
Daily Current Affairs in Telugu 10-05-2020
హిందు మహాసముద్ర ద్వీప దేశాలకు సహాయం చేయడానికి భారత్ ప్రవేశపెట్టిన కార్యక్రమం మిషన్ సాగర్ :

కరోనా వైరస్ సంక్షోబం మద్య తూర్పు హిందు మహాసముద్ర ప్రాంత దేశాలకు సహాయం అందించడానికి భారత ప్రభుత్వం మిషన్ సాగర్ అనే ఒక కార్యక్రమంను ప్రారంబించింది. ఈ మిషన్ కింద హిందు మహా సముద్రంలో ని ఐదు ద్వీప దేశాలైన మాల్దీవులు,మారిషస్ ,సీషల్స్,మడగాస్కర్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు రెండు వైద్య సహయ బృందాలను అవసరమైన ఆహార వస్తువులు మరియు కోవిద్-19 సంబందిత మందులు మరియు ప్రత్యేక ఆయుర్వేద ఔషదాలు తీసుకువెళ్ళనున్నాయి. వీటి రవణా కోసం ఇండియన్ నావల్ షిప్ (ఐఎన్ఎస్) కేసరి ని నియమించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : హిందు మహాసముద్ర ద్వీప దేశాలకు సహాయం చేయడానికి భారత్ ప్రవేశపెట్టిన కార్యక్రమం మిషన్ సాగర్
ఎవరు : భారత ప్రబుత్వం
ఎప్పుడు : మే10
భారతీయ కోవిద్ -19 వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్ తో ఐసీఎం ఆర్ భాగస్వామ్యం :

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసర్చ్ (ఐసిఎంఆర్) భారతీయ బయోటెక్ ఇంటర్ నేషనల్ లిమిటెడ్ తో జతకట్టి స్వదేశి కోవిద్-19 వ్యాక్సిన్ ను అబివృద్ధి చేసింది.పూనే లోని ICMR యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV లో కోవిద్ -19 రోగుల నుండి వేరు చేయబడిన వైరస్ జాతుల సహాయంతో దీనిని అబివృద్ది చేస్తుంది. ఐసీఎంఆర్ భారత్ బయోటెక్ తో సంస్క్రతిని నిర్వహించగలిగిన 11 వైరస్ జాతులలో ఒక దాన్ని కూడా పంచుకుంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారతీయ కోవిద్-19 వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్ తో ఐసీఎంఆర్ భాగస్వామ్యం
ఎవరు : ఐసీఎంఆర్
ఎప్పుడు : మే10
భూమిపై తొలిసారిగా సూపర్ క్రిటికల్ సివో-2ను గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు :

భూమి పై తొలిసారి సాజసిద్దమైన సూపర్ క్రిటికల్ కార్బన్ డై ఆక్సైడ్ సివో-2 ను చైనాకు చెందిన శాస్త్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో 1400 మీటర్ల లోతున గల వాటిని రామన్ డిటెక్షన్ ఇంస్ట్రుమెంట్ తో ఈ సూపర్ క్రిటికల్ కార్బన్ డై ఆక్సైడ్ ను కనుగొన్నారు. డ్రై క్లీనింగ్ ,పెట్రోలియం సాల్వెంట్లలో సూపర్ క్రిటికల్ సివో-2 ను ఉపయోగించారు. అయితే దీనిని ఇప్పటి వరకు సహజ సిద్దమైన ఉన్న రూపంలో గుర్హ్తించలేదు జీవం ఆవిర్భావానికి అవసరమైన అమినో ఆమ్లాలు ,సేంద్రియ పదార్థాల పరిరక్షణలో ఈ సూపర్ క్రిటికల్ కార్బన్ డై ఆక్సైడ్ (సివో-2) కీలక పాత్ర పోషించింది అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భూమిపై తొలిసారిగా సూపర్ క్రిటికల్ సివో-2 గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు
ఎప్పుడు : మే 10
పారా ఒలింపియన్ క్రీడాకారిణి దీపా మాలిక్ ఆటకు రిటైర్మెంట్ :

భారత పారా అథ్లెట్ రియో పారా ఒలింపిక్స్ షాట్ పుట్ (ఎఫ్53) ఈవెంట్ రజత పతక విజేత దీపా మాలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు మే 10 న అధికారికంగా ప్రకటించింది. అయితే తాను గతేడాది సెప్టెంబర్ 16వ తేదిన ఆట నుంచి తప్పుకున్నానని ఈ మేరకు భారత పారా ఒలింపిక్ కమిటీ లేఖను అందజేశానని తెలిపింది. నిభంధనల ప్రకారం ఆటకు వీడ్కోలు పలికాకే ఫిబ్రవరిలో జరిగిన భారత పారా ఒలింపిక్ కమిటీ (పిసిఐ) అద్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజేతగా నిలిచి ఆ పదవిని స్వీకరించినట్లు 49 ఏళ్ల దీపా స్పష్టం చేసింది.స్
క్విక్ రివ్యు :
ఏమిటి : పారా ఒలింపియన్ క్రీడాకారిణి దీపా మాలిక్ ఆటకు రిటైర్మెంట్
ఎవరు : దీపా మాలిక్
ఎప్పుడు : మే 10
ఫెడ్ కప్ అవార్డును గెలుచుకున్న టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా :

అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిత్యం వహిస్తూ నిబద్దత గుండె దైర్యం ప్రదర్శిస్తూ గొప్ప విజయాలు అందించినందుకు గాను భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తగిన గుర్తింపు లబించింది. 2020 సంవత్సరానికి గాను ఆసియా ఓసియానియా జోన్ లో సానియా మిర్జాకు ఫెడ్ కప్ హార్ట్ పురస్కారం దక్కింది. ఈ అవార్డు గెలుచుకున్నతొలి భారత టెన్నిస్ ప్లేయర్ గా సానియా నిలిచింది. చాంపియన్ షిప్ ఫెడ్ కప్ టోర్నీలో భాగంగా దుబాయి లో మార్చిలో జరిగిన ఆసియా ఒసియనియో జోన్ క్వాలిఫైర్ లో భారత్ రన్నర్ అప్ గా నిలిచి తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించడం లో సానియా మిర్జా కీలక పాత్ర పోషించింది. 2016 తర్వాత సానియా ఫెడ్ కప్ లో భారత్ కు ప్రాతినిత్యం వహించింది. దక్షిణ దక్షిన కొరియా,ఇండోనేషియ,చైనీస్ టైపి,ఉజ్బెకిస్తాన్ ,చైనా జట్టు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ రన్నరప్ ఆ నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫెడ్ కప్ అవార్డును గెలుచుకున్న టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా
ఎవరు : సానియా మిర్జా
ఎప్పుడు : మే 10.
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |