
Daily Current Affairs in Telugu 24-01-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
రెండోసారి ఐసీసీ మేటి మహిళా క్రికెటర్ అవార్డుకు ఎంపికైన స్మృతి మందానా :

భారత అమ్మాయిల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన రెండోసారి ఐసీసీ అవార్డుకు ఎంపికైంది. 2021 లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల లోనూ అద్భుత ప్రదర్శన చూపి మేటి మహిళా క్రికెటర్ గా నిలిచింది. ఈ విషయాన్ని ఐసీసీ ఇటీవల ప్రకటించింది. ఈ అవార్డు రేసులో టామీ బీమాంట్ (ఇంగ్లాండ్), లిజెల్లె లీ (దక్షిణాఫ్రికా), గాబీ లూయిస్ (ఐర్లాండ్) ను మందాన వెనక్కి నెట్టింది. లిజెల్లె ఉత్తమ వన్డే క్రికెటర్ గా నిలిచింది. ఐసీసీ టీ20 మహిళల జట్టులోనూ ఆమె చోటు దక్కించుకుంది.. 2018 సంవత్సరం లోనూ తను ఈ అవార్డు అందుకుంది. అప్పుడు వన్డేల్లోనూ మేటి మహిళా క్రికెటర్ గా నిలిచింది. జులన్ గోస్వామి (2007లో) మాత్రమే మందాన కంటే ముందు ఓవరాల్ గా మేటి మహిళా క్రికెట్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: రెండోసారి ఐసీసీ మేటి క్రికెటర్ అవార్డుకు ఎంపికైన స్మృతి మందానా
ఎవరు: స్మృతి మందానా
ఎప్పుడు: జనవరి 24
ఐసీసీ మేటి పురుష క్రికెటర్ అవార్డుకు ఎంపికైన పాకిస్తాన్ క్రికెటర్ షహీన్ షా అఫ్రిది :

పాకిస్థాన్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిది మేటి పురుష క్రికెటర్ గా ఎంపికయ్యాడు. ఇతని వయసు 21 ఏళ్ల . ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్సు గల క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. గతేడాది మూడు ఫార్మా ట్లలో కలిపి 36 మ్యాచ్ లో 78 వికెట్లు పడగొ ట్టారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ వన్డే క్రికెటర్ అవార్డును అందుకుంటాడు. 21 ఏళ్ల అతను నిరుడు ఆరు వన్డేల్లో 87, 50 సగటు తో 405 పరుగులు చేశాడు. గతేడాది సుదీర్ఘ ఫార్మాట్ లలో ఆమోఘంగా రాణించిన ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ టెస్టు క్రికెటర్ అవార్డుకు ఎంపికయ్యాడు. నిరుడు 15 టెస్టుల్లో 61 సగటుతో 1708 పరుగులు సాధించాడు. ఈ అవార్డు కోసం పోటీపడిన అశ్విన్ కు నిరాశే మిగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఎరాస్మస్ మూడో సారి మేటి అంపైర్ గా నిలిచారు.
- పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ :బాబర్ ఆజం
- పాకిస్తాన్ దేశ రాజధాని : ఇస్లామాబాద్
- పాకిస్తాన్ దేశ కరెన్సీ : పాకిస్తాన్ రుపియ
- పాకిస్తాన్ దేశ ప్రదాని : ఇమ్రాన్ ఖాన్
- పాకిస్తాన్ దేశ అద్యక్షుడు : ఆరిఫ్ ఆల్వి
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసీసీ మేటి పురుష క్రికెటర్ అవార్డుకు ఎంపికైన పాకిస్తాన్ క్రికెటర్ షహీన్ షా అఫ్రిది
ఎవరు: షహీన్ షా అఫ్రిది
ఎప్పుడు: జనవరి 24
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారం గెలుచుకున్న సిక్కోలు బాలిక :

శ్రీకాకుళం జిల్లాలోని పొన్నాం గ్రామా నికి చెందిన గురుగు హిమప్రియకు ధైర్య సాహసాల విభాగంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారం దక్కింది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ అవార్డును అందజేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి బాలికతో పాటు తల్లిదం డ్రులు గురుగు సత్యనారాయణ, పద్మావతి, కలెక్టర్ శ్రీకేష్ బి. లక్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమప్రియ మాట్లాడుతూ ‘నా తండ్రే నాకు ఆదర్శం. 2018లో నా తండ్రి ఉద్యోగ రీత్యా జమ్మూకశ్మీర్ ఆర్మీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న సమయంలో ఓ రోజు ఇంట్లో నేను, నా తల్లి పద్మావతి ఉన్నప్పుడు తీవ్రవాదులు మారణాయుధాలతో క్వార్టర్స్ పైకి దాడి చేశారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన దాడిలో తల్లికి తీవ్రగాయమైంది. ఆ సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకుని నా తల్లితో పాటు క్వార్టర్స్ లోని కొంత మందిని కాపాడుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారం గెలుచుకున్న సిక్కోలు బాలిక
ఎవరు: సిక్కోలు బాలిక గురుగు హిమప్రియ
ఎప్పుడు: జనవరి 24
ఆపరేషన్ సర్డ్ హవా ను ప్రారంబించిన భారత మొదటి రక్షణ శ్రేణి బి.ఎస్.ఎఫ్ :

భారతదేశపు మొదటి రక్షణ శ్రేణి ‘బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్’ జనవరి 23 నుండి 28 వరకు “ఆపరేషన్ సర్డ్ హవా” కింద రాజస్థాన్ లోని పాకిస్తాన్ సరిహద్దు వెంబడి తన నిఘాను పెంచుతూ చొరబాటు ఉదంతాలను తనిఖీ చేయడం మరియు రాజస్థాన్లోని జైసల్మేర్లోని సరిహద్దు ప్రాంతాలపై భద్రతను పెంచడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ ను భారతదేశం యొక్క పశ్చిమ అంతర్జాతీయ సరిహద్దులో జరుగుతుంది. భారత దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో బి.ఎస్.ఎఫ్ ప్రతి సంవత్సరం వేసవిలో “ఆపరేషన్ గరం హవా” మరియు శీతాకాలంలో “ఆపరేషన్ సర్డ్ హవా” నిర్వహిస్తుంది. ఈ సమయంలో ప్రధాన కార్యాలయంలోని సిబ్బంది మరియు అధికారులందరూ సరిహద్దులోనే ఉంటారు మరియు 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షిస్తారు. భారతదేశంలోని ఏడు కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో బి.ఎస్.ఎఫ్ అనేది ఒకటి.
- బి.ఎస్.ఎఫ్ స్థాపన :1965
- బి.ఎస్.ఎఫ్ ప్రధాన కార్యాలయం :న్యూ డిల్లి
- బి.ఎస్.ఎఫ్ నినాదం : డ్యూటీ అన్ టు డెత్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆపరేషన్ సర్డ్ హవా ను ప్రారంబించిన భారత మొదటి రక్షణ శ్రేణి బి.ఎస్.ఎఫ్
ఎవరు: బి.ఎస్.ఎఫ్
ఎప్పుడు: జనవరి 24
జాతీయ బాలికల దినోత్సవంగా జనవరి 24 :

ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతీయ సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివిధ రకాల అసమానతలపై అవగాహన కల్పించేందుకు మరియు ఆడపిల్లల హక్కులను ప్రోత్సహించడానికి మరియు స్త్రీ విద్య, ఆరోగ్యం మరియు పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ బాలికల దినోత్సవంగా జనవరి 24
ఎప్పుడు: జనవరి 24
అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జనవరి 24 :

ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ శాంతి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడంలో విద్య యొక్క అవసరం మరియు దాని యొక్క ప్రాముఖ్యత ను సూచించడానికి ప్రతి సంవత్సరం జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మారుతున్న విద్యా విధానాలపై వెలుగు నింపడం మరియు విద్యను ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడంలో సాంకేతికత పాత్ర పోషిస్తోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జనవరి 24
ఎప్పుడు: జనవరి 24
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |