Daily Current Affairs in Telugu 07-08-2020
ఇంకాయిస్ డైరెక్టర్ గా నియమితులయిన శ్రీనివాస్ కుమార్ :

హిందూ మహాసముద్రంలో తీర ప్రాంతంలో లోని 25దేశాలకు సునామి హెచ్చరికలు అందజేసే ఇంకాయిస్ (భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం) డైరెక్టర్ గా తెలుగు వ్యక్తి తుమ్మలశ్రీనివాస్ కుమార్ ఈ నెల 27 న ఆయన బాద్యతలు తీసుకోనున్నారు.అధునాతన సాంకేతికతతో తీర ప్రాంత ప్రజలను విపత్తుల నుంచి రక్షించే పలు ఆవిష్కరణ లకు ప్రపంచ ఖ్యాతి గడించిన హైదరాబాద్ లో ని ఇంకాయిస్ కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపిక అయిన మొదటి డైరెక్టర్ గా ఆయనకు గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇంకాయిస్ డైరెక్టర్ గా నియమితులయిన శ్రీనివాస్ కుమార్
ఎవరు: శ్రీనివాస్ కుమార్
ఎప్పుడు: ఆగస్ట్ 07
యుపి ఎస్సి చైర్మన్ గా ప్రదీప్ కుమార్ జోషి నియామకం :

యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపఎస్సి ) చైర్మన్ గా ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ జోషి గారు నియమితులయ్యారు.ఇంతవరకు చైర్మన్ గా ఉన్న అరవింద్ సక్సేనా తన పదవి విరమణ కాలం ఆగస్ట్ 06 తో ముగియండం తో ఆ స్థానం లోకి ప్రదీప్ కుమార్ జోషి గారు వచ్చారు.2021 మే 12 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. ప్రదీప్ జోషి 2015 నుంచి యుపిఎస్సి సభ్యునిగా పని చేస్తున్నారు. అంతకుముందు ఛత్తీస్ గడ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా చేశారు. యుపి ఎస్సి చైర్మన్ గా ప్రదీప్ కుమార్ జోషి నియామకం తో కమిషన్ లో ఓ సబ్యుని స్థానం ఖాళి అయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: యుపి ఎస్సి చైర్మన్ గా ప్రదీప్ కుమార్ జోషి నియామకం
ఎవరు: ప్రదీప్ కుమార్ జోషి
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: ఆగస్ట్ 07
చైనా కు చెందిన యాప్ లపై అమెరికా నిషేధం విధింపు:

చైనా కు చెందిన సామాజిక మాద్యమ యాప్ లు టిక్ టాక్ వుయ్ చాట్ లపై అమెరికా కూడా నిషేధం విధించింది.ఈమేరకు అద్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ రెండు కార్య నిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు.అవి దేశ బద్రత ఆర్ధిక వ్యవస్థకు ముప్పు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి వస్తుందని తెలిపారు.భారత్ కూడా ఈ యాప్ లపై వేటు వేసిన విషయాన్నీ ప్రస్తావించారు.టిక్ టాక్ ,వియ్ చాట్ లను మొట్టమొదట భారత్ నిషేధించింది. చైనా కు చెందిన మొత్తం 106 యాప్ ల పై వేటు వేసింది. ఈ చర్యను అప్పట్లోనే ట్రాంప్ సర్కారుస్వాగతించింది.మన జాతీయ బద్రతను రక్షించుకొవదానికి టిక్ టాక్, వియ్ చాట్ ల యాజమాన్యం పై గట్టి చర్యలు తీసుకోవాలి అని అమెరికా అద్యక్షుడు ట్రంప్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చైనా కు చెందిన యాప్ లపై అమెరికా నిషేధం విధింపు
ఎవరు: అమెరికా
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: ఆగస్ట్ 07
పులిట్జర్ ప్రైజ్ విన్నింగ్ నవలా రచయిత షిర్లీ ఆన్ గ్రా కన్నుమూత :

ప్రఖ్యాత కల్పిత నవల రచయిత, పులిట్జర్ బహుమతి గ్రహీత షిర్లీ ఆన్ గ్రా ఇటీవల కన్నుమూశారు. ఆమె జూలై 8, 1929 న యునైటెడ్ స్టేట్స్లోని లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ లో జన్మించింది. ఆమె ఆరు నవలలు మరియు నాలుగు చిన్న కథలను రాసింది, ఇవి న్యూ ఓర్లీన్స్ నుండి ఉత్తర లూసియానా మరియు అలబామా వరకు డీప్ సౌత్లో ని నేపద్యం లో ఉన్నాయి. ఆమె మొదటి పుస్తకం, ది బ్లాక్ ప్రిన్స్ 1954 లో ప్రచురించబడింది. 1965 లో షిర్లీ తన యొక్క నాలుగవ పుస్తకం “ది కీపర్స్ ఆఫ్ ది హౌస్” ద్వారా పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పులిట్జర్ ప్రైజ్ విన్నింగ్ నవలా రచయిత షిర్లీ ఆన్ గ్రా కన్నుమూత
ఎవరు: షిర్లీ ఆన్ గ్రా
ఎప్పుడు: ఆగస్ట్ 07
శ్రీలంక ప్రధానిగా నాలుగో సారి విజయం సాధించిన మహింద రాజపక్స :

శ్రీలంక రాజకీయాల్లో రాజపక్స కుటుంబం మరో సారి తన ఆధిపత్యాన్ని నిరోపించుకుంది.ఆదేశ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో ఆ కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో నడిచే శ్రీలంక పీపుల్స్ పార్టీ (ఎస్ఎల్పిపి) మాజీ ప్రదాని రనీల్ విక్రమ సింఘే కు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్పి)పై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం స్థానాల్లో మూడింట రెండువంతులు ఆ పార్టీ కే దక్కాయి. 225స్థానాలున్న పార్లమెంట్ లో ప్రదాన మంత్రి మహింద రాజపక్స నేతృత్వంలో ని ఎస్ఎల్పిపి దాని మిత్ర పక్షాలు 150 స్థానాల్లో విజయ పతాకం ఎగురవేసారు.ఎస్ఎల్పిపి కి సొంతంగా 145 స్థానాలు దక్కడం విశేషం పోలైన 68 లక్షల ఓట్లలో 59.9శాతం ఈ పార్టీ కే లబించాయి. ఉత్తర కోలోంబో లోని శివారులోని ప్రసిద్ద బౌద్ద ఆలయం కేలేనియలో ఆగస్ట్ 09న మహింద రాజపక్స నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: శ్రీలంక ప్రధానిగా నాలుగో సారి విజయం సాధించిన మహింద రాజపక్స
ఎవరు: మహింద రాజపక్స
ఎక్కడ: శ్రీలంక
ఎప్పుడు: ఆగస్ట్ 07
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |