
Daily Current Affairs in Telugu 15-04-2020
దేఖో అప్నా దేశ్ అనే వెబ్ సిరీస్ ను ప్రారంభించిన పర్యాటక మంత్రిత్వ శాఖ:

భారత పర్యటక మంత్రిత్వ శాఖ “#దేఖో అప్నా దేశ్” అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ ను ప్రారంభించింది. ఇక్రిడిబుల్ ఇండియా యొక్క అనేక గమ్య స్థానాలు మరియు సంస్కృతి మరియు వారసత్వానికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యెక వెబ్ సిరీస్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా పర్యాటక రంగంలో దేఖో అప్నాదేశ్ వేబ్ సిరీస్ సాంకేతిక సహాయం తో వాస్తవంగా ప్రదేశాలు మరియు గమ్యస్థానాలను సందర్శించడానికి ఇది సహాయపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేఖో అప్నా దేశ్ అనే వెబ్ సిరీస్ ను ప్రారంబించిన పర్యాటక మంత్రిత్వ శాఖ
ఎవరు: పర్యాటక మంత్రిత్వ శాఖ
ఎక్కడ:న్యు డిల్లి
ఎప్పుడు: ఏప్రిల్ 15
కోవిడ్ -19 నమూనాల ఫూల్ టెస్టింగ్ ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ :

రాష్ట్రాలలో కోవిద్ -19 నమూనాల ఫూల్ టెస్టింగ్ ను ప్రారంభించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ను(ఐసిఎంఆర్) ఉత్తర ప్రదేశ్ కు అనుమతిని ఇచ్చింది. దీంతో ఫూల్ టేస్టింగ్ ప్రారంభించిన తొలి రాష్ట్రము గా ఉత్తర ప్రదేశ్ నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 558 కోవిద్-19 కేసులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కేసులు నమోదు అయినట్లు కనుగోనబడ్డాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిడ్ -19 నమూనాల ఫుట్ టెస్టింగ్ ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్
ఎవరు: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: ఉత్తరప్రదేశ్
ఎప్పుడు: ఏప్రిల్ 15
కోవిద్ -19 రోగులకు ఆయుర్వేదం ను ఉపయోగించిన మొదటి రాష్ట్రము గోవా:

కోవిద్-19 రోగులు మరియు నిర్బందించిన వారికీ రోగ నిరోధక శక్తి ని పెంచడానికి అల్లోపతి మరియు ఆయుర్వేదాన్ని కలిపిన ఉపయోగించిన మొదటి రాష్ట్రము గా గోవా నిలిచింది. ఆయుర్వేధ అభ్యాసకుడైన కోవిద్-19 రోగులతో వ్యవహరించే వైద్యులకు సంప్రదించి చికిత్స చేయబడుతుంది. కోవిద్-19 పాజిటివ్ రోగులకు అల్లోపతి ఆయుర్వేధం తో వారి రోగ నిరోధక శక్తిని పెంచే మొదటి రాష్ట్రము గా గోవా ఉంటుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిద్ -19 రోగులకు ఆయుర్వేదం ను ఉపయోగించిన మొదటి రాష్ట్రము గోవా
ఎవరు: గోవా
ఎప్పుడు:ఏప్రిల్ 15
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
అధునాతన మిస్సైళ్ళ విక్రయానికి అమెరికా ఆమోదం:

భారత్ కు 155 మిలియన్ల డాలర్ల విలువైన హర్ఫూన్ బ్లాక్2 ఎయిర్ లాంచ్ మిసైల్లు,తేలికపాటి టోర్పిడో లు విక్రయించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిస్సైళ్ళ విక్రయానికి ఏప్రిల్ 13న అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే 10ఎజిఎం -84 ఎల్ హర్ఫూన్ బ్లాక్-2ఎయిర్ లాంచ్ మిస్సైల్,16 ఎంకె ఈ54 లైట్ వెయిట్ టోర్పిడో లు,మూడు ఎంకె 54 ఎక్సర్సైజ్ టార్పిడో లు భారత్ కు రానున్నాయి. భారత్ కు ప్రాంతీయంగా తలెత్తే ముప్పును తిప్పికోట్టడానికి ఈ ఆయుధాలు ఉపయోగపడుతున్నాయి. విమానాల నుంచి ప్రయోగించే హర్ఫూన్ క్షిపణులను శత్రు నౌకల విద్వంసానికి ఉపయోగిస్తారు. వీటిని భారత నౌక దళంలో పి -8ఐ విమానాల్లో అమరుస్తారు. శత్రు జలర్గాముల విద్వంసానికి ఉపయోగ పడే ఎంకె 54 టోర్పిడో లను రేథియాన్ కంపెని తయారు చేస్తోంది. ఈ హర్ఫూన్ క్షిపణులను బోయింగ్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అధునాతన మిస్సైళ్ళ విక్రయానికి అమెరికా ఆమోదం
ఎవరు: అమెరికా
ఎప్పుడు: ఏప్రిల్ 15
కరోనా వైరస్ సోకి పాక్ క్రికెటర్ జాఫర్ కన్నుమూత :

పాకిస్థాన్ మాజీ క్లాస్ క్రికెటర్ అయిన జాఫర్ సర్ఫరాజ్ కోరనా వైరస్ సోకి మృతి చెందాడు.పాక్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 50ఏళ్ల జాఫర్ చికిత్స పొందుతూ ఏప్రిల్ 13 న కన్నుమూశారు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ అయిన జాఫర్ సర్ఫరాజ్ తన కెరీర్లో 6వన్డే లో ఆడి96 పరుగులు చేశాడు.1988 నుంచి 94 వరకు 15ఫాస్ట్ క్లాస్ మ్యాచ్ లో పెషావర్ కు ప్రాతినిథ్యం వహింఛి 616పరుగులు,1990 నుంచి 92 వరకు లిస్ట్-ఏ క్రికెట్ ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం జాఫర్ సీనియర్ జట్టుతో పాటు అండర్ -19 జట్టు కోచ్ గా పనిచేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కరోనా వైరస్ సోకి పాక్ క్రికెటర్ జాఫర్ కన్నుమూత
ఎవరు: జాఫర్ సర్ఫరాజ్
ఎప్పుడు: ఏప్రిల్ 15
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |