
Daily Current Affairs in Telugu 14-02-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
ఎయిరిండియా సియివో గా ఇల్కర్ ఐచీ ని నియామకం :

టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్ ఐచీ (51)ని ఎయిరిండియా ముఖ్య కార్యనిర్వహ ణాధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమించినట్లు టాటా సన్స్ ప్రకటించింది. ఐచీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి ఎయి రిండియా బోర్డు సమావేశమైంది. విస్తృత స్థాయి చర్చల అనంతరం ఈ నియామకం జరిగిందని టాటా సన్స్ పేర్కొంది. బోర్డు సమావేశానికి టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారని తెలిపింది. ఏడాది ఏప్రిల్ 1న లేదా అంతకంటే ముందే ఐచీ బాధ్యతలు స్వీకరిస్తారని వివరించింది. ఐచీ నియామకానికి నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎయిరిండియా సియివో గా ఇల్కర్ ఐచీ ని నియామకం
ఎవరు: ఇల్కర్ ఐచీ
ఎప్పుడు: ఫిబ్రవరి 14
వింటర్ ఒలింపిక్స్ సరికొత్త రికార్డు సృష్టించిన అమెరికా అథ్లెట్ ఎరిన్ జాక్సన్ :

శీతాకాల ఒలింపిక్స్ అమెరికా అర్గెట్ ఎరిన్ జాక్సన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల 500మీ. స్పీడ్ స్కేటింగ్ స్వర్ణం సాధించిన ఆమె ఈ క్రీడలో ఒలింపిక్ పతకం అందుకున్న తొలి నల్ల జాతీయురాలిగా నిలిచింది. 1991 ర్వాత ఈ విభాగంలో ఆ దేశానికి దక్కిన మొదటి పతకమిదే ఎరిన్ 37.04 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. తకాగి (జపాన్: 37. 12 గొలి కోవా (ఆర్ సీ 37 21న) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకు న్నారు. పోటీల్లో భాగంగా ఇద్దరు అత్లేట్ల మధ్య ఒక్కో రేసు నిర్వహించారు. ఇలా రేసులన్నీ పూర్తయ్యే సరికి ఉత్తమ టైమింగ్ మోదు చేసిన ఎరిన్’ విజేతగా నిలిచింది. నిజానికి 20 ఏళ్ల ఎరిన్ ఈ ఒలింపిక్స్ పాల్గొనేందుకు నిర్వహించిన యుఎస్ ట్రయల్స్ సందర్భంగా రేవులో జారి మూడో స్థానానికే పరిమితమైంది.
- చైనా దేశ రాజధాని : బీజింగ్
- చైనా దేశ కరెన్సీ : రెన్మిన్ బి
- చైనా దేశ అద్యక్షుడు : జిన్ పింగ్
క్విక్ రివ్యు :
ఏమిటి: వింటర్ ఒలింపిక్స్ సరికొత్త రికార్డు సృష్టించిన అమెరికా అథ్లెట్ ఎరిన్ జాక్సన్
ఎవరు: అథ్లెట్ ఎరిన్ జాక్సన్
ఎక్కడ:చినా బీజింగ్ లో
ఎప్పుడు: ఫిబ్రవరి 14
పీఎస్ఎల్వీ-సి 52 ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో :

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సి 52 ప్రయోగం విజయవంత మైంది. ఈ వాహకనౌక ద్వారా భూపరిశీలన గ్రహం ఈవోఎస్-04. మరో రెండు చిన్న ఉపగ్ర హాలు నిర్ణీత కక్ష్యలోకి దూసుకెళ్లాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం ఉదయం 5.59 గంటలకు పార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈవో ఎస్-04. ఐఎన్ఎస్-2డి ఇన్స్పైర్ శాట్ 1 ఉపగ్రహాలను పరిపించింది. ఇస్రోకు 312లో ఇది తొలి ప్రయోగం. ప్రయోగ వేదిక నుంచి వాహకనౌక బయలుదేరిన 17 షాల తర్వాత ప్రణాళిక ప్రకారం ఈవోఎస్ 01 గ్రహాన్ని నిర్దేత కక్ష్యలో ప్రవేశపెట్టింది.నిమిషం తర్వాత ఐ ఎన్ ఎస్ – 2టిడి ఇన్ స్పైర్ షాట్ -1 ఉపగ్రహ లను కూడా నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది.
- ఇస్రో స్థాపన : 1969 ఆగస్ట్ 15
- ఇస్రో స్థాపించింది : విక్రం సారాభాయ్
- ఇస్రో ప్రదాన కార్యాలయం : బెంగళూర్
క్విక్ రివ్యు :
ఏమిటి: పీఎస్ఎల్వీ-సి 25 ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో
ఎవరు: ఇస్రో
ఎప్పుడు: ఫిబ్రవరి 14
సీబీఎస్ఈ చైర్మన్ గా అదనపు బాద్యతలు చేపట్టిన వినీత్ జోషి :

కేంద్ర విద్యా మంత్రిత్వశాల అదనపు కార్య దర్శి ‘వినీత్ జోషికి సీబీఎస్ఈ చైర్మన్ గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఇదే పదవిలో ఉన్న మనోజ్ అహుజా ఇటీవల వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో ఓఎస్.డి గా నియమితులయ్యారు. దీంతో ఆ స్థానంలోకి వినీత్ జోషి వచ్చారు. మణిపుర్ కేడర్ -1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ గతంలో సీబీఎస్ఈ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ గానూ కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సీబీఎస్ఈ చైర్మన్ గా అదనపు బాద్యతలు చేపట్టిన వినీత్ జోషి
ఎవరు: వినీత్ జోషి
ఎప్పుడు: ఫిబ్రవరి 14
మొట్టమొదటిసారిగా పౌర గగనతలంలో డ్రోన్ ను అనుమతించిన దేశంగా నిలిచిన ఇజ్రాయెల్ :

ఇజ్రాయెల్ యొక్క రవాణా మరియు రహదారి భద్రత మంత్రిత్వ శాఖ మొట్టమొదటిసారిగా తమ పౌర గగనతలంలో మానవరహిత వైమానిక వ్యవస్థ (UAS) యొక్క ధృవీకరణ అధికారికంగా ఆమోదించింది. ఇది ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది.
- ఇజ్రాయెల్ దేశ రాజధాని : జెరూసలేం
- ఇజ్రాయెల్ దేశ కరెన్సీ :ఇజ్రాయెల్ షెకెల్
- ఇజ్రాయెల్ దేశ అద్యక్షుడు :ఇసాక్ హీర్జోక్
- ఇజ్రాయెల్ దేశ ప్రదాని :నఫ్తాలి బెన్నెట్
క్విక్ రివ్యు :
ఏమిటి: మొట్టమొదటిసారిగా పౌర గగనతలంలో డ్రోన్ ను అనుమతించిన దేశంగా నిలిచిన ఇజ్రాయెల్
ఎవరు: ఇజ్రాయెల్
ఎప్పుడు: ఫిబ్రవరి 14
సెబి లోని సలహా కమిటీ కి నూతన అద్యక్షుడిగా జి మహాలింగం నియామకం :

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఐపిఇఎఫ్)పై తన సలహా కమిటీని పునర్నిర్మించింది.కాగా సెబీ లో మాజీ హోల్ టైమ్ మెంబర్ అయిన జి మహాలింగం ను ఎనిమిది మంది సభ్యుల కమిటీకి కొత్త అధ్యక్షుడిగా నియమించబడ్డారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సెబి లోని సలహా కమిటీ కి నూతన అద్యక్షుడిగా జి మహాలింగం నియామకం
ఎవరు: జి మహాలింగం
ఎప్పుడు: ఫిబ్రవరి 14
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |