Daily Current Affairs in Telugu 02-03-2020
ఆదాయపు వసూల్లో తెలంగాణది 7వ స్థానం :

ఆదాయపు వసూళ్ళలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఏడో స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 14స్థానం కు పరితమైంది.దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి 15వరకు రూ.9లక్షల కోట్ల ఆదాయపు పన్ను కేంద్ర ఖజానాకు జమకాగా అందులో తెలంగాణా నుంచి రూ.37,806 కోట్లు (4.1%),ఆంద్ర ప్రదేశ్ నుంచి రూ.13,446 కోట్లు (1.4%)వసూలై నట్లు కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.ఈ మేరకు ఆయన మార్చ్ 02 న లోక్సభలో ఓ లికిత పూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.2016-17 నుంచి 2019 -20 ఫిబ్రవరి 15 వరకు నాలుగేళ్లలో దేశ ఖజానాకు ఆదాయపు పన్ను కింద రూ.30.39 లక్షల కోట్లు రాగా అందులో 3.98 %తెలంగాణ నుంచి ,1.57 %ఆంద్ర ప్రదేశ్ వసూళ్లు సగటున 13.14% వృద్ది చెందగా తెలంగాణాలో 15.16% ,ఆంద్ర ప్రదేశ్ లో 11.95 %వృద్ది నమోదైంది.ఆదాయపు పన్ను రూపంలో దేశ ఖజానాకు మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 34.23% వాటా అందుతోంది. జనాభా పరంగా దేశంలో తొలి స్థానంలో ఉండే ఉత్తర ప్రదేశ్ పన్ను విషయనికోచ్చేసరికే 9వ స్థానానికి పరిమితమైంది.బిహార్ చివరి వరుసలో నిలిచింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆదాయపు వసూల్లో తెలంగాణది 7వ స్థానం
ఎవరు:తెలంగాణ
ఎప్పుడు: మార్చ్ 02
నోకియా సియివో రాజీవ్ సూరి రాజీనామా :

ఫిన్లాండ్ మొబైల్ దిగ్గజం నోకియా అద్యక్షుడు సియివోగా ఉన్నభారత సంతతికి చెందిన రాజీవ్ సూరి వైదొలుగుతున్నట్లు వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేసినట్లు కంపెని తెలిపింది.ఇక కొత్త అద్యక్షుడు ,సియివో గా పెక్కా లుండ్ మార్క్ ను నోకియా డైరెక్టర్ ల బోర్డు నియమించింది. 2020 సెప్టెంబర్ నుంచి ఆయన బాద్యతలు చేపట్టనున్నారు.గత 25 ఏళ్లుగా నోకియా లో సూరి పని చేశారు.ప్రస్తుత పదవిలో ఆగస్టు 31 వరకు సూరి కొనసాగుతారు. ఇక 2021 జనవరి 1వరకు నోకియా బోర్డులో సలహాదారుడిగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: నోకియా సియివో రాజీవ్ సూరి రాజీనామా
ఎవరు:రాజీవ్ సూరి
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు: మార్చ్ 02
మెక్సికో ఓపెన్ టైటిల్ విజేతగా రాఫెల్ నాదల్ :

ప్రపంచ రెండో ర్యాంకర్ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 2020 ఏడాది తన ఖతాలో తొలి టైటిల్ ను అందుకున్నాడు.మెక్సికో లోని అకాపుల్కో లో మార్చి 01 న ముగిసిన మెక్సికో ఓపెన్ ఏటిపి -500 టోర్నీలో 33 ఏళ్ల నాదల్ చాంపియన్ గా నిలిచాడు.ఏక పక్షంగా జరిగిన జరిగిన ఫైనల్లో నాదల్ 6-3,6-2 తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) పై గెలిచాడు .గతంలో నాదల్ 2013 ,2015 లలో విజేతగా నిలిచాడు.ఓవరాల్ గా నాదల్ కెరీర్లో ఇది 85 వ సింగిల్స్ టైటిల్ .విజేతగా నిలిచిన నాదల్ కు 3,72,785 డాలర్ల ప్రైజ్ మనీ (రూ.2కోట్ల 69 లక్షలు)తో పాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లబించాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: మెక్సికో ఓపెన్ టైటిల్ విజేతగా రాఫెల్ నాదల్
ఎవరు:రాఫెల్ నాదల్
ఎక్కడ:మెక్సికో
ఎప్పుడు: మార్చ్ 02
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
హైదరాబాద్ లోప్రారంబం కానున్న ఐడియాస్ ఫర్ ఇండియా కంక్లేవ్ :

ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భారతదేశం వైపు చూస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)లో ఇండియాస్ ఫర్ ఇండియా -2020 పాలసీ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ఆయన మార్చి01 ప్రారంబించారు.అనతరం అయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లోభారత్ దుసుకు పోతున్నారురాజస్థాన్ రాజదాని జైపూర్ వార్షిక సిఎఫ్ ఓ లీడర్ షిప్ కంక్లేవ్ శ్రీ సిటీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ఆర్.నాగరాజన్ ప్రతిష్టాత్మక అవార్డు ను అందుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: హైదరాబాద్ లోప్రారంబం కానున్న ఐడియాస్ ఫర్ ఇండియా కంక్లేవ్
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు:మార్చ్ 02
జిఈ అధిపతి జాక్ వెల్ష్ కన్నుమూత :

జనరల్ ఎలిక్త్రిక్ (జిఈ)ను అత్యంత లాభదాయక బహుళ జాతి కంపెని గా తీర్చిదిద్దిన జాక్ వెల్ష్ ఇక లేరు .కార్పోరేట్ నాయకులకే గురువుగా పేరున్న ఆయన మార్చ్ 02 న మరణిచినట్లు జిఈ ద్రువ్వికరించిది.అయన వయసు 84 ఏళ్ళు కిడ్నీ వైపల్యం కారణంగా మృతి చెందినట్లు జాక్ మూడో బార్య మాజీ న్యూయార్క్ టైమ్స్ కు వెల్లడించారు.జిఈకి 1981 -2001 మద్య రెండు దశాబ్దాల పాటు చైర్మన్ ,చీఫ్ ఎగ్సిక్యుతివ్ గా అయన పని చేసిన అమెరికాలోనే అత్యంత ప్రఖ్యాత ,కార్పోరేట్ నాయకుల్లో ఒకడిగా వెల్ష్ పేరు మారుమోగింది..ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా జిఈ అవతరించడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: జిఈ అధిపతి జాక్ వెల్ష్ కన్నుమూత
ఎవరు: జాక్ వెల్ష్
ఎక్కడ:బోస్టన్
ఎప్పుడు: మార్చ్ 02
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |