Daily Current Affairs in Telugu 06 June-2022
యూనివర్సిటీలకు ఇకపై ముఖ్య మంత్రే చాన్సలర్ గా వ్యవహరించే లా నిర్ణయం తీసుకున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం :

పశ్చిమబెంగాల్లో యూనివర్సిటీలకు ఇకపై గవర్నర్ బదులుగా ముఖ్య మంత్రే చాన్సలర్ గా వ్యవహరిస్తారు. మే 06న సీఎం మమతా బెనర్జీ సార ర్యంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెట్టనుంది. ప్రైవేట్ వర్సిటీల విజిటర్ హోదాను కూడా గవర్నర్ నుంచి రాష్ట్ర విద్యా మంత్రికి బదలాయించారు. గవర్నర్ ధనకర్ తో మమతకు పొసగని విషయం తెలిసిందే. బెంగాల్ క్యాబినెట్ కొత్త ప్రతిపాదనకు ఓకే చెప్పింది. రాష్ట్ర పరిధిలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలకు సీఎం మమతా బెనర్జీనే ఛాన్సలర్గా నియమిస్తూ చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సాధారణంగా రాష్ట్ర గవర్నర్ మాత్రమే వర్సిటీలకు ఛాన్సలర్ గా ఉంటారు. అయితే ఆ రాష్ట్ర గవర్నర్ జగదీష్ ధంకార్ స్థానంలో ఇక నుంచి మమతా బెనర్జీయే ఛాన్సలర్గా ఉండనున్నారు.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని : కోల్ కతా
- పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి : మమతా బెనర్జీ
- పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ : ధనకర్
క్విక్ రివ్యు :
ఏమిటి : యూనివర్సిటీలకు ఇకపై ముఖ్య మంత్రే చాన్సలర్ గా వ్యవహరించే లా నిర్ణయం తీసుకున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
ఎవరు: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
ఎక్కడ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం
ఎప్పుడు : మే 06
సరికొత్త రికార్డు నెలకొల్పిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు జవాన్లు :

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ) జవాన్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. 50 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అబీ గామిన్ పర్వతం సమీపంలో సముద్ర మట్టానికి 22,850 అడుగుల ఎత్తున యోగా సాధన చేశారు. ఈ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఒకవైపు దట్టమైన మంచు. వణికించే చలి… * అయినప్పటికీ మొక్కవోని దీక్షతో యోగాసనాలు సులువుగా పూర్తిచేశారు. ఐటీబీపీ బృందం ఈ నెల 2వ తేదీన అబీ గామిన్ పర్వత శిఖరానికి చేరుకుంది. ‘బద్రీ విశాలీ కీ జై’ అని నినదిస్తూ యోగా సాధనకు శ్రీకారం చుట్టింది. ఈ. పర్వతం భారత్- టిబెట్ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో ఇది రెండో అతిపెద్ద పర్వతం, బృందంలో మొత్తం 14 మంది ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సరికొత్త రికార్డు నెలకొల్పిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు జవాన్లు
ఎవరు: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు జవాన్లు
ఎక్కడ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో
ఎప్పుడు : మే 06
ఆరోగ్య సంరక్షణ అభియాన్ ‘అంచల్’ అనే కార్యక్రమం ప్రారంబించిన రాజస్తాన్ ప్రభుత్వం :

రాజస్థాన్లో, గర్భిణీ స్త్రీల కోసం కరౌలి జిల్లాలో ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అభియాన్ ‘అంచల్’ ప్రారంభించబడింది. ఈ అభియాన్ ద్వారా 13 వేల మందికి పైగా మహిళలు లబ్ది పొందారు.13, 144 మంది గర్భిణీ స్త్రీలకు వారి హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షించారు, వారిలో 11,202 మంది రక్తహీనత ఉన్నట్లు కనుగొనబడింది.
- రాజస్తాన్ రాష్ట్ర రాజధాని :జైపూర్
- రాజస్తాన్ రాష్ట్ర సిఎం : అశోక్ గెహ్లాట్
- రాజస్తాన్ రాష్ట్ర గవర్నర్ :కల్ రాజ్ మిశ్రా
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆరోగ్య సంరక్షణ అభియాన్ ‘అంచల్’ అనే కార్యక్రమం ప్రారంబించిన రాజస్తాన్ ప్రభుత్వం
ఎవరు: రాజస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ: రాజస్తాన్ లో
ఎప్పుడు : మే 06
ప్రత్యెక వికలాంగుల కోసం మ్యూజియం ఆఫ్ పాజిబిలిటీసిని ఏర్పాటు చేసిన తమిళనాడు ప్రభుత్వం :

దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటగా, తమిళనాడు రాష్ట్ర కమిషనరేట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది డిఫరెంట్లీ డిజబుల్డ్ వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన మ్యూజియం ఆఫ్ పాజిబిలిటీసిని ఏర్పాటు చేయబడింది మరియు నగరంలో అందుబాటులో ఉండే ప్రదేశాలకు నమూనాగా ఉండాలనే లక్ష్యంతో ఉంది. సుమారు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కోటి రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మ్యూజియం ఆఫ్ పాసిబిలిటీస్ ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు పారంభించారు. అనేక విషయాలతోపాటు లేని గా
- తమిళనాడు రాష్ట్ర రాజధాని : చెన్నై
- తమిళనాడు రాష్ట్ర సిఎం : ఎన్.కే స్టాలిన్
- తమిళనాడు రాష్ట్ర గవర్నర్ : బన్వర్ లాల్ పురోహిత్
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రత్యెక వికలాంగుల కోసం మ్యూజియం ఆఫ్ పాజిబిలిటీసిని ఏర్పాటు చేసిన తమిళనాడు ప్రభుత్వం
ఎవరు: తమిళనాడు ప్రభుత్వం
ఎక్కడ: తమిళనాడు
ఎప్పుడు : మే 06
బెస్ట్ కన్జర్వేటర్‘ అవార్డు అందుకున్న జల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్య నారాయణ :

అంతర్జాతీయ పర్యావ రణ పరిరక్షణ దినో సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన జల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్య నారాయణకు తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ కన్జర్వేటర్’ అవార్డు అందించింది. తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ప్రకటించిన ఈ అవార్డును హైదరాబాద్ లో ఆదివారం జరిగిన కార్యక్ర మంలో నీటిపారుదల, పర్యావరణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆయనకు అందజేశారు. జల సాధన సమితి ఏర్పాటు చేసి ఫ్లోరైడ్ నుంచి జిల్లా విముక్తికి పోరాడడంతో పాటు పర్యావరణ పరిరక్షణడు తన 70 ఎకరాల సొంత భూమిలో అడవిని సృష్టించినందుకు ప్రభుత్వం సత్యనారాయ అను ఈ అవార్డుతో సత్కరించింది.
- తెలంగాణా రాష్ట్ర రాజధాని :హైదరాబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం : కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి : బెస్ట్ కన్జర్వేటర్’ అవార్డు అందుకున్న జల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్య నారాయణ
ఎవరు: దుశ్చర్ల సత్య నారాయణ
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు : మే 06
నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేసిన ఓడిశా రాష్ట్రప్రభుత్వం :

2019లో ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ పట్నాయక్ గారు తాజాగా నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేశారు.13మంది కేబినెట్ మంత్రులుగా 8మంది సహాయ మంత్రులుగా(ఇండిపెండెంట్) స్థానం దక్కించుకోగా వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేసిన ఓడిశా రాష్ట్రప్రభుత్వం
ఎవరు: సిఎం నవీన్ పట్నాయక్
ఎక్కడ: ఓడిశా రాష్ట్ర౦
ఎప్పుడు : మే 06
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |