76 వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సుస్తిర అబివృద్ది లక్ష్యాల (SDG) యొక్క న్యాయవాదిగాఈయన నియమితులయ్యారు. యు.ఎన్ సెక్రటరి జనరల్ అంటోనియో గుటెరాస్ నూతన ఎస్.డి.జి అడ్వకేట్ లుగా కైలాష్ సత్యర్ది ని, STEM కార్యకర్త అయిన వాలింటినా మునోజ్ రాబనల్ ,మైక్రో సాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ మరియు పాప్ సూపర్ స్టార్స్ బ్లాక్ పింక్ ను నియమించారు. దీనీతో పాటు యు.ఎన్ ఇప్పటి వరకు పదహరు మంది న్యాయవాదులను కలిగి ఉంది. ఈ SDG న్యాయవాదులు నూతన నియోజక వర్గాలను చేరుకోవడానికి మరియు ప్రజలకు వారి యొక్క వాగ్దనాల ను నిలబెట్టుకోవడానికి తమ ప్రభావాన్ని ఉపయోగిస్తారు.
- ఐక్యరాజ్య సమితి స్థాపన : 1945 అక్టోబర్ 24
- ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం : న్యూయార్క్
- ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరి జనరల్ : అంటోనియో గుటెరస్
- ఐక్యరాజ్య సమితిలోని సబ్యుల సంఖ్య : 193
- ఐక్యరాజ్య సమితిలోనికి చివరగా చేరిన సబ్యుల సంఖ్య: దక్షిణ సుడాన్
క్విక్ రివ్యు :
ఏమిటి: యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సుస్తిర అబివృద్ది లక్ష్యాల (SDG) యొక్క న్యాయవాదిగా కైలాష్ సత్యర్ది నియామకం
ఎవరు: కైలాష్ స త్యార్ది
ఎక్కడ: న్యూయార్క్
ఎప్పుడు: సెప్టెంబర్ 23
వైఎస్పార్ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ కు దక్కిన జీవితకాల సాఫల్య పురస్కారం-2021 :

భారత ఉద్యాన సంఘాల సమాఖ్య ఉద్యాన రంగంలో నిష్ణాతులైన సీనియర్ శాస్త్రవేత్తలకు ఇచ్చే జీవితకాల సాఫల్య పురస్కారం-2021ని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి.గూడెం సమీపంలోని వెంకట్రామన్నగూడెం వైఎస్పార్ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ తోలేటి జానకిరాం గారికి అందజేశారు. హైదరాబాద్లో సెప్టెంబర్ 23న జరిగిన కార్యక్రమంలో భారత ఉద్యాన సంఘాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ హెచ్.పి సింగ్ చేతుల మీదుగా జానకీరామ్ ఈ అవార్డు ను అందుకున్నారు. 26 ఏళ్లపాటు ఉద్యాన రంగంలో ప్రధానంగా పుష్పశాస్త్రంలో జానకీరామ్ విశేష కృషి చేశారు. 41 నూతన రకాల పుష్పాలను రూపొందించి రైతులకు అందజేశారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి సహాయ డైరెక్టర్గా పనిచేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పురస్కారాలు, ఫెలోషిప్ లు అందుకున్నారు. 90కి పైగా పరిశోధన పత్రాలు, 27 పుస్తకాలు రచించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వైఎస్పార్ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ కు దక్కిన జీవితకాల సాఫల్య పురస్కారం-2021
ఎవరు: తోలేటి జాన
ఎప్పుడు: సెప్టెంబర్ 23
ఎన్ఎస్ఎస్ నేతృత్వ అవార్డు గెలుచుకున్న ఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం :

డాక్టర్ ఎన్.టి.ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగానికి ఎన్ఎస్ఎస్ నేతృత్వ అవార్డు లభించింది. ముంబయికి చెందిన క్రిష ఫౌండేషన్ ఎన్ఎస్ఎ.ఎస్ ఫౌండేషన్ డేను పురస్కరించుకుని దేశంలోని విశ్వ విద్యాలయాల్లో విస్తృత సేవలు అందిస్తున్న ఎన్ఎస్ఎస్ విభాగాలకు అవార్డులను ప్రకటించింది. శుక్రవారం ‘వర్చువల్గా నిర్వహించే కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగానికి ఎన్ఎస్ఎస్ నేతృత్వ అవార్డును అందజేయనున్నారు. ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కోవిడ్ సమయంలో విస్తృత సేవలు, లైఫ్ సేవింగ్ విధానాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు గాను ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎన్ఎస్ఎస్ నేతృత్వ అవార్డు గెలుచుకున్న ఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం
ఎవరు: ఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం
ఎప్పుడు: సెప్టెంబర్ 23
UN స్పాన్సర్డ్ సస్టైనబుల్ డెలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ (SDSN) ‘SDG ప్రోగ్రెస్ అవార్డు’గెలుచుకున్న షేక్ హసీనా :

ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో బంగ్లాదేశ్ యొక్క స్థిరమైన పురోగతి కోస౦ కృషి చేసిన బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు UN స్పాన్సర్డ్ సస్టైనబుల్ డెలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ (SDSN) ‘SDG ప్రోగ్రెస్ అవార్డు’ ప్రదానం చేసింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎకె అబ్దుల్ మోమెన్ న్యూయార్క్ లో జరిగిన మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ ప్రధాని ఈ అవార్డును బంగ్లాదేశ్ ప్రజలకు అంకితం చేసినట్లు తెలియజేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రసుతం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) 76 వ సెషన్ లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనలో ఉన్నారు. యు.ఎన్ ప్రాయోజిత సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ (SDSN) ను యు.ఎన్ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్థికవేత్త మరియు అభివృద్ధి వ్యూహకర్త ప్రొఫెసర్ జెఫ్రీ డి సాచ్స్ 2012 లో ఎంపిక అయ్యారు.
- బంగ్లాదేశ్ దేశ రాజధాని : దాకా
- బంగ్లాదేశ్ దేశ అద్యక్షుడు : అబ్దుల్ హమీద్
- బంగ్లాదేశ్దేశ ప్రధాన మంత్రి : షేక్ హసీనా
క్విక్ రివ్యు :
ఏమిటి: UN స్పాన్సర్డ్ సస్టైనబుల్ డెలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ (SDSN) ‘SDG ప్రోగ్రెస్ అవార్డు’గెలుచుకున్న షేక్ హసీనా
ఎవరు: షేక్ హసీనా
ఎక్కడ: బంగ్లాదేశ్
ఎప్పుడు: సెప్టెంబర్ 23
ఢిల్లీ యూనివర్సిటీ కొత్త వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ నియామకం :

ఢిల్లీ యూనివర్సిటీ (డియు) నూతన వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ యోగేష్ సింగ్ నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ప్రొఫెసర్ నీలిమా గుప్తా మధ్యప్రదేశ్ లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయ విసిగా నియమితులయ్యారు. యోగేష్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU ప్రొఫెసర్ యోగేష్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU)కి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు.విసిగా నియమితులైన సింగ్ గతంలో ఢిల్లీ (2014-2017) నేతాజీ సుభాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ గా మరియు గుజరాత్ మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (2011-2014) లో ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఢిల్లీ యూనివర్సిటీ కొత్త వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ నియామకం
ఎవరు: ప్రొఫెసర్ యోగేష్ సింగ్
ఎక్కడ: డిల్లి యునివర్సిటీ
ఎప్పుడు: సెప్టెంబర్ 23
బ్రిటన్ కు చెందిన (క్యూఎస్) సంస్థ 2022 ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్న భారత్ కు చెందిన 12 విద్యా సంస్థలు :

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల విద్యా ప్రమాణాలను విశ్లేషించి ర్యాంక్ లను ప్రకటించే బ్రిటన్ కు చెందిన క్వాక్వరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) సంస్థ 2022 ఏడాదికి ప్రకటించింది. క్యూఎస్ గ్రాడ్యయేట్ ర్యాంక్లను ప్రకటించింది. క్యు.ఎస్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటి ర్యాంక్ ల టాప్ -500 జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్)-బెంగళూరు సహా ఆరు ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు స్థానం దక్కించుకున్నాయి. టాప్-500లో మొత్తం 12 భారతీయ ఉన్నత విద్యా సంస్థలు ఇందులో చోటు సంపాదించాయి. భారతీయ సంస్థల్లో ఐఐటీ బాంబే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సెంట్రల్ వర్సిటీలైన ఢిల్లీ విశ్వవిద్యాలయం, ముంబై యూనివర్సిటీ, కలకత్తా విశ్వవిద్యాలయం సైతం జాబితాలో ఉన్నాయి. జిందాల్ యూనివర్సిటీ(సోనిపట్), బిట్స్(పిలానీ) ప్రైవేట్ విశ్వవిద్యాలయాలూ చోటు సాధించి తమ సత్తా చాటాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రిటన్ కు చెందిన (క్యూఎస్) సంస్థ 2022 ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్న భారత్ కు చెందిన 12 విద్యా సంస్థలు
ఎవరు: క్వాక్వరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) సంస్థ
ఎప్పుడు: సెప్టెంబర్ 23
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |