
Daily Current Affairs in Telugu 18 May-2022
గ్రీన్ ఎయిర్ పోర్ట్ గుర్తింపును పొందిన హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ :

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో శంషాబాద్ లోని రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం ఆర్.జి.ఐ.ఎ మరో సారి గ్రీన్ ఎయిర్ పోర్ట్ గుర్తింపు ను పొందింది ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్ నేషనల్ ఎసిఐ గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ రికగ్నిషన్ 2022 కార్యక్రమంలో సిల్వర్ అవార్డును అందుకున్నట్లు జి.ఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రతినిధులు తెలిపారు.కాగా ఆసియా ఫసిఫిక్ రీజియన్ లో వార్షిక ప్రయాణికుల విభాగంలో ఆర్.జి.ఐ.ఎ ఈ అవార్డులు దక్కుతుండగా వరుసగా ఇది ఐదో సారి కావడం విశేషం. పర్యావరణాన్ని దెబ్బతీసేలా విమానయాన పరిశ్రమ ప్రభావం ఉండకుండా అత్యుత్తమ పర్యావరణ రహిత కార్యక్రమాలను ప్రోత్సహించేలా గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ రికగ్నిషన్ కార్యక్రమాన్ని ఎ.సి.ఐ నిర్వహిస్తున్న౦దుకు గాను ఏటా ఈ అవార్డులు ను అందిస్తుంది.
- శంషా బాద్ ఎయిర్ పోర్ట్ గల రాష్ట్రము :తెలంగాణా
- తెలంగాణా రాష్ట్ర రాజాదాని : హైదరబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం :కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి: గ్రీన్ ఎయిర్ పోర్ట్ గుర్తింపును పొందిన హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ :
ఎవరు: శంషాబాద్ ఎయిర్ పోర్ట్
ఎక్కడ: హైదరబాద్
ఎప్పుడు : మే 18
అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డి.ఆర్.డి.వో :

శత్రు దేశాల యుద్ధనౌకలను తుత్తునియలు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) మే 18న ప్రకటించింది. ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో సముద్ర తీర ప్రాంతంలో ఈ ప్రయోగం జరిగింది. భారత నావికా దళం. డీఆర్డీవో సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారికావడం గమనార్హం. నావికాదళ హెలికాప్టర్ ద్వారా ప్రయోగించిన ఈ కొత్త యాంటీ-షిప్ మిస్సైల్ అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్ అవసరాల కోసం దేశీయంగా తయారుచేసిన మిస్సైల్ లాంచర్ ను ఈ క్షిపణిలో వినియోగించారు. క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు సంబంధిత శాస్త్రవేత్త లను డీఆర్డీవో చైర్మన్ జి.సతీష్ రెడ్డి అభినందించారు.
- డి.ఆర్.డి.వో పూర్తి రూపం : డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్
- డి.ఆర్.డి.వో సంస్థ స్థాపన : 1958
- డి.ఆర్.డి.వో ప్రధాన కార్యాలయం : డిల్లీ
- డి.ఆర్.డి .వో ప్రస్తుత చైర్మన్ : డాక్టర్ జి సతీష్ రెడ్డి
క్విక్ రివ్యు :
ఏమిటి: అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డి.ఆర్.డి.వో
ఎవరు: డి.ఆర్.డి.వో
ఎప్పుడు : మే 18
డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ పదవి కి రాజీనామా :

దేశ రాజధాని కేంద్ర. రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి. రామ్నాథ్ కోవింద్ కు రాజీనామా లేఖ పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారడాల వల్లే బైజల్ పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన బైజల్ 2016 డిసెంబరులో ఢిల్లీ ఎల్బీగా బాధ్యతలు చేప రు. దాదాపు ‘అయిదేళ్ల తన పదవీకాలంలో పరి పాలనపరమైన అధికార పరిధి, ప్రభుత్వ వ్యవహారాలలో తరచు విభేదాలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారం 9918లో ఎన్టీ కార్యా లయం ఎదుట ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రి వాల్, మంత్రులు ధర్నా చేసేదాకా వెళ్లింది.
- డిల్లి ముఖ్యమంత్రి ; అరవింద్ కేజ్రివాల్
క్విక్ రివ్యు :
ఏమిటి: డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ పదవి కి రాజీనామా
ఎవరు: అనిల్ బైజల్
ఎక్కడ: డిల్లి లో
ఎప్పుడు : మే 18
నేపాల్లో తదుపరి రాయబారిగా నియమితులైన నవీన్ శ్రీవాస్తవ :

ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న నవీన్ శ్రీవాస్తవ గారు నేపాల్ లో తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. ఇటీవల విదేశాంగ కార్యదర్శిగా వచ్చిన వినయ్ క్వాత్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)పై సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి చైనాతో దౌత్య మరియు సైనిక చర్చలలో అతను కీలక పాత్ర పోషించాడు.
- నేపాల్ దేశ రాజధాని : ఖాట్మండు
- నేపాల్ దేశ కరెన్సీ : నేపలియన్ రూపీ
- నేపాల్ దేశ అద్యక్షుడు : బిడ్యా దేవి బండారి
- నేపాల్ దేశ ప్రధాని :షేర్ బహదూర్ దేబా
క్విక్ రివ్యు :
ఏమిటి: నేపాల్ తదుపరి రాయబారిగా నియమితులైన నవీన్ శ్రీవాస్తవ :
ఎవరు: నవీన్ శ్రీవాస్తవ
ఎక్కడ: నేపాల్ దేశంలో
ఎప్పుడు : మే 18
లోక్ మిల్నీ అనే పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ను ప్రారంబించిన పంజాబ్ సిఎం భగవత్ మాన్ :

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రజల మనోవేదనలను వినడానికి మరియు వారి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం కోసం లోక్ మిల్నీ అనే పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ను మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి సింగిల్ విండో ప్లాట్ఫారమ్ను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో, లోక్ మిల్నీ కార్యక్రమానికి ‘జన్తా దర్బార్’ అని పేరు పెట్టారు.
- పంజాబ్ రాష్ట్ర రాజధాని :చ్న్దీఘర్
- పంజాబ్ రాష్ట్ర సిఎం :భగవత్ మాన్
- పంజాబ్ రాష్ట్ర గవర్నర్ : బన్వర్ లాల్ పురోహిత్
- పంజాబ్ రాష్ట్ర౦ పంచ నదులకు స్థానం గా ప్రసిద్ది
క్విక్ రివ్యు :
ఏమిటి: లోక్ మిల్నీ అనే పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ను ప్రారంబించిన పంజాబ్ సిఎం భగవత్ మాన్ :
ఎవరు: పంజాబ్ సిఎం భగవత్ మాన్
ఎక్కడ: పంజాబ్
ఎప్పుడు : మే 18
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |