
Daily Current Affairs in Telugu 08-05-2020
విదేశాల నుండి భారతీయులను తీసుకురావడానికి భారత పబుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ మిషన్ :

భారత ప్రబుత్వం వందే భారత్ మిషన్ పేరుతో అతిపెద్ద తరలింపు కార్యక్రమంను ప్రారంబించింది.ఈ కార్యక్రమంలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న దాదాపు 15 వేల మంది భారతీయ పౌరులను ప్రబుత్వం తిరిగి తీసుకువస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రకటించిన నేపద్యంలో విదేశాల్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయ పౌరులను స్వదేశాన్ని తీసుకురావడానికి ప్రబుత్వం మే 07 నుండి13 వరకు 64 విమానాలను నడుపుతుంది. వందే భారత్ మిషన్ అని పిలువబడే కార్యక్రమం విదేశంగ మంత్రి ఎన్.జై శంకర్ మే 05 న ఈ ఆపరేషన్ కోసం సన్నాహాలు ప్రారంబించాలని వ్యక్తులను ఆయా దేశాల్లోని భారత రాయబారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు .
క్విక్ రివ్యు :
ఏమిటి : విదేశాల నుండి భారతీయులను తీసుకురావడానికి భారత పబుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ మిషన్
ఎవరు : భారత ప్రబుత్వం
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు : మే 08
నానో సైన్స్ అండ్ టెక్ 2020 కెరీర్ అవార్డు ను గెలుచుకున్న సౌరభ్ లోదా యంగ్ :

ఐఐటీ బొంబాయి ప్రొఫెసర్ సౌరభ్ లోదా 2020 సంవత్సరానికి నానో సైన్స్ అండ్ టెక్నాలజీ లో యుంగ్ కెరీర్ అవార్డుతో సత్కరించారు. లాజిక్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీ ల అబివ్రుద్దిలో రెండు డైమేన్షనల్ వాన్ దర్ వాల్స్ పదార్తంలో ఆదారంగా అయన చేసిన కృషికి గాను ఈ అవార్డును భారత ప్రబుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం డిఎస్టి స్థాపించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : నానో సైన్స్ అండ్ టెక్ 2020 కెరీర్ అవార్డు ను గెలుచుకున్న సౌరభ్ లోదా యంగ్
ఎవరు : సౌరభ్ లోదా యంగ్
ఎప్పుడు : మే 08
యుఎన్ టిపి నటి దియా మిర్జా ను గుడ్విల్ అంబాసిడర్ గా 2022 వరకు పొడగింపు :

ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్ఈపి ) బాలివుడ్ నటి పర్యావరణ వేత్త దియా మిర్జా పదవిని భారత దేశంలో ని గుడ్విల్ అంబాసిడర్ గా 2022 వరకు పొడగించింది. ఈ నటి ఐక్య రాజ్య సమితీ సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్ అడ్వకేట్ గుడ్విల్ అంబాసిడర్ గా స్వచ్చమైన గాలి,స్వచ్చ మైన సముద్రాలూ వన్య ప్రాణులు రక్షణ మరియు వాతావరణ మార్పులలో సహా కీలక రంగాలపై సందేశాన్ని మరింతగా వ్యాప్తి చేయడానికి నటి డియ మిర్జా యుఎన్ తో కలిసి పని చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : యుఎన్ టిపి నటి దియా మిర్జా ను గుడ్విల్ అంబాసిడర్ గా 2022 వరకు పొడగింపు
ఎవరు : దియా మిర్జా
ఎప్పుడు : మే08
తొలిసారిగా పాకిస్తాన్ వాయు సేనలో తొలి హిందు పైలెట్ నియామకం :

భారత్ కు దాయాది దేశమైన పాకిస్తాన్ వాయు సేనలో ( పిఎఎఫ్) లో తొలిసారిగా ఒక హిందు యువకుడు జనరల్ డ్యూటీ పైలెట్ ఆఫీసర్ గా నియమితులయ్యారు . సింధు ప్రావిన్స్ లో తార్పర్కర్ జిల్లాకి చెందిన రాహుల్ దేవ్ అనే ఒక హిందు యువకుడిని డ్యూటీ పైలెట్ ఆఫీసర్ గా నియమించినట్లు పిఎఎఫ్ తెలిపింది. వెనుకబడిన ప్రాంతమైన ఈ జిల్లా లో హిందువులు అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. పాక్ సైన్యం ,పౌర సేవల రంగాల్లో ఇప్పటికే మైనారిటీ వర్గాలకు చెందిన వారు పలువురు ఉద్యోగులుగా ఉన్నారు. పాకిస్తాన్ దేశ చరిత్రలో తొలిసారిగా పిఎఎఫ్ లో ఒక హిందువు ను జనరల్ డ్యూటీ పైలెట్ అధికారిగా నియమితులయ్యారని పాకిస్తాన్ అధికారిక రెడియో మే 06 న ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : తొలిసారిగా పాకిస్తాన్ వాయు సేనలో తొలి హిందు పైలెట్ నియామకం
ఎవరు : రాహుల్ దేవ్
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు : మే08
లేబర్ బ్యూరో డైరెక్టర్ జనరల్ గా డిపిఎస్ నేగి బాద్యతలు నిర్వహణ :

కార్మిక ఉపాధి మంతిరత్వ శాఖలో లేబర్ బ్యూరో డైరెక్టర్ జనరల్ గా భారతీయ ఆర్థిక సేవల అధికారి అయిన డిపిఎస్ నేగి గారు బాద్యతలు స్వీకరించారు. ఇది కాకుండా మంత్రిత్వ శాఖ సీనియర్ లేబర్ మరియు ఎంప్లాయ్ మెంట్ అడ్వైసేర్ గా కూడా నేగి బాద్యతలు స్వీకరించారు. అతను 1985 బ్యాచ్ యొక్క ఇండియన్ ఎకనామిక్ సర్వీసేవ్ (ఐఇ ఎస్)అధికారి . ఈ కొత్త నియామకానికి ముందు నేగి అడ్వైసర్ ఫైనాన్స్ (ఎంఎస్ ఎంఇ )గా పని చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : లేబర్ బ్యూరో డైరెక్టర్ జనరల్ గ డిపిఎస్ నేగి బాద్యతలు నిర్వహణ :
ఎవరు : డిపిఎస్ నేగి
ఎప్పుడు : మే08
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |