
Daily Current Affairs in Telugu 21-08-2020
గ్లోబల్ జీన్ సంస్థ కు దక్కిన రాడెన్ బేరి పురస్కారం :

భారత్,బ్రిటన్ దేశాల కేంద్రంగా పని చేసే జీనోమిక్స్ బయోటెక్ సంస్థ గ్లోబల్ జీన్ కార్ప్ సహా ప్రపంచ వ్యాప్తంగా నాలుగు ప్రాజెక్టులకు రాడెన్ బేరి పురస్కారం లబించింది. విజేతలకు రెండున్నర లక్షల డాలర్ల చొప్పున ప్రైజ్ మని అందుతాయి. సైన్స్ కాల్పనిక టీవి ధారావాహిక స్టార్ ట్రెక్ సృష్టి కర్త అయిన జీన్ రాడేన్ బేరి యొక్క దార్శనికతకు అనుగుణంగా ఈ బహుమతి ని ఇస్తున్నారు.కరోనా మహమ్మారి అరంబమైన తొలి రోజులలో స్థాపించారు. కోవిద్ పై పోరు కోసం నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలకు ఈ అవార్డును అందిస్తారు.సైన్స్ విభాగంలో గ్లోబల్ జీన్ కు ఈ అవార్డ్ దక్కింది.ముంబై ,కేంబ్రిడ్జ్ కేంద్రంగా ఈ సంస్థ పని చేస్తుంది.ప్రపంచం లో జన్యు వైవిధ్యాన్ని నిర్దిష్టంగా మ్యాప్ చేయడం ద్వారా ఆరోగ్య పరిరక్షణకు ఆ రంగానికి సేవలు చేస్తుందని అవార్డు కమిటీ పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఎవరు: గ్లోబల్ జీన్ సంస్థ
ఏమిటి: గ్లోబల్ జీన్ సంస్థ కు దక్కిన రాడెన్ బేరి పురస్కారం
ఎప్పుడు: ఆగస్ట్ 21
పెరూ దేశ యొక్క కొత్త ప్రదనిగా నియమితులయిన వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిజ్ :

పెరూ దేశ మాజీ రక్షణ మంత్రి, రిటైర్డ్ ఆర్మీ జనరల్ వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిజ్ పెరూ దేశ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన నియామకాన్ని పెరూ అధ్యక్షుడు మార్టిన్ విజ్కారా ధృవీకరించారు. రూయిజ్ పెడ్రో అల్వారో కాటెరియానో బెల్లిడో తరువాత విజయం ఈయన సాదించాడు . ప్రదాని పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం లిమాలోని ప్రభుత్వ ప్యాలెస్లో జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: పెరూ దేశ యొక్క కొత్త ప్రదనిగా నియమితులయిన వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిజ్
ఎవరు: వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిజ్
ఎక్కడ: పెరూ
ఎప్పుడు: ఆగస్ట్ 21
ఆత్మ నిర్భర్ భారత్ చొరవను పెంచడానికి 101 రక్షణ వస్తువుల దిగుమతిని నిషేధించించిన కేంద్ర్ర ప్రభుత్వం :

రక్షణ మంత్రిత్వ శాఖకు దిగుమతి చేసుకునే 100 కు పైగా వస్తువుల జాబితాను ప్రకటించింది, వాటికి వ్యతిరేకంగా సూచించిన సమయానికి మించి దిగుమతిని నిషేధించబడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిభర్ భారత్ అభియాన్ ”(సెల్ఫ్ రిలయంట్ ఇండియా మూవ్మెంట్) కు నెట్టడానికి దిగుమతిపై ఆంక్షలు విధించే 101 వస్తువుల యొక్క జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. వచ్చే ఆరు నుంచి ఏడు సంవత్సరాలలో దేశీయ పరిశ్రమపై దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఉంటాయని అంచనా వేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆత్మ నిర్భర్ భారత్ చొరవను పెంచడానికి 101 రక్షణ వస్తువుల దిగుమతిని నిషేధించించిన కేంద్ర్ర ప్రభుత్వం
ఎవరు: కేంద్ర్ర ప్రభుత్వం
ఎక్కడ:న్యు డిల్లి
ఎప్పుడు:ఆగష్ట్ 21
భారత మాజీ క్రికెటర్ గోపాలస్వామి కస్తూరిరంగన్ కన్నుమూత:

మాజీ క్రికెటర్, అడ్మినిస్ట్రేటర్ మరియు పిచ్ క్యూరేటర్,గా ఉన్న గోపాలస్వామి అయ్యంగార్ కస్తూరిరంగన్ గారు కన్నుమూశారు. అతను 1930 అక్టోబర్ 12 న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. అతను రంజీ ట్రోఫీలో మైసూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 1948-49 సీజన్లో తన కెరీర్ ను ప్రారంభించాడు మరియు 1962-63 సీజన్ తరువాత ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. గోపాలస్వామి కస్తూరిరంగన్ 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ మైసూర్ రంజీ టీమ్ (ఇప్పుడు కర్ణాటక) కు ప్రాతినిత్యం వహించారు..
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత మాజీ క్రికెటర్ గోపాలస్వామి కస్తూరిరంగన్ కన్నుమూత
ఎప్పుడు: ఆగస్ట్ 21
స్వచ్చ ర్యాంకుల్లో నాలుగో సారి మొదటి స్థానం లో నిలిచిన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం :

కేంద్ర పట్టనాబివ్రుద్ది శాఖా ప్రకటించిన ఐదవ విడత స్వచ్చ ర్యాంకుల్లో లక్షకు పైబడిన జనాభా ఉన్న వంద నగరాల్లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం వరుసగా నాలుగో సారి తొలి ర్యాంక్ ను సాధించింది.ఆగస్ట్ 20 కేంద్ర పట్టనబివ్రుద్ది మంత్రి హరదీప్ సింగ్ వెల్లడించిన 2020 స్వచ్చసర్వేక్షన్ పలితాల్లో గుజరాత్ లోని సూరత్ రెండవ ,నవి ముంబై మూడవ స్థానం లో నిలిచాయి.లాక్ష లోపు జనాభా నగరాల్లో మొదటి మూడవ మూడు ర్యాంకులను మహారాష్ట్ర లొని కరాడ్ సస్వాద్ ,లోనవలా దక్కి౦చుకున్నాయి. పరిశుబ్రత గంగా నగరంగా ప్రదాని మోది ప్రతినిత్యం వహిస్తున్న వారణాసి నిలిచింది.నలబై లక్షల జనాభా ఉన్న నగరాల్లో శుబ్రమైన నగరంగా అహ్మదాబాద్ నిలిచింది.ఈ కేటగిరీలో బెస్ట్ స్వయం సమృద్ది నగర గౌరవం బెంగళూర్ కు దక్కింది.స్వచ్చ సర్వేక్షన్ మొదలైన 2016 లో కేవలం 73 స్థానిక సంస్థలు పాల్గొనగా ఈ ఏడాది 4,242 నగరాలు ,62 కంటోన్మెంట్ బోర్డులు ,92 గంగా పరివాహక ప్రాంత పట్టణాలు పోటీ లో పాల్గొన్నాయి.ఇందులో బాగంగా ఈ ర్యాంకుల్లో వంద నగరాలలో హైదరాబాద్ కు 65 వ ర్యాంకు దక్కింది.గత ఏడాది 35వ స్థానంలో నిలిచిన మహా నగరం ఈ సారి ముప్పై ర్యాంకులు కోల్పోయింది.పది లక్షల జనాభా పైబడిన నగరాల ర్యాంకులో మాత్రం 23 వ స్థానం లో నిలిచింది.ఆంద్ర ప్రదేశ్ నుండి విజయవాడకు 6 వ ర్యాంకు తిరుపతి కి 12 ర్యాంకు లో నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్వచ్చ ర్యాంకుల్లో నాలుగో సారి మొదటి స్థానం లో నిలిచిన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం
ఎవరు : మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం
ఎక్కడ: మధ్యప్రదేశ్
ఎప్పుడు: ఆగస్ట్ 21
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |