Daily Current Affairs in Telugu 08-09-2020
ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ బెల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు :

ఇంగ్లాండ్ క్రికెటర్, ఇయాన్ బెల్ 2020 దేశీయ సీజన్ ముగింపులో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అవుతానని ప్రకటించాడు. అతను 2004 లో అరంగేట్రం చేశాడు. అతను ఇంగ్లాండ్ టీం తరపున అయన 118 టెస్టులు, 161 వన్డేలు మరియు 8 టి 20 లు ఆడాడు. టెస్ట్ క్రికెట్పై దృష్టి పెట్టడానికి 2015 లో వన్డేల నుంచి రిటైర్ అయ్యాడు. అతని జట్టు ప్రతినిత్యం లో ఐదు యాషెస్ సిరీస్లను గెలుచుకున్నాడు. అతను 2013 సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, 62.44 సగటుతో 562 పరుగులు చేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ బెల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: ఇయాన్ బెల్
ఎక్కడ: ఇంగ్లాండ్
ఎప్పుడు: సెప్టెంబర్ 08
విఆర్ వో వ్యవస్థ రద్దు బిల్లులను ఆమోదించిన తెలంగాణా రాష్ట్ర మంత్రి మండలి :

సులువుగా.పారదర్శ కంగా. స్నేహపూర్వకంగా ప్రజలకు రెవెన్యూ సేవలు అందించేలా ప్రభుత్వం రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టం అంతిమ లక్ష్యాలతో. అక్రమాలకు తావులేకుండా భూ లావాదేవీలు సులభంగా పూర్తవ్వాలనే మ్యుటే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న భూ రాజు, చేస్తూ ఆర్ ఓ ఆర్-2020ని అమల్లోకి రానుంది ఈ మేరకు సెప్టెంబర్ 07 శాసనసభలో , తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్-2020 ను ప్రవేశ పెట్టింది, వీలర్ ఓ వ్యవస్థ రద్దు చేస్తూ మంత్రివర్గం ఆమోదించిన బిల్లును కూడా సభలో ప్రవేశ పెడతారు సెప్టెంబర్ 07న మంత్రి మండలి ఈ బిల్లుల ముసాయిదాలకు ఆమోదముద్ర వేసింది. కొత్త చట్టం ద్వారా భూ నిర్వహణలో సరి కొత్త మార్పులకు ప్రభుత్వం స్వీకారం చుట్టనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: విఆర్ వో వ్యవస్థ రద్దు బిల్లులను ఆమోదించిన తెలంగాణా రాష్ట్ర మంత్రి మండలి
ఎవరు: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ౦
ఎక్కడ: తెలంగాణా రాష్ట్రo
ఎప్పుడు: సెప్టెంబర్ 08
తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయిన సి.పార్థసారధి :

విశ్రాంత ఐఏఎస్ అధి కారి సి. పార్థసారథి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నర్గా నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.గవర్నర్ తమి సై గారి ఆమోదంతో రాష్ట్ర పంచాయతీరాజ్ సెప్టెంబర్ 08 ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.మాజీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి పదవీ విరమణ చేసినప్పటి నుంచీ ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఆయన స్థానంలో పార్థసారథి బాధ్యతలు చేపట్టనున్నారు అనేక హోదాల్లో సేవలు ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలో పార్థసారథి అనేక , హోదాల్లో సేవలు అందిం చారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాల యంలో ఎంఎస్సీ (వ్యవసాయం) చేసిన ఆయన 1988 జులై లో విజయనగర ఆర్డివో గా బాద్యతలు చేపట్టారు.1993 లో ఐఎఎస్ హోదా పొందిన ఈయన తొలుత 1996 నవంబర్ లో అదిలాబాద్ లో డిఆర్డి ఏ పిడి గా బాద్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయిన సి.పార్థసారధి
ఎవరు: సి.పార్థసారధి
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: సెప్టెంబర్ 08
హైపర్ సోనిక్ టెక్నాలజీ డిమాన్ స్త్రేషన్ వెహికల్ విజయవంతంగా ప్రయోగించిన భారత్ :

శత్రువు పై మెరుపు వేగంతో విరుచుకుపడే భవిష్యత్ తరం క్షిపనులు వైమానిక వ్యవస్థల రూపకల్పనకు దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది.స్వదేశి పరిజ్ఞానంతో రూపొందించిన హైపర్ సోనిక్ టెక్నాలజీ డిమాన్ డిమాన్ స్త్రేషన్ వెహికల్ (హెచ్ ఎస్టిడివి) ను సెప్టెంబర్ 08న విజయవంత౦గా పరీక్షించింది.తద్వారా హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అబివృద్ది చేసే సత్తా కలిగిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరింది.హెచ్ ఎస్టిడివి హైపర్ సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ స్క్రాంజెట్ సాంకేతికతో తయారైంది.రక్షణ పరిశోదన ,అబివృద్ది సంస్థ (డిఆర్ డివో) దీన్ని అబివృద్ది చేసింది.ద్వాని కన్నా ఆరు రెట్లు వేగంగా దూసుకెళ్ళే(మ్యుక్ 6) దీర్గ శ్రేణి క్షిపణులు వైమానిక వ్యవస్థ ఇంజిన్ హెచ్ఎస్టిడివి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అనేక క్షిపనులలో వాడుతున్న రాం జెట్ సాంకేతికతకు భిన్నంగా ఈ సాధనలో స్క్రాం జెట్ పరిజ్ఞానం ను ఉపయోగించారు.రాం జెట్ ఇంజిన్ తోనే మ్యుక్ 3వేగం మాత్రమే సాద్యం అవుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: హైపర్ సోనిక్ టెక్నాలజీ డిమాన్ స్త్రేషన్ వెహికల్ విజయవంతంగా ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 08
ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త గోవింద్ స్వరూప్ కన్నుమూత :

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ గోవింద్ స్వరూప్(B1) సెప్టెంబర్ 07 న రాత్రి కన్నుమూశారు. దేశం లోని ప్రఖ్యాత రేడియో ఖగోళ శాస్త్రవేత్తలు ఆయన ముందు వరుసలో ఉంటారు. 1929లో జన్మించిన ప్రొ.గోవింద్ స్వరూప్ అలహాబాద్’ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ రేడియో ఖగోళశాస్త్ర రుగంలో విశేష కృషి చేశారు. ఆయన ఆధ్వర్యంలో రూపు దిద్దుకున్న ఊటీ, జీఎంఆర్టీ టెలిస్కోప్ కారణంగా భారత్ ఈ రంగంలో ప్రపంచ స్థాయి దేశాల సరసన చోటు సంపాదించింది. ఆయన సేవలకు గుర్తుగా ప్రభుత్వం పద్మశ్రీ భట్నాగర్ అవార్డు ప్రదానం చేసింది. బ్రిటన్లోని ప్రఖ్యాత రాయల్ సొసైటీ సభ్యుడిగానూ ఆయన సేవలందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త గోవింద్ స్వరూప్ కన్నుమూత
ఎవరు: గోవింద్ స్వరూప్
ఎక్కడ: స్త్రేషణ్ న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 08
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |