
Daily Current Affairs in Telugu 29-06-2020
మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా అదనపు బాద్యతలు స్వీకరించిన ఆనందిబెన్ పటేల్ :

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా ప్రస్తుతం ఉన్న ఆనంది బెన్ పటేల్ కు ఇటీవల మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ గా అదనపు బాద్యతలు అప్పగించారు. ప్రస్తుత మధ్యప్రదేశ్ గవర్నర్ జూన్ 11 నుండి లాల్జీ టాండన్ లక్నో లో చికిత్స పొందుతున్న కారణంగా ఆమె తన స్వంత విధులతో పాటుగా మద్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా కూడా విధులను నిర్వర్తించనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా అదనపు బాద్యతలు స్వీకరించిన ఆనంది బెన్ పటేల్
ఎవరు: ఆనంది బెన్ పటేల్
ఎక్కడ: మధ్యప్రదేశ్
ఎప్పుడు: జూన్ 29
ఎన్.పి.సి 49వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన పియూష్ గోయల్ :

ఇటివాల జరిగిన ఉత్పాదక జాతీయ ఉత్పాదక మండలి (ఎన్.పి.సి) 49 వ పాలక మండలి సమావేశానికి వాణిజ్య పరిశ్రమల మంత్రి ఎన్.పి.సి పాలక మండలి అద్యక్షుడు శ్రీ పియూష్ గోయల్ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశ౦లో పాల్గొన్నవారు వివిధ రంగాలలో భారతదేశం యొక్కఉత్పాదకత స్థాయిని పెంచడం పై చర్చించారు.మరియు అధిక నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సృష్టించడం కోసం ఆకాడమియో మరియు పరిశ్రమల అనుసందానం ఆర్ధిక రంగాలను నడిపించే అవకాశం ఉన్న అత్యున్నత రంగాలను గుర్తించడం వంటి వివిధ సలహాలను ముందుకు తీసుకువచ్చారు. ముఖ్యంగా వ్యవసాయం మరియు లాజిస్టిక్స్ రంగాలలో ఎన్.పి.సి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాలికను రూపొందించం మరియు ఉత్పాదకత పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ముఖ్య ఉద్దేశం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎన్.పి.సి 49వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన పియూష్ గోయల్
ఎవరు: పియూష్ గోయల్
ఎప్పుడు: జూన్ 29
ఐసిసి ఎలైట్ ప్యానెల్ లో చేరిన మూడో వ్యక్తీ గా నిలిచిన భారత అంపైర్ నితిన్ మీనన్ :

మాజీ కెప్టెన్ శ్రీనివాస్ వెంకట్రామన్ మరియు సుందరం రవి తరువాత ప్రతిష్టాత్మక ప్యానెల్ లో చోటు దక్కించుకున్న మూడో వ్యక్తి గా భారతీయ వ్యక్తిగా నితిన్ మీనన్ నిలిచారు. రాబోయే 2020-21 సీజన్ కు జూన్ 28 న జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐఐసి) ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్ లో భారతదేశానికి చెందిన నితిన్ మీనన్ ను చేర్చారు. మీనన్ ఇంగ్లాండ్ కి చెందిన నిగేల్ లాంగ్ స్థానంలో ఈయన ఉన్నారు. 2011-12 లో 28ఏళ్ల వయసులో తనఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అఫిషియేట్ అయినప్పటి నుంచి నితిన్ భారత క్రికట్ లో అత్యంత స్థిరమైన అంపైర్ లలో ఒకరిగా నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసిసి ఎలైట్ ప్యానెల్ లో చేరిన మూడో వ్యక్తీ గా నిలిచిన భారత అంపైర్ నితిన్ మీనన్
ఎవరు: నితిన్ మీనన్
ఎప్పుడు: జూన్ 29
వెలిగల్లు రిజర్వాయర్ కు వై ఎస్సార్ రిజర్వాయర్ గా పేరు నామారణం:

వైఎస్సార్ కడప జిల్లలో గాలి వీడు మండలం లో పాపాగ్ని నదిపై నిర్మించిన వేలిగట్టు రిజర్వాయర్ కు వైఎస్సార్ వెలిగట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా నామకరణం చేశారు.ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేఖ ప్రదాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ జూన్ 26 న ఉత్తర్వులు జారి చేశారు. జలయజ్ఞం లో బాగంగా 2006 లో దివంగత నేత అయిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. వెలిగల్లు రిజర్వాయర్ కు వైఎస్సార్ పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ గడీల కోట శ్రీకాంత్ చేసిన ప్రతిపాదన నకు ప్రబుత్వం ఆమోద ముద్ర వేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: వెలిగల్లు రిజర్వాయర్ కు వై ఎస్సార్ రిజర్వాయర్ గా పేరు నామారణం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ౦
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: జూన్ 29
ఆర్బికే సేవల పర్యవేక్షణకు రూపొందించిన వైఎస్సార్ యాప్ :

రైతు బరోసా కేంద్రాల ద్వారా అందించే సేవలను మరింతగా సమర్దవంతంగా పర్యవేక్షిచెందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జూన్ 26 న సిఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంబించారు. ఈ యాప్ ద్వారా రైతులకు అందే సేవలు సిబ్బంది పని తీరు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ అర్బికే లలోని పరికరాల నిర్వహణా క్షేత్ర స్థాయి లో రైతులకు అవసరాలు మెరుగైన సేవలకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను రియల్ టైం లో ఉన్నత స్థాయి వరకు తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికార్లు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్బికే సేవల పర్యవేక్షణకు రూపొందించిన వైఎస్సార్ యాప్
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ౦
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: జూన్ 29
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |