
Daily Current Affairs in Telugu 14-01-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
లొంగేవాలా లో భారీ జాతీయ పతాకం ను ఎగరవేస్తున్న భారత్ :

భారత్ పాకిస్తాన్ దేశ సరిహద్దు సమీపంలో భారీ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రదర్శించనున్నారు.ఖాదీ వస్త్రంతో ప్రత్యేకంగా తాయారు చేస్తున్న ఈ జెండా ప్రపంచంలోనే అతి పొడవైనది.1971 లో పాకిస్తాన్ దేశ చారిత్రాత్మక యుద్ధం జరిగిన రాజస్థాన్ లోని లొంగే వాళ వద్ద దీనిని ప్రదర్శించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.జనవరి 15 న సైనిక దినోత్సవం సందర్బంగా అక్కడ భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఆ జెండా యొక్క పొడవు225 అడుగులు మరిఉ వెడల్పు 150 ఉండే ఈ పతాకం బరువు 1400 కిలోలని చిన్న మద్య తరహా పరిశ్రమల శాఖ వెల్లడించింది.ఈ భారీ పతాకాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ఇది ఐదో సారి .
క్విక్ రివ్యు :
ఏమిటి: లొంగేవాలా లో భారీ జాతీయ పతాకం ను ఎగరవేస్తున్న భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: లొంగేవాలా లో
ఎప్పుడు: జనవరి 15
ఐదవ అత్యంత వేడి సంవత్సరం గా గుర్తించిన భారత వాతావరణ శాఖ :

దేశంలోనే గత శతాబ్ద కాలంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయిన సంవత్సరాలలో 2021 ఐదో స్థానం లో నిలిచిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.1901 నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పరంగా 2016,2009,2017,2010 మొదటి నాలుగు స్థానాలలో ఉండగా వాతావరణ ఉష్ణోగ్రత ఆ తర్వాత స్థానం లో 2021 చేరింది.గత ఏడాది సగటు వాతావరణ ఉష్ణోగ్రత కంటే 0.44 డిగ్రీల సేల్సియన్ అధికంగా నమోదు అయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐదవ అత్యంత వేడి సంవత్సరం గా గుర్తించిన భారత వాతావరణ శాఖ
ఎవరు: భారత వాతావరణ శాఖ
ఎప్పుడు: జనవరి 15
భారత ఆర్మీ దినోత్సవంగా జనవరి 15:

భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్గా ఫీల్డ్ మార్షల్ కోదండర ఎం. కరియప్ప ఆఖరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ రాయ్ బుచెర్ నుండి బాధ్యతలు స్వీకరించినందుకు గుర్తుగా, భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే జరుపుకుంటారు. భారతదేశం, 15 జనవరి 1949 నుంచి దీనిని జరుపుకుంటున్నారు. ఈ రోజును దేశ రాజధాని న్యూ ఢిల్లీలో అలాగే అన్ని ప్రధాన కార్యాలయాలలో కవాతులు మరియు ఇతర సైనిక ప్రదర్శనల రూపంలో జరుపుకుంటారు. జనవరి 2022న, భారతదేశం తన 74వ భారత సైనిక దినోత్సవాన్ని న్యూఢిల్లీలో జరుపుకుంది. దేశాన్ని మరియు దాని పౌరులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు సెల్యూట్ చేసే రోజును ఆర్మీ డే సూచిస్తుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత ఆర్మీ దినోత్సవంగా జనవరి 15
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: జనవరి 15
స్వచ్చ విద్యాలయ పురస్కార్ ను ప్రారంబించిన విద్య శాఖా మంత్రి సుభాష్ సర్కార్ :

విద్యా శాఖా మంత్రి సుభాష్ సర్కార్ స్వచ్చ విద్యాలయ పురస్కార 2021-2022 ను ప్రారంబించారు. మరింత విశదీకరించిన రాష్ట్ర మంత్రి స్వచ్చ విద్యాలయ పురసారం నీరు పారిశుద్యం మరియు పరిశుబ్రత రంగం లో ఆదర్శప్రాయం ఐన పనిని చేపట్టిన పాటశాల ను గుర్తించి స్పూర్తినిస్తూ౦దని మరియు అవార్డులను అందజేస్తుందని ఉద్గాటించారు.అదే విదంగా భవిష్యత్ లో మరిన్ని మెరుగుదలలు చేసేందుకు పాటశాల లకు ఒక బెంచ్ మార్క్ మరియు రోడ్ మ్యాప్ ను అందింస్తుందన్నారు. స్వచ్చ విద్యాలయ పురస్కారం ను పాటశాల విద్యా మరియు అక్షరాస్యత విభాగం ద్వారా 2016-17 లో స్వయం ప్రేరణ మరియు పారిశుద్యం గురించి అవగాహన కల్పించడం కోసం మొదటిసారిగా పంపిణి చేసారు. జాతీయ స్థాయిలో ఈ ఏడాది లో ఓపెన్ కేటగిరి లో మొత్తం 40 పాటశాలలు ఎంపిక చేసారు
క్విక్ రివ్యు :
ఏమిటి: స్వచ్చ విద్యాలయ పురస్కార్ ను ప్రారంబించిన విద్య శాఖా మంత్రి సుభాష్ సర్కార్ :
ఎప్పుడు: జనవరి 15
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |